అస్సాం యొక్క సంస్కృతీ, సంప్రదాయాల గురించి తెలుసుకోవాలనుకుంటే అస్సాం స్టేట్ మ్యూజియం ని తప్పక సందర్శించాలి. గువహతి నడిబోడ్డులో అంటే దిఘలిపుఖురి ట్యాంక్ కి దక్షిణ చివరి భాగం లో ఉన్న ఈ మ్యూజియం లో పురావస్తు శాస్త్రం, శిలాశాసనం శాస్త్రం, నాణేల సేకరణ శాస్త్రం తో పాటు ఐకనోగ్రాఫి కి సంబంధించిన కళాఖండాలు ఉన్నాయి.
కమరుప అనుసంధాన్ సమితి(అస్సాం రీసెర్చ్ సొసైటీ) వారిచే 1940 లో ఈ మ్యూజియం నిర్మితమయింది. ఈ మ్యూజియం యొక్క వ్యవస్థాపకుడు కీ.శే. కంక్లాల్ బరువా. ప్రారంభం లో ఈ మ్యూజియం ప్రైవేటు పరం గా ఉన్నా ఆ తరువాత ప్రభుత్వ అధీనం లో కి వెళ్ళింది.
ప్రాచీన అస్సామీ నాణేలకి, గిరిజన కళలకి, శిల్పాలకి అలాగే సాంప్రదాయ వస్త్రాలకి ఈ మ్యూజియం ప్రసిద్ది చెందింది. ఈ రాష్ట్రం యొక్క సంస్కృతీ సంప్రదాయాలని ప్రోత్సహించడానికి ఈ మ్యూజియం హస్తకళలు మరియు చేనేత ప్రదర్శనలను నిర్వహిస్తుంది. మంగళవారం నుండి ఆదివారం వరకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం అయిదు గంటల వరకు ఈ మ్యూజియం పనిచేస్తుంది. నగరానికి నడిబోడ్డులో ఉన్న కారణంగా పర్యాటకులు ఈ మ్యూజియానికి సులభంగా చేరుకోవచ్చు.