మహిమలిశ్వర్ ఆలయం ఈరోడ్ టెంపుల్ టౌన్ కి దగ్గరలో ఉంది. ఇది ఈ పట్టణంలోని సెంట్రల్ బస్ స్టాండ్ నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. శివుని విగ్రహం ఉన్న ఈ ఆలయం గొప్ప చారిత్రిక విలువ కలిగినది. శివుడు ఉన్న మాలివరార్ శుభప్రదమైన వాటిలో ఒకటిగా భావిస్తారు. ఈ ఆలయంలో శివుడు ప్రధాన విగ్రహం, కానీ ఇక్కడ మా శక్తి విగ్రహం కూడా ఉంది. ఈమెను మరగదంబిగై గా ప్రస్తావిస్తారు. ఈ ఆలయంలో వినాయకుడు, బ్రహ్మ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ దైవత్వాన్ని ఈ ప్రాంతపు అతిపెద్ద ఆకర్షణగా పరిగణిస్తారు. స్థానిక ప్రజలు ఈ ఆలయ౦ గురించి అనేక కధలను చెప్తారు. అంతేకాకుండా, వారి భద్రత, రక్షణ శివుని చేతిలో ఉందని, ఆ దేవుని ఆశీర్వాదం వల్ల అన్నిరకాల కష్టాలను జయిస్తున్నారని నమ్ముతారు.