సాధారణంగా వీఐపీలకు, అత్యంత ముఖ్యమైన సినిమా స్టార్లకు, వారి పిల్లలకు, ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని భావిస్తేవారికి పోలీసు రక్షణ కల్పించడం చూస్తుంటాం. ఆ ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటే వారికి ఆయుధాలు ధరించిన వక్తులు రక్షణగా ఉంటారు. అయితే దేశంలో ఒకే ఒక పవిత్రమైన చెట్టుకు రక్షణగా గన్ మెన్లు రక్షణగా ఉంటున్నారు. అది కూడా 24 గంటలూ. అయితే ఆ వృక్షం ఎక్కడ ఉంది? అక్కడకు ఎలా వెళ్లలి తదితర వివరాలు మీ కోసం...
ఈ నారసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా సందర్శించారా?
వినాయకుడు ఇక్కడ గజముఖుడు కాదు, మనిషి ముఖమే కలిగి ఉంటాడు
కొండగట్టుకు అంతమంది భక్తులు ఎందుకు వస్తారో తెలుసా
వీఐపీ ట్రీట్మెంట్
P.C: You Tube
దేశంలోనే మొదటి వీఐపీ ట్రీట్మెంట్ అందుకొంటున్న చెట్టు ఇదే. 10 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 15 అడుగుల ఎత్తైన ఫెన్సింగ్ మధ్య ఈ చెట్టు ఉంటుంది. అత్యంత పవిత్రంగా భావించడం వల్లే స్థానిక ప్రభుత్వం ఈ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.
బెంగళూరులో ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు చూడకుండే చాలా మిస్ అవుతారు.
24 గంటలూ ఇక్కడ గన్ మెన్లు
P.C: You Tube
రోజులో 24 గంటలూ ఇక్కడ గన్ మెన్లు కాపలాగా ఉంటారు. అదేమిటి ఒక చెట్టుకు ఇంతటి రక్షణ ఎందుకని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నా. అందుకు సంబంధించిన వివరాలన్నీ మనం ఈ కథనంలో తెలుసుకొందాం. ఇందు కోసం క్రీస్తు పూర్వం కాలానికి ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ ఆంజనేయస్వామి, కుళ్లాయిస్వామి భాయ్, భాయ్
బోధి వృక్షం
P.C: You Tube
అంతటి రక్షణ కలిగిన చెట్టు బోధి వృక్షం. అవును మీ ఆలోచన సరైనదే. గౌతమ బుద్ధుడికి ఈ చెట్టుకిందనే జ్జానోదయం అయ్యింది. అందువల్ల బౌద్ధులకు ఈ చెట్టు ఎంతో పవిత్రమైనది. దీనిని కేవలం బౌద్ధులే కాకుండా మిగిలిన మతాలకు చెందిన వారు కూడా ఎంతో పవిత్రంగా భావిస్తున్నరు.
ఈ సరోవరంలోని నాగమణి కోసం ఆశపడి చాలా మంది...
భోపాల్ దగ్గర్లోని సాంచి
P.C: You Tube
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ దగ్గర్లోని సాంచి, సలామత్ పుర మధ్య ఉన్న చిన్న గుట్ట మీద ఈ చెట్టు ఉంది. దీనిని అత్యంత జాగ్రత్తతో చూసుకొంటున్నారు. ఈ చెట్టు దరిదాపుల్లోకి ఎవరినీ రానివ్వరు. వారు వీఐపీ, వీవీఐపీ అయినా సరే ముందస్తు అనుమతి తీసుకుకోవాల్సిందే.
అప్పటి శ్రీలంక అధ్యక్షుడైన రాజపక్సే
P.C: You Tube
2012 డిసెంబర్ లో అప్పటి శ్రీలంక అధ్యక్షుడైన రాజపక్సే ఈ చెట్టును నాటారు. అరోజు నుంచి మొదలు ఇప్పటి వరక ఆ చెట్టును కంటికి రెప్పలా కాపాడుకొంటూ వస్తున్నారు. ఈ గుట్ట పైకి ముందస్తు అనుమతి లేకుండా ఎవరిని పంపించరు. ఈ చెట్టుకు సంబంధించిన ఒక్క ఆకు లేదా కొమ్మును కూడా ఎవరూ తీసుకువెళ్లడానికి వీలులేదు.
ప్రత్యేకమైన ట్యాంకులో
P.C: You Tube
ఈ చెట్టుకు సాంచి నగర పాలికే నుంచి ప్రత్యేకమైన ట్యాంకులో నీటిని సరఫరా చేస్తున్నారు. ఎట్టి పరిస్థుతుల్లోనూ నీరు, ఎరువు తదితరాలు తక్కువ కాకుండా చూస్తుంటారు. ఈ బోధి చెట్టు సంరక్షణకు అవసరమైన నిపుణులను ఒక్కొక్కసారి శ్రీలంక నుంచి కూడా ఇక్కడికి రప్పిస్తుంటారు.
నిపుణులు
P.C: You Tube
ఇక ఈ చెట్టును రక్షించడానికి వీలుగా నిపుణులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. ఇందుకు సంబంధించిన వ్యవహారాలన్నీ కలెక్టర్ నేరుగా చూస్తుంటాడు. కనీసం నెలకు ఒకసారైనా అక్కడికి వెళ్లా ఆ చెట్టును చూసి వస్తుంటారు. ఇందుకు సిబ్బందిని కూడా కేటాయించడం గమనార్హం
క్రీస్తు పూర్వం 3వ శతబ్దంలో
P.C: You Tube
బుద్ధునికి జ్జానోదయం అయిన బోధి చెట్టు చిన్న కొమ్మును క్రీస్తు పూర్వం 3వ శతబ్దంలో భారత్ నుంచి శ్రీలంకకు తీసుకువెళ్లారు. అక్కడ అనురాధాపురంలో నాటి సంరక్షించారు. అప్పటి నుంచి ఆ ప్రాంతం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.
లక్షల సంఖ్యలో భారత దేశం నుంచి
P.C: You Tube
ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భారత దేశం నుంచి అక్కడికి పర్యాటకులు వెలుతున్నారు. ఆ చెట్టును అక్కడి వారు పరమ పవిత్రమైన చెట్టుగా భావిస్తారు. ఇక ప్రస్తుతం ఆ చెట్టు కొమ్మనే తిరిగి భారత దేశానికి తీసుకువచ్చారు. అందువల్ల ఈ చెట్టును పరమ పవిత్రమైనదిగా భావిస్తూ రక్షిస్తున్నారు.
ప్రత్యేక బడ్జెట్ ను
P.C: You Tube
ప్రతి ఏడాది ఈ చెట్టు సంరక్షణ కోసం స్థానిక ప్రభుత్వం లక్షల రుపాయలు ఖర్చు చేస్తోంది. ఇందుకు ప్రత్యేక బడ్జెట్ ను కూడా కేటాయించడం గమనార్హం. ముందస్తు అనుమతి తీసుకొని ఈ గుట్ట పైకి వెళ్లవచ్చు. అయితే దూరం నుంచి మాత్రమే ఆ చెట్టును సందర్శించి వెనుతిరగాల్సి ఉంటుంది.