మందోర్ ఉద్యానవనం మార్వార్ రాజుల పూర్వపు రాజధాని అయిన మాన్దోర్ కి ప్రసిద్ధ ఆకర్షణ. ఇది ప్రసిద్ది చెందిన పొడవైన రాతి పైకప్పుతో దేశవ్యప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ, సందర్శకులు జోధ్పూర్ పూర్వపు రాజుల సమాధులను కూడా చూడవచ్చు. ఈ సమాధులు, దేవల్స్ సాంప్రదాయ గొడుగు ఆకార శైలిలో కాకుండా, హిందూ ఆలయాల నమూనాతో నిర్మించారు.
ఈ దేవల్స్ నాలుగు అంతస్థులు, అందమైన స్తంభాలు, ఎరుపు ఇసుకరాయితో అలంకరించిన నిలువు వరసలను కలిగి ఉంది. ఎంతో అందమైన అజిత్ సింగ్ మహారాజ దేవల్ తోపాటు ఒక అందమైన తోటకూడా ఉంది. మందోర్ తోటకి సమీపంలో రెండు వసారాలు ఉన్నాయి, ఇవి ముక్కోటి దేవతల మందిర౦, వీరుల మండపం గా పిలువబడతాయి.
ముక్కోటి దేవతల మందిరం హిందూ దేవతల వివిధ వర్ణ చిత్రాలతో అలంకరించబడి ఉంది. వీరుల మండపంలో రాజపుత్ర జానపద నాయకుల చిత్రాలు ఉన్నాయి. సందర్శకులు రాతితో చెక్కబడిన అంతర్భాగం, ప్రకాశవంతమైన రంగుల్లో చిత్రించిన నాయకుల వివిధ విగ్రహాలను ఇక్కడ చూడవచ్చు. శిధిలమైన మందోర్ నగరాన్ని తోటలోని కొండ శిఖరం నుండి చూడవచ్చు. ఈ కొండ సమీపంలో రాణుల అందమైన సమాధులు ఉన్నాయి.



Click it and Unblock the Notifications