హిందూ మరియు బౌద్ధ ధృక్పదం లో 'హంస' సరస్వతీ అమ్మవారి వాహనం . హంస ఆగకుండా 7000 మైళ్ళు గొప్ప ఎత్తులలో ఎగర గలదు, అందుకే అమ్మవారు హంసను వాహనంగా ఎన్నుకున్నదని భావిస్తారు .
శీతాకాలం లో టిబెట్ లోని మానస సరోవరం లో నివసించే హంస అనేక వేల మైళ్ళు ప్రయాణించి భారత దేశం లోని తన నివాస స్థలానికి చేరుకుంటుంది . ఉపనిషద్ల ప్రకారం హంస ముత్యాలను మాత్రమే తింటూ , పాలను నీటినుండి వేరుచేయ్యగల శక్తి కలిగి ఉన్నది గ చెప్తారు .అంతే కాక బ్రహ్మ జ్ఞానం కలది గా కూడా చెప్తారు .
జింద్ నుండి సుమారు అయిదు కిలోమీటర్ల దూరం లో ఎకహంస దేవాలయం ఉన్నది . జింద్ - హన్సి రోడ్డు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు .భగవంతుడు శ్రీ కృష్ణుని కి సంబంధించిన ఇతిహాసాలలో ఈ దేవాలయం గురించిన ప్రస్తావన ఉన్నది . ఈ గుడిలో భగవంతుడు అందరి మీద ప్రేమ ఎలా కురి పిస్తాడో తెలియ చెప్పే చిత్రం ఉన్నది .