చాముండ మాత ఆలయం, జోధ్పూర్ స్థాపకుడు రావు జోదా నిర్మించిన రాచరికపు ఆలయం. ఆయన 1460 వ సంవత్సరంలో ఈ దేవతను జోధ్పూర్ కి తెచ్చారు. ఈ ఆలయం మేహ్రంగర్ కోట దక్షిణ ద్వారానికి దగ్గరగా ఉంది. ఇది జోధ్పూర్ రాజ కుటుంబాలకు ఇష్టమైన ప్రార్ధనా స్థలం. దసరా పండుగ సందర్భంగా, ఈ ఆలయాన్ని భక్తులు భారీ సంఖ్యలో సందర్శిస్తారు.