జోర్హాట్ లోని నా-ఆలి వద్ద వున్న సుప్రసిద్ధ జలాశయం బంగాల్ పుఖారి. ఈ చెరువు నిర్మాణానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథను స్థానికులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.
1739 లో రూప సింగ్ బంగాల్ బదన్ బర్పుఖాన్ అనే ఒక అహోం రాజును చంపాడు. బర్ఫుకాన్ నియంతలా ప్రవర్తించి బర్మా సైనికులను, అస్సాం ప్రజలను చిత్రహింసలు పెట్టేవాడు, ఇదంతా చూసి శక మానం శ్రావణ మాసంలో రూప్ సింగ్ బంగాల్ బర్ఫుకాన్ ను స్నానం చేస్తుండగా చంపేసాడు. తన ధైర్య సాహసాలకు బంగాల్ కు బహుమానంగా ధనం లభించగా ఆటను దాంతో బంగాల్ ఫుకార్ ను నిర్మించాడు.
అయితే ఒక మనిషిని చంపగా వచ్చిన డబ్బుతో నిర్మించిన ఈ చెరువు నీటిని ఎవరూ వాడేవారు కాదు. స్థానికులు ఈ నీటిని వాడడం తమకు దురదృష్టాన్ని తెస్తుందని భావిస్తారు. అయితే వాడకుండా ఉన్నప్పటికీ జోర్హాట్ లో ఇది ప్రత్యెక పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది.