తమిళనాడు లోని ఈరోడ్ జిల్లలో ఉన్న భవాని జిల్లా మొత్తం మీద రెండవ అతి పెద్ద మునిసిపల్ పట్టణ౦. ఇది భవాని, కావేరి నదులు సంగమించే చోట ఉన్నందున స్థానికులు దీనిని ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ ప్రాంతంలో యాభై వేల కంటే ఎక్కువ జనాభా ఉంది. ప్రాధమికంగా ద్వీపకల్పద్వీపమైన ఈ పట్టణం ఈరోడ్ పట్టణానికి ఉత్తరాన ఉంది. చాలామంది ఈ ప్రాంతాన్ని దక్షిణాది త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఈ పట్టణం శివునికి చెందిన సంగమేశ్వర ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం చుట్టూ వేదగిరి, తిరుచేనగోడ్, మంగళగిరి, సంకగిర్, పద్మగిరి ఉన్నాయి. రాష్ట్రంలో ఈ పట్టణం తివాచి పరిశ్రమకు కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణంలోని తివాచీలు జాతీయ జయనినాదాన్ని కల్గించడమే కాక ఈ రాష్ట్ర ప్రజలు దీనిని తివాచి నగరంగా పిలుస్తారు.