బసవేశ్వర్ మహాదేవ ఆలయం పట్టణం నుండి 15 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిపై కులు జిల్లా బజ్రు గ్రామం లో ఉంది. బియాస్ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం రాతి శిల్పాలకు, విగ్రహాలకు, శిఖరాలు లేదా పైభాగం చదునుగా ఉండే బురుజులకు పేరుగాంచింది.
ఈ ఆలయంలో శివుడిని సూచించే ‘యోని లింగం’, ఆయన భార్య పార్వతీ దేవి విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం లోపల భాగం రాతి శిల్పాలతో చెక్కబడి ఉంది, బయట భాగం కాగితపు పూలతో అలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయం వెలుపల స్థితి కారకుడైన విష్ణుమూర్తి చిన్న విగ్రహాలు, సంపదకు, శ్రేయస్సుకు అధిదేవత లక్ష్మీదేవి, శక్తి స్వరూపాలలో ఒకటైన దుర్గాదేవి, గజముఖుడైన వినాయకుడి విగ్రహాలు ఇక్కడ చూడవచ్చు.



Click it and Unblock the Notifications