విద్యకు, జ్జానానికి అధిదేవత సరస్వతి దేవి. ముఖ్యంగా విద్యార్థులను బడిలోకి పంపించడానికి ముందు సరస్వతి దేవికి పూజచేయడం హిందూ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం. మరికొంతమంది ఆ దేవత కొలువై ఉన్న ప్రాంతాలకు వెళ్లి ప్రత్యేకంగా అక్షరాభ్యాస పూజలు చేయిస్తూ ఉంటారు.
అందువల్లే పాఠశాలలు పున:ప్రారంభమయ్యే సమయంలో ఈ సరస్వతి దేవాలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే భారత దేశంలో లక్ష్మీ, పార్వతి దేవితో పోలిస్తే సరస్వతి దేవికి ఉన్న దేవాలయాలు చాలా తక్కువే. వాటిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఈ నేపథ్యంలో భారత దేశంలో వివిధ చోట్ల ఉన్న సరస్వతి దేవాలయాలకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో మీ కోసం...
సర్వతి దేవి దేవాలయం బాసర
P.C: You Tube
భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన సరస్వతి దేవాలయం బాసరలోని జ్జాన సరస్వతి దేవాలయం. అదిలాబాద్ లోని బాసరలో గోదవరి తీరంలో ఉన్న ఈ దేవాలయాన్ని ప్రతి రోజూ వేలాది మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు.
వేదవ్యాసుడు
P.C: You Tube
వేదవ్యాసుడు మూడుపిడికిళ్లతో చేసిన కుప్పలు మహాలక్ష్మి, సరస్వతి, కాళి మాత విగ్రహాలుగా రూపాంతరం చెందాయని చెబుతారు. ఇక్కడ సరస్వతి దేవి పద్మాసనంలో కూర్చొన్న స్థితిలో మనకు కనిపిస్తారు. చేతిలో వీన కూడా ఉంటుంది.
అక్షరాభ్యాసం
P.C: You Tube
తమ పిల్లలను బడిలోకి పంపించడానికి ముందు చాలా మంది తల్లిదండ్రులు ఇక్కడకు వచ్చి అక్షరాభాస్య కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తద్వార వారికి చదువు బాగా వస్తుందని నమ్మకం. ఇందుకోసం కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
పానచిక్కడ్ సరస్వతి దేవాలయం
P.C: You Tube
కేరళలోని పానచిక్కడ్ లో ఉన్న సరస్వతి దేవాలయం కూడా ప్రాచూర్యం చెందినది. ఈ దేవాలయాన్ని దక్షిణ మూకాంబికా దేవి దేవాలయం అని కూడా అంటారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ మధ్యన జరిగే
సరస్వతి పూజ చాలా ప్రాచూర్యం చెందినది. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి. దాదాపు వెయ్యి ఏళ్లకు పూర్వ ఈ దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు.
పుష్కర్ లోని సరస్వతి దేవాలయం.
P.C: You Tube
పుష్కర్ అన్న తక్షణం మనకు బ్రహ్మ దేవాలయమే గుర్తుకు వస్తుంది. అయితే రాజస్థాన్ లోని పుష్కర్ లో సరస్వతి దేవాలయం కూడా ఉంది. ప్రతి ఏడాది ఈ దేవాలయాన్ని కొన్ని వేల మంది సందర్శిస్తుంటారు. ఈ దేవాలయం భారతీయ శిల్ప కళకు ప్రత్యక్ష నిదర్శనం.
బిట్స్ పిలాని క్యాంపస్
P.C: You Tube
రాజస్థాన్ లోని బిట్స్ పిలాని క్యాంపస్ లో సరస్వతి దేవి దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని బిర్లా కుటుంబం నిర్మించింది. మొత్తం 70 స్తంభాలతో, భారతీయ శిల్పకళకు అద్దం పట్టేలా ఈ దేవాలయం నిర్మాణం కొనసాగింది. ఈ దేవాలయంలో గర్భగుడి, ప్రదక్షిణ మంటపం, అంతరాలం, ధ్యాన మంటపం, ఆరాధన మంటపం పేరుతో ఐదు భాగాలుగా ఈ దేవాలయం మొత్తం తెల్లటి మార్బల్ రాతి నిర్మాణం.
విద్యా సరస్వతి, వరంగల్
P.C: You Tube
హంసవాహనంతో కూడిన సర్వతిని తెలంగాణలోని వరంగల్ లో విద్యా సరస్వతి పేరుతో కొలుస్తున్నారు. కంచి శంకరమఠం ఈ దేవాలయం నిర్వహణను చూస్తోంది. ఈ దేవాలయానికి చుట్టూ విద్యాగణపతి, శనీశ్వర దేవాలయం తదితర దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయంలో వేదాలను అభ్యసింపజేస్తారు. ప్రస్తుతం 300 మంది విద్యార్థులు ఈ వేదాలను చదువుతున్నారు.