Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కాంచీపురం

కాంచీపురం - దేవాలయాల నగరం !

39

తమిళనాడులో ఇప్పటికి పాత కాలం నాటి వాసనలు కోల్పోక దానినే ఆకర్షణగా నిలుపుకున్న పురాతన నగరం కాంచీపురం. ఇక్కడ అనేక ఆలయాలు ఉండటం,మరియు పల్లవ రాజుల రాజధాని నగరంగా కూడా ప్రసిద్ది చెందింది. నేటికి కూడా నగరంను కొన్నిసార్లు కంచింపతి మరియు కంజీవరంఅని దాని పురాతన పేర్లతో పిలుస్తారు.విదేశీ పర్యాటకులు "వెయ్యి టెంపుల్స్ నగరం" గా మాత్రమే కాంచీపురం తెలుసు. ఇది కేవలం చెన్నై నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తమిళనాడు రాజధాని నుండి నగరంనకు సులభంగా చేరుకోవచ్చు.

ప్రతి హిందువు వారి జీవిత కాలం లో ఒక్కసారైనా సందర్శించవలసిన ఏడు పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా ఉంది. కాంచీపురం హిందువులు పూజించే నగరం. హిందూ మత పురాణాల ప్రకారం,ఏడు పవిత్ర ప్రదేశాలలో అన్నిటిని సందర్శించటం ద్వారా 'మోక్షం' లేదా ముక్తి ని సాధించవచ్చు.అలాగే ఈ నగరం విష్ణువు భక్తులు మరియు లార్డ్ శివ భక్తులకు పవిత్ర ప్రదేశం. కాంచీపురం నగరంలో శివుడు మరియు విష్ణువుకు అంకితం చేసిన అనేక ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో అత్యంత ప్రముఖమైన వాటిని 'పంచభూత స్థలములు' అంటారు. శివుడు ప్రాతినిధ్యం వహించే ఐదు ఆలయాల్లో ఒకటి. ఇంకా విష్ణువు కి అంకితం చేసిన ఎకంబరనత ఆలయం మరియు వరదరాజ పెరుమాళ్ ఆలయం ఉన్నాయి.

పవిత్రమైన నగరం

పవిత్రమైన నగరం ఎందుకంటే నగరం లోపల నిర్మించబడిన అనేక విష్ణు ఆలయాలకు పేరు పొందింది. "కా" అంటే లార్డ్ బ్రహ్మ సూచిస్తుంది మరియు "అంచి " అంటే విష్ణు పూజలు జరిగే ప్రదేశం కాబట్టి ఈ నగరంనకు కాంచీపురం అని పేరు వచ్చింది. అయితే, నగరంలో అనేక శివ దేవాలయాలు ఉన్నాయి. శివాలయాలు అత్యధిక సంఖ్య లో ఉంటాయి. కాంచీపురం తూర్పు ప్రాంతంను విష్ణు కంచి అని మరియు పశ్చిమ ప్రాంతంను శివ కంచి అని పిలుస్తారు.

కాంచీపురంలో ఇతర ప్రముఖ దేవాలయాలుగా కైలసనతార్ ఆలయం, కామాక్షీ అమ్మవారి ఆలయం, కచాపెశ్వరార్ ఆలయం మరియు కుమార కొట్టం టెంపుల్ ఉన్నాయి.

పవిత్రమైన మరియు చరిత్రల యొక్క కలయిక

ఈ నగరంనకు ఘనమైన చరిత్ర కలిగి ఉన్న కారణంగా చరిత్ర అభిమానులు ఖచ్చితంగా కాంచీపురం ఇష్టపడతారు. కంచిని పల్లవ రాజులు 3 వ మరియు 9 వ శతాబ్దాల మధ్య వారి రాజధానిగా చేసుకున్నారు.పల్లవులు తమ రాజధాని నగరాన్ని తయారు చేసేందుకు కృషి మరియు చాలా ధనాన్ని వెచ్చించారు. వారు బలమైన రోడ్లు, భవనం నిర్మాణాలు, ప్రాకారాల అలాగే నగరం చుట్టూ విస్తృత కందకము నిర్మించారు. చైనీస్ వ్యాపారులు కాంచీపురం నగరంలో వ్యాపారం చేసేవారు. పల్లవులు ఏడవ శతాబ్దంలో కొన్నిసార్లు నగరానికి వచ్చిన జువాన్జాంగ్ అనే చైనీస్ యాత్రికుడు తన యాత్రా చరిత్ర లో నగరాన్ని గురించి ధైర్యమైన మరియు సామాజిక న్యాయం విశ్వసించిన ప్రజల గురించి నేర్చుకున్నానని రాశాడు.

