అహ్మద్ షా చేత క్రీ.శ.1411 లో స్థాపించబడిన అహ్మెదాబాద్ నగరం ఆ తరువాత అతని మనవడు మహ్మద్ బేగ్డా చేత రక్షణ కోసం ఈ నగరం చుట్టూ గోడ కట్టారు. ఈ గోడ 10 కిలోమీటర్ల చుట్టుకొలతతో 12 గేట్లతో అలాగే 189 కోట బురుజులు ఇంకా 6000 పిట్టగోడలు కలిగి ఉంది.
ఈ నగరం క్రమంగా విస్తరించడం వల్ల గోడలోని కొంత భాగం తప్ప మిగతాదంతా శిధిలమైపోయింది. సబర్మతి నది తీరం వద్ద కొంత భాగం గోడతో పాటు ఈ గోడకున్న గేట్లు అలాగే ఉన్నాయి. ఈ పన్నెండు గేట్ల పేరులు షాపూర్ గేటు, ఢిల్లీ గేటు, దరియాపూర్ గేటు, ప్రెమ్ గేటు, కాలుపూర్ గేటు, పంచ్ కువా గేటు, సారంగపూర్ గేటు, రైపూర్ గేటు, అస్తోడియా గేటు, మహుదా గేటు, జమాల్పూర్ గేటు, రాజ్క్హాడ్ గేటు, ఖంజియా గేటు, రైక్హాడ్ గేటు, గణేష్ గేటు మరియు రామ్ గేటు. ఈ గేట్లు నగిషీలతో అందంగా అలంకరింపబడి ఉన్నాయి.
ఈ గోడ లోపల ఉండే నగరాన్ని పాత నగరంగా పిలుస్తారు. ఇందులో ని వీధులు నడవటానికి లేదా ద్విచక్ర వాహనాలపై తిరగడానికి మాత్రమే వీలుగా ఉండేంత సన్నగా ఉంటాయి. ఈ నగరం ని పోల్స్ అనబడే విభాగాలుగా విభజించారు. ఒక్కొక్క విభాగం లో ఒకే మతానికి చెందినా వారు నివసిస్తూ ఉంటారు. కొన్ని విభాగాల మధ్యలో ఉన్న దేవాలయాలలో అందమైనటువంటి నగిషీలతో ఉన్న చెక్క తలుపులూ స్థంభాలు మరియు అద్భుతమైన నిర్మాణ శైలి ఆకర్షిస్తాయి.
అంతే కాక ఇక్కడ ఉండే 'చబుత్రో' అనే నిర్మాణం పక్షుల కోసం ప్రత్యేకంగా ఏర్పరచబడింది. చెట్లను కొట్టేసి ఇళ్ళ నిర్మాణం చేస్తున్నందుకు పక్షుల గూళ్ళు కోల్పోయినందుకు వాటి కోసమే ప్రత్యేకంగా ఏర్పరచబడింది.