భాగ్యనగరం హైదరాబాద్ నుండి బయలుదేరే దాదాపు ప్రతి ప్రయాణీకుడు విమానంలో ప్రయాణించాలని కలలు కంటాడు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మెరుగైన సౌకర్యాలలో అంతర్జాతీయ గుర్తింపు పొందింది కూడా. అయితే మరి దేశ స్వాతంత్య్రానికి ముందు పరిస్థితి ఎలా ఉండేది. ఆ సమయంలో బస్సులు, రైళ్లతో మాత్రమే ఇక్కడకి చేరుకునే అవకాశం ఉండేదని మీకు తెలుసా? నిజానికి స్వాతంత్య్రానికి పూర్వం మన దేశంలో కేవలం ఐదు అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు ఉండేవి. వాటి వివరాలతోపాటు నేడు మన దేశంలో పేరుగాంచిన అంతర్జాతీయ విమానాశ్రయాలు వివరాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం రండి!
మన దేశంలో 1947 నాటికి అంటే, స్వాతంత్య్రానికి ముందు బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాస్తోపాటు కరాచీలతో కలిపి ఐదు అంతర్జాతీయ స్థాయి ప్రమానాలు కలిగిన విమానాశ్రయాలు ఉండేవి. అయితే, విభజన తర్వాత కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయం పాకిస్థాన్లో భాగమైంది. అలా స్వాతంత్య్రానికి ముందు ఏర్పాటు చేసిన విమానాశ్రయాలను పరిశీలిస్తే..
కోల్కతా విమానాశ్రయం
కోల్కతా విమానాశ్రయం 1924లో ప్రారంభించబడింది. మన దేశంలోని పురాతన విమానాశ్రయాలలో ఒకటిగా పేరుగాంచింది. మొదట కలకత్తా ఏరోడ్రోమ్ అని పిలువబడే దీనికి నేతాజీ సుభాస్గా పేరు మార్చారు. చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డకోటా 3 మొదటి విమానం దిగడానికి 1924లో షెడ్యూల్డ్ స్టాప్లను ప్రారంభించింది. ఆమ్స్టర్డ్యామ్ నుండి బటావియా (జకార్తా) మార్గం దీనికి కేటాయించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఈ ఎయిర్పోర్ట్ ముఖ్యమైన పాత్ర పోషించింది. 1942లో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ వైమానిక దళం యొక్క 7వ బాంబార్డ్మెంట్ గ్రూప్ B-24 లిబరేటర్ బాంబర్లను ఉపయోగించింది. ఈ విమానాశ్రయం నుండి బర్మా మీదుగా మిషన్లను తరలించారు.

అమృత్సర్ విమానాశ్రయం, అమృత్సర్
బ్రిటీష్ కాలంలో 1930లో స్థాపించబడిన అమృత్సర్ విమానాశ్రయం
ప్రారంభంలో VVIP ప్రయాణం కోసం ఉపయోగించబడింది. స్వాతంత్య్రానంతరం, అలాగే కొనసాగుతూ..
ఢిల్లీ - శ్రీనగర్, కాబూల్కు 1960లో మొదటి అంతర్జాతీయ విమానం ప్రారంభమైంది.
మద్రాసు విమానాశ్రయం
చెంగల్పట్టు జిల్లా తిరుసులంలో నైరుతి దిశలో 21 కిలోమీటర్ల చెన్నై సిటీ సెంటర్ విమానాశ్రయం 1915లో మొదటి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. అయితే, ఇది అధికారికంగా 1930లో అందుబాటులోకి వచ్చింది.
ఢిల్లీ విమానాశ్రయం
1930లో స్థాపించబడిన ఢిల్లీ విమానాశ్రయం యొక్క 09/27 రన్వేని బ్రటిష్వారు నిర్మించారు. దీని విస్తీర్ణం పరంగా చూస్తే 2,816 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఈ రన్వే ఎంతగానో ఉపయోగించబడింది.

ముంబై విమానాశ్రయం
1930లలో నిర్మించబడిన RAF శాంటాక్రజ్ ఒక పెద్ద ఎయిర్ఫీల్డ్. సమీపంలోని జుహు ఏరోడ్రోమ్కు మరియు అనేక RAF స్క్వాడ్రన్లకు ఆతిథ్యం ఇచ్చింది. 1942 నుండి 1947 వరకు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఎన్నో సేవలను అందించింది.
త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం
లెఫ్టినెంట్ కల్నల్ రాజా ఆధ్వర్యంలో రాయల్ ఫ్లయింగ్ క్లబ్లో భాగంగా 1932లో స్థాపించబడింది.
గోదా వర్మన్ చొరవతో మొదటి విమానం నవంబర్ 1, 1935న బయలుదేరింది.
రాయల్ ఆంచల్ (ట్రావెన్కోర్ పోస్ట్) నుండి బొంబాయికి మెయిల్ రవాణాకు ఉపయోగకరంగా సహాయపడింది.
నాగ్పూర్ విమానాశ్రయం
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో (1917-18) RFC/RAF కోసం నాగ్పూర్లో నిర్మించబడింది. అంతేకాదు, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో విమానాశ్రయం యొక్క సౌకర్యాలు పునరుద్ధరించబడి, ఉపయోగించబడ్డాయి. RAF ద్వారా స్టేజింగ్ ఎయిర్ఫీల్డ్ను బ్రిటిష్వారు వెళ్లిపోయినప్పుడు భారత ప్రభుత్వానికి అప్పగించారు.
అలాగే, స్వాతంత్య్రానికి ముందు ఎయిర్స్ట్రిప్లుగా ఉన్నవి అనంతర సమయంలో విమానాశ్రయాలుగా మారాయి.