11 వ శతాబ్దంలో చోళ రాజులు కాంచీపురం పాలన చేపట్టారు, మరియు 14 వ శతాబ్దం వరకు నగరంను పరిపాలించారు. చోళులు కంచి వారి రాజధాని లేదు కానీ దీన్ని తర్వాత ఒక ముఖ్యమైన నగరంగా ఉంది. నిజానికి, చోళ రాజులు నగరం నిర్మాణంలో తూర్పు భాగం వైపుగా విస్తరించడం ప్రారంభించారు. 14 వ శతాబ్దం నుండి 17 వ శతాబ్దం వరకు విజయనగర రాజవంశం కాంచీపురం రాజకీయ నియంత్రణ కలిగి ఉంది . కొంతకాలం 17 వ శతాబ్దం చివరలో మరాఠాలు నగరాన్ని చేపట్టారు , కానీ వెంటనే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేతిలో ఓడిపోయాడు. భారతదేశంనకు ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వర్తకులు రావడంతో, నగరం బ్రిటీష్ సామ్రాజ్యం యొక్క నియంత్రణలో బ్రిటిష్ జనరల్ రాబర్ట్ క్లైవ్ పాలించారు.

నగరం యొక్క రిచ్ చారిత్రక వైభవం ఇప్పటికి పర్యాటకులకు కనిపిస్తుంది. వివిధ సంస్కృతుల ప్రభావం నగరంలో వివిధ నిర్మాణ కళ మరియు భవననిర్మాణలను చూడవచ్చు. వివిధ భారతీయ అలాగే పశ్చిమ ప్రభావాల సంపూర్ణ సమ్మేళనంతో, ఈ రోజు నగరం దాని దేవాలయాలతో నిండి ఉన్నది.

కాంచీపురం, పట్టు నగరం

కాంచీపురం పట్టు చీరలకు ప్రపంచవ్యాప్తంగా పేరు మరియు ప్రసంశలు పొందింది. ఆధునిక కాలంలో మహిళల ఇష్టమైన బంగారం జరి, పట్టు దారంలతో గత వైభవాన్ని ప్రదర్శిస్తుంది. ఇది ముఖ్యంగా దక్షిణ భారత దుస్తుల కోణం, కానీ అలాగే తమిళులకు ఒక సంప్రదాయ మరియు సాంస్కృతిక కోణం కూడా ఉంది.

ఈ పవిత్ర నగరంలో కామాక్షీ అమ్మవారి ఆలయం, ఎకంబరేశ్వర ఆలయం, దేవరాజస్వామి ఆలయం మరియు కైలసనతార్ ఆలయం వంటి సుప్రసిద్ధ దేవాలయాలు కోసం సంవత్సరం అంతటా పర్యాటకులు సందర్శిస్తారు.

కాంచీపురం రోడ్ ద్వారా, రైళ్లు ద్వారా దేశం యొక్క మిగిలిన నగరాలకు అనుసంధానించబడింది. సమీప విమానాశ్రయం చెన్నై లో ఉంది. కాంచీపురంలో వాతావరణం వేసవికాలాలు మరియు ఆహ్లాదకరంగా శీతాకాలాలు మధ్యకాలంలో ఊగిసలాడుతుంది.

కాంచీపురం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కాంచీపురం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కాంచీపురం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కాంచీపురం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం చాల మంది ప్రయాణికులు బస్సులు మరియు టాక్సీలు తేలికగా అందుబాటులో ఉండుట వల్ల రోడ్డు ద్వారా కాంచీపురం ప్రయాణంనకు ఇష్టపడుతున్నారు.ప్రతి రోజూ కాంచీపురం నుంచి చెన్నై కి బస్సులు నడపబడుతున్నాయి. ఒక బస్సు లో చెన్నై నుంచి కాంచీపురం చేరుకోవడానికి రెండు గంటల సమయం పడుతుంది. అయితే టాక్సీ లో వెళ్ళితే తక్కువ సమయం పడుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం కాంచీపురం లో రైలు బలమైన నెట్వర్కు ద్వారా దక్షిణ భారత నగరాలు అన్నిటికి అనుసంధానించబడి ఉంది. కాంచీపురం ఒక స్టేషన్ మరియు చెంగల్పట్టు-అర్రకోణం లైన్ లో చెంగల్పట్టు రైల్వే స్టేషన్ ఉంది. ప్రతి రోజు ప్రయాణికులకు రైలు చెన్నై మరియు కాంచీపురం మధ్య నడుస్తుంది మరియు కాంచీపురం చేరుకోవడానికి రెండు గంటల సమయం పడుతుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం కాంచీపురం సమీపంలో విమానాశ్రయం చెన్నై లో ఉన్న అన్నా అంతర్జాతీయ విమానాశ్రయం. చెన్నై తమిళనాడు రాజధాని మరియు ఇక్కడి నుండి తరచుగా విమానాలు జాతీయ ,అంతర్జాతీయ నగరాలకు అనుసందానము కలిగి ఉంది. కాంచీపురం నుండి చెన్నై విమానాశ్రయం 62 km దూరంలో ఉన్నది. చెన్నై విమానాశ్రయం నుండి కాంచీపురం కి చేరడానికి 70 నిమిషాలు పడుతుంది. మీరు విమానాశ్రయం నుండి కాంచీపురం చేరుకోవడానికి ఒక టాక్సీ లేదా రాష్ట్ర బస్సు లు ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu