రాజస్థాన్ లో ఆల్వార్ కు 10 కి.మీ. దూరం లో జై సింగ్ మహరాజు 1918వ సంవత్సరంలో నిర్మించిన విజయ్ మందిర్ ప్యాలెస్ ను రాజ ప్రాసాదం గా ఉపయోగించారు.అద్భుత నిర్మాణ శైలికి నిదర్శనమైన ఈ ప్యాలస్ లో 106 దివ్యమైన గదులతో బాటుగా అందమైన తోట కూడ ఉంది.విజయ్ సాగర్ సరస్సు ఒడ్డున గల ఈ ప్యాలెస్ రూపకల్పనను మహారాజు గారే స్వయంగా చేశారు.