ఈ కలికో ముసియుం భారత దేశం లోనే మొట్టమొదటి టెక్స్టైల్ మ్యూజియం , ఇక్కడి విశేష సేకరణ ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి గడించినది.ఇక్కడ భారతదేశ నలుమూలల నుండి సేకరించిన అనేక రంగుల , రూపుల వస్త్రాలు , వివిధ రకాల నేత పద్దతులు స్కాలర్ లకు భారతదేశ విస్సా వస్త్ర సంపద పైన పరిశోధన చెయ్యటానికి అవకాశం కలిగిస్తాయి. శ్రీ గౌతమ్ సారా బాయి మరియు ఆయన సోదరి గిర సారా బాయి చే 1949 లో కలికో హౌస్ లో మొదలుపెట్టబడిన ఈ మ్యూజియం తర్వాత ఇప్పటి షాహీ బఘ్ ప్రదేశానికి 1983 లో మార్చబడింది.
1959 లో శ్రీమతి సరళ దేవి సారా బాయి చే ప్రారంభింపబడిన సార బాయి ఫౌండేషన్ ఒక లాభాపేక్ష లేనటువంటి సంస్థ. విజ్ఞానం,ఆర్ట్ , సాహిత్యం యొక్క అభివృద్ధి ఈ సంస్థ యొక్క లక్ష్యం. గుజరాతి హవేలీ నిర్మాణ శైలి లో ఉన్న ఈ ఫౌండేషన్ భవనం మరియు లోపల భద్రపరచిన వస్తువులతో పర్యాటకులు చూడతగ్గ ప్రదేశం గా ఉంటుంది. భారతీయ కళలు వాటి వారసత్వ సంస్కృతీ తెలియచెప్పే వర్క్ షాప్ లను ఈ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తుంది .



Click it and Unblock the Notifications