ఢిల్లీ లోని రాష్ట్ర పతి భవన్ దేశం లోనే ప్రతిష్టాత్మక భవనం గా పేరొందినది. చక్కని శిల్ప తీరు మాత్రమే కాక ఈ భవనం దేశ అధ్యక్షుడి నివాసంగా పేరు పొందినది.
దేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీ కి బదిలీ చేసినపుడు, ఈ భవనం వెలుగులోకి వచ్చింది. ఈ భవనాన్ని బ్రిటిష్ వైస్ రాయ్ నివాసం కొరకు మొగలాయి అట్టహాసం మరియు ఐరోపా శిల్ప శైలి రెండూ అమర్చి నిర్మించారు. సాంచి స్తూపం శైలి లో రెండు రంగుల శాండ్ స్టోన్ తో డోమ్ ను అందంగా నిర్మాణం చేసారు. ఈ డోమ్ ను ఎంతో దూరం నుండి కూడా చూడవచ్చు.
రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్ ను రంగు రంగుల మార్ బుల్ రాతితో ఎంతో విలాసవంతంగా నిర్మించారు. అశోక హాల్ పర్షియా స్టైల్ లో పెయింట్ కల సిలింగ్ మరియు చెక్క ఫ్లూరింగ్ ల తో నిర్మాణం చేసారు. భవనానికి కల రూఫ్ టాపులు, కిటికీలు, చాత్రి లు, మొదలైనవి మొదటి చూపులోనే పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
రాష్ట్రపతి కి అందుబాటు లో ఒక డ్రాయింగ్ రూమ్, ఒక డైనింగ్ రూమ్, ఒక విందు హాలు, ఒక టెన్నిస్ కోర్ట్, ఒక పోలో గ్రౌండ్, ఒక క్రికెట్ మైదానం మరియు ఒక మ్యూజియం వుంటాయి.
ఈ భవనం దానిలో 340 గదులతో నాలుగు అంతస్తులుగా వుంటుంది. దీని నిర్మాణం లో స్టీల్ ఉపయోగించ లేదు. భవన స్థంబాలకు భారతీయ దేవాలయాలలోని గంటలు వేలాట కట్టటం భవనానికి మరొక ప్రత్యేకత. ఈ గంటలు హిందూ, బౌద్ధ, మరియు జైన సంస్కృతులకు ప్రతీకగా నిలుస్తాయి.
ఇక్కడ కల ముఘల్ గార్డెన్ మొఘల్ మరియు బ్రిటిష్ స్టైల్ కలిగి వుంటుంది. ఇది సుమారు 13 ఎకరాల విస్తీర్ణం లో ఎన్నో రకాల ఆకర్షణీయ పూవులను కలిగి వుంటుంది. శిల్ప శైలి లోనే అపురూపంగా వుండే ఈ భవన సందర్శన, పర్యాటకులకు ఒక కన్నుల విందుగా వుంటుంది.