మోతీ డూన్గ్రి లేదా పెరల్ హిల్ దగ్గరలోని రాజభవనం, మందిరం కారణంగా ప్రసిద్ది చెందాయి. జైపూర్ చివరి రాజైన రెండవ సవాయి మాన్ సింగ్ నివాసమైన ఈ రాజభవనం స్కాటిష్ కోటను పోలి ఉంది. తరువాత, ఇది రెండవ సవాయి మాన్ సింగ్ కుమారుడు జగత్ సింగ్ నివాసం అయింది. కొండపైన ఉన్న ఈ ఆలయంలో వినాయకుడి విగ్రహం ఉంది.