కేరళలోని అతి ప్రాచీన మరియు పేరెన్నిక గన్న చర్చి ల లో సెయింట్ మేరీ చర్చి ఒకటి. కేరళ మొత్తం నుంచి భక్తులని ఆకర్షించే, భక్తులు తరచూ సందర్శించే ఆద్యాత్మిక కేంద్రం ఈ చర్చి. 835 ఏ డి నుంచి ఉన్నటువంటి చరిత కలిగినది ఈ చర్చి. కన్నెమేరీ మరియు పురాతన సెయింట్ సెబాస్టియన్ విగ్రహం భక్తులకు మరియు పర్యాటకులకు ముఖ్య ఆకర్షణగా నిలిచే ఈ చర్చి విశేషాలు.లియోనార్డ్ డి'క్రజ్ అనబడే పోర్చుగీసు నావికుడు ఈ విగ్రహాన్ని 1687 లో తీసుకు వచ్చాడని చరిత్ర చెబుతుంది.కొట్టాయం నుంచి 10 కిలో మీటర్ల దూరంలోఉన్నఈ చర్చికి రోడ్డు ద్వారా సులభం గా వెళ్ళవచ్చు. 19 శతాబ్దం తొలి నాళ్ళ నుండి ఈ చర్చి ఈ ప్రదేశం లోని ప్రజల ఆద్యాత్మిక సంస్కృతిక జీవనాన్ని ఏంతో ప్రభావితం చేసిందని చెప్పవచ్చు.ఈ చర్చి లో జరిగే పండుగలను ఇక్కడి ప్రజలు ఏంతో భక్తీ ఆరాధనలతో జరుపుకుంటారు. అంతేకాక ఎంతో మంది ప్రజలు ఈ చర్చి యొక్క ప్రాభవం వల్ల దర్శిస్తారు.