కొచ్చిన్
కొచ్చి విమానాశ్రయం విల్లింగ్డన్ ద్వీపంలో ఎయిర్స్ట్రిప్గా ఆవిష్కరించబడింది. 1936లో కొచ్చిన్ రాజ్యం ఆధ్వర్యంలో నిర్మించబడింది. కొచ్చిన్ పోర్ట్ అభివృద్ధిలో పాల్గొన్న అధికారుల రవాణాతోపాటు
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు ఈ ఎయిర్స్ట్రిప్ను భారత నౌకాదళానికి సైనిక విమానాశ్రయంగా మార్చారు.
అహ్మదాబాద్
1937లో ఏర్పాటైన అహ్మదాబాద్ విమానాశ్రయం మొదట్లో దేశీయంగా మాత్రమే సేవలందించింది.
తర్వాత దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ అని పేరు పెట్టారు. ఈ
విమానాశ్రయం మే 23, 2020లో అధికారికంగా అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తించబడింది.
పూణే
1939లో RAF పూణేగా స్థాపించబడిన ఈ ఎయిర్ఫీల్డ్ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో స్క్వాడ్రన్లను నిర్వహించేందుకు ఉపయోగించారు. హావిలాండ్ మస్కెట్, వికర్స్ వెల్లింగ్టన్ బాంబర్లు మరియు సూపర్మెరైన్ స్పిట్ఫైర్ యుద్ధ విమానాలను ఇక్కడ నుంచి తరలించారు.

బెంగళూరు HAL
నిజానికి ఇది సైనిక మరియు రక్షణ ప్రయోజనాల కోసం 1942లో స్థాపించబడింది. HAL
బెంగళూరు 1970ల చివరలో దేశీయ కార్యకలాపాలను ప్రారంభించింది.
జోధ్పూర్
1920లలో, మహారాజా ఉమైద్ సింగ్ జోధ్పూర్ ఫ్లయింగ్ క్లబ్ను స్థాపించారు.
అతని చిత్తర్ ప్యాలెస్ (ఉమైద్ భవన్ ప్యాలెస్) సమీపంలోని ఒక చిన్న ఎయిర్ఫీల్డ్ వద్ద ఇది ఉంది. అయితే, స్థాపించిన 30 ఏళ్లకు ఈ ఎయిర్ఫీల్డ్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ (RAF) కోసం ఎయిర్ఫీల్డ్ పనిచేసింది. రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏర్పడిన తర్వాత 1950లో అప్గ్రేడ్ చేయబడింది. అనంతరం భారత వైమానిక దళంగా మారింది.
పూంచ్
కాశ్మీర్ లోయలోకి వ్యూహాత్మకంగా ప్రవేశించేందుకు ఇది ఎంతో ముఖ్యమైనది. 1947 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో నవంబర్ 21న పాకిస్తాన్ సైన్యం చుట్టుముట్టినప్పుడు పూంచ్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది.

స్వాతంత్య్రానంతర కాలంలోని ప్రధాన విమానాశ్రయాల జావితా..
1948- ఇండోర్ విమానాశ్రయం, ఇండోర్
1955- గోవా అంతర్జాతీయ విమానాశ్రయం
1962- భువనేశ్వర్ విమానాశ్రయం, భువనేశ్వర్
1968- భోపాల్ విమానాశ్రయం, భోపాల్
1974- డెహ్రాడూన్ విమానాశ్రయం, డెహ్రాడూన్.
1983- వారణాసి విమానాశ్రయం, వారణాసి
1986- లక్నో విమానాశ్రయం, లక్నో
2002- బాగ్డోగ్రా విమానాశ్రయం, పశ్చిమ బెంగాల్
2005- జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం, జైపూర్
2008- కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు
2008- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్
1969- ఉదయపూర్ విమానాశ్రయం, ఉదయపూర్
దేశంలోని విమానాశ్రయాల ప్రస్తుత స్థితి
ప్రస్తుతం మన దేశంలో విమానయానం ఎంతగానో వృద్ధి చెందింది.
157 operational విమానాశ్రయాల నెట్వర్క్ ఉంది. వీటిలో 33 అంతర్జాతీయ
విమానాశ్రయాలు గ్లోబల్ కనెక్టివిటీని సులభతరం చేస్తున్నాయి. అలాగే, వివిధ రూరల్ ప్రాంతాల కనెక్టివిటీ లక్ష్యంగా UDAN పథకంలో భాగంగా 85 సర్వీలు ఉన్నాయి. ఇవి ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. 3,025 కంటే ఎక్కువ దేశీయ విమానాలు దేశవ్యాప్తంగా టేకాఫ్ మరియు ల్యాండ్ అవుతున్నాయి. అంతేకాదు, 563 అంతర్జాతీయ విమానాలు భారతీయ నగరాలను ప్రపంచానికి అనుసంధానం చేస్తున్నాయి.
దేశీయ విమానాల ద్వారా దాదాపు 8,77,613 ప్రయాణికులు రోజువారీ విమాన వినియోగదారలు ఉన్నారు. ఇందులో అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా ప్రతి రోజు 2,11,511 మంది ప్రయాణీకుల తమ గమ్యస్థానాలను చేరుకుంటున్నారు. స్వాతంత్య్రానంతరం ఇంతటి అభివృద్ధిని సాధించిన మన దేశ విమానయాన్ని చూసిన ప్రతి భారతీయుడు గర్వంచాల్సిందే!



Click it and Unblock the Notifications















