గువహతి ని సందర్శించడానికి వచ్చే వాళ్ళు తప్పక సందర్శించవలసిన ప్రదేశం సుక్రేశ్వర్ టెంపుల్. ఈ మందిరం మహాసివుడికి అంకితం ఇవ్వబడినది. అహోం రాజు ప్రమట్ట సింగ చేత 1744 లో ఈ మందిరం నిర్మించబడినది. ఈ ఆలయ నిర్మాణం లో రాజేశ్వర సింగ్ రాజు యొక్క (1744-1751) సహకారం కూడా ఉంది. అస్సాం చరిత్రలో ఈ ఆలయం ముఖ్య పాత్ర పోషిస్తుంది.
శైవ సంస్కృతిని ప్రోత్సహించడం ఈ ఆలయం ప్రధాన ఉద్దేశ్యం. సుక్రేశ్వర్ లేదా ఇతఖులి కొండపై బ్రహ్మపుత్ర నది యొక్క దక్షిణ ఒడ్డున పనబజార్ వద్ద ఈ ఆలయం ఉంది. గువహతి లో ని ప్రముఖమైన పర్యాటక ఆకర్షణ ఇది.
ఈ ఆలయాన్ని సందర్శించే యాత్రికులకి మెట్లదారి గూండా బ్రహ్మపుత్ర కి చేరుకోవడం అత్యంత ఆసక్తికరమైన అంశం. పర్యాటకులు ఈ నదీప్రదేశం లో సూర్యాస్తమయాన్ని చూసి ఆనందించవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు ఈ ప్రాంతం అందరినీ అమితం గా ఆకర్షిస్తుంది. ఇక్కడున్న రాతి ఆకృతి అహోం రాచరికపు వ్యవస్థలో ప్రాచుర్యం లో ఉన్న నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది.