మహుడి తీర్థ్ జైనులకి పవిత్రమైనటువంటి మందిరాలలో ఒకటి. ప్రాచీన కాలం లో 'మధుమతి' గా పిలువబడిన ఈ ప్రాంతం, తవ్వకాలలో లభించిన ఆధారాల ప్రకారం 2000 ఏళ్ళ క్రితానికి చెందినదని భావిస్తారు.
కొంత కాలం తపస్సు తరువాత అచార్యదేవ్ బుద్ధి సాగర్సూరిస్వరజి ఈ ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఘంటకర్ణ మహావీర్ దేవ్ ఇక్కడి ఆరాధ్య దైవం, ఆయన పూర్వ అవతారమైన క్షత్రియ రాజు తుంగభద్ర రూపం లో విల్లంబులు ధరించి దర్శనమిస్తారు. వివిధ మతాలకు చెందినటువంటి ప్రజలు ఈ విగ్రహానికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని, ఇహపర కోరికలు ఫలిస్తాయని నమ్ముతారు. వేలాది మంది భక్తులు ఈ మందిరానికి 'సుఖాది' అనబడే ఈ మహావీర్ కి ఇష్టమైన వంటకాన్ని అర్పించడానికి లేదా ప్రసాదం గా స్వీకరించడానికి తరలివస్తారు.
30 అడుగుల ఎత్తైనటువంటి ఒక గంట ఇక్కడ ఉన్నది. భక్తులు దీనిని మ్రోగిస్తే తమ కోరికలు తీరుతాయని నమ్ముతారు. ఆచార్యదేవ్ బుద్ధి సాగర్సూరిస్వరజి ప్రధాన మందిరానికి దగ్గరలో భగవాన్ పద్మప్రభు విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. ఈ విగ్రహం 22 అంగుళాల ఎత్తుతో పాలరాతితో చెక్కబడి ఉన్నది. 24 తిర్థన్కరుల మందిరాల చుట్టూ ప్రదక్షిణ (భూమ్టి) చెయ్యడం ఆచారం.