సయోమి బాఘ్ గా కూడా పిలిచే దయాల్ బాఘ్ లేదా దయా తోట రాధా సయోమి మత విశ్వాసానికి చెందిన ప్రధాన కార్యాలయం. ఈ విశ్వాసానికి చెందిన ఐదవ మత గురువు హుజూర్ సాహబ్జి మహారాజ్ వసంత పంచమి రోజున ఒక మల్బరీ చెట్టును నాటడం ద్వారా దీనిని 1915 లో ప్రారంభించాడు.
ఆగ్రా నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఒక అందమైన భూభాగంలో ఉన్న రాధాసయోమి సత్సంగ్ అనుచరులకు చెందిన ఈ కాలనీ ప్రతిరోజు ఏడాది పొడవునా పెద్ద సంఖ్యలో పర్యాటకులతో బాటుగా భక్తులను కూడా ఆకర్షిస్తుంది.
ఈ కాలనీ ఉన్న భూభాగం నిజానికి ఇసుక తిన్నెలతో కప్పబడి ఉండేది. కాని అంకితభావం, అలుపెరుగని ప్రయత్నాలతో దయాల్ బాఘ్ ను 1200 ఎకరాలలో విస్తరించి ఉన్న ఒక అందమైన పచ్చని తోటగా మార్చిన ఘనత ఈ విశ్వాసకులకు దక్కుతుంది.
ఈ కాలనీ ఒక అద్భుతమైన ఆలయానికి నివాసం. 110 అడుగుల ఎత్తులో ఉన్న దీనిని హిందూ వాస్తు రూపకల్పన, శైలిలో నిర్మించారు. దీనిని ఆకర్షించే సందర్శకులు సంఖ్య విషయంలో ఇది తాజ్ మహల్ కు ఒక గట్టి పోటీని ఇస్తుంది.



Click it and Unblock the Notifications