మృదంగ శైలేశ్వరి దేవి ఆలయం కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాలో ముళక్కును అనే ప్రదేశంలో ఉంది.ఈ ఆలయం పరశురాముడు నిర్మించిన 108 దుర్గ ఆలయాలలో ఒకటి అని నమ్ముతారు.ప్రస్తుత దేవాలయ 500 సంవత్సరాల పురాతన కాలంనాటిదని చెప్పబడుతుంది.
శైలేశ్వరి దేవి ఇక్కడ ఆమె భక్తులు ఎవరైతే బాగా అత్యంత భక్తితో ప్రార్థనలు చేసుకుంటారో అన్ని ప్రార్ధనలకు ఆమె సమాధానం ఇస్తుంది అనేది ఇక్కడ విదితం. శైలేశ్వరి దేవి అమ్మవారి విగ్రహం ఇక్కడ అయిదు లోహాల మిశ్రమంతో (పంచలోహాలు)తయారుచేయబడి మూడు అడుగుల పొడవువుంటుంది.ఇక్కడ ఇప్పటి వరకు ఆలయంలో 3 సార్లు విగ్రహం దొంగతనం ప్రయత్నం జరిగింది. కానీ మూడు ప్రయత్నాలు విఫలం అయ్యాయి ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే దొంగల ప్రయత్నాలు విఫలం అయ్యి ఆలయంలో విగ్రహం అలాగే వుంది.
ఇది సమయం ఒక పాయింట్ వద్ద, ఏ సాధారణ పూజలు నిర్వహించిన ఉన్నాయి అలాంటి ఒక మేరకు విస్మరించారు ఇది ఆలయాలలో ఒకటి, కానీ విషయాలు ఆకస్మికంగా ఒక మలుపు అన్ని పట్టింది మరియు ఈ ఆలయానికి భక్తులు భారీ రద్దీ ఉంది వరకు నిరంతర ఇది తేదీ.
అద్భుత మహిమలు చూపిస్తున్న మృదంగ శైలేశ్వరి దేవి

1. భక్తులు భారీ రద్దీ
ఒకప్పుడు ఇక్కడ సాధారణ పూజలు నిర్వహించేవారు. కానీ ఈ విధంగా ఇక్కడ మహత్యాలు జరిగేటప్పటికి భక్తులు భారీఎత్తున ఈ ఆలయాన్ని దర్శించుటకు వస్తున్నారు.
PC: Offical Site

2. పేదవారి నుండి ధనవంతులదాకా
భారీ మార్కెట్ విలువ కలిగిన ఈ విగ్రహాన్ని దొంగిలించటానికి ప్రయత్నించిన దొంగలను ఒక రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారి ప్రశ్నిస్తున్నప్పుడు తన అనుభవాలను వ్యాఖ్యానించిన తరువాత ఈ ఆలయం వెలుగులోకి వచ్చింది.
PC: Offical Site

3. పోలీస్ అధికారి ఇచ్చిన వివరణ
దొంగలు దేవి విగ్రహాన్ని దొంగిలించాలని చేసిన రెండు ప్రయత్నాలలో కొన్ని కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఆ విగ్రహం తీసుకొని పారిపోలేక ప్రయత్నం విరమించుకుని వెనుదిరిగి విగ్రహం వదిలి పారిపోయారు అని చెప్పారు.
PC:Vinayaraj

4. శైలీశ్వరీ అమ్మవారి మహిమలు
అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించాలని మొదటి ప్రయత్నం చేసిన బందిపోటు దొంగలు భయంతో మూత్రవిసర్జన చేసుకుని విగ్రహం వదిలి పారిపోయామని అంగీకరించారు. రెండవ సారి చేసిన ప్రయత్నంలో అమ్మవారి విగ్రహాన్ని రోడ్డు సైడ్ లో వదిలి వెళ్లిపోవాలనుకుని తలచి తిరిగి యధాస్థానంలో పెట్టి వెళ్ళిపోయామని బందిపోటు దొంగలు చెప్పారు. మూడో ప్రయత్నంలో వారు ఒక సుదూర ప్రాంతానికి విగ్రహాన్ని తీసుకుని వెళ్లి ఒక లాడ్జిలో వదిలిపారిపోయామని చెప్పారు.
PC: Offical Site

5. పోలీస్ అధికారి చెప్పిన విషయాలు
పోలీస్ అధికారి వ్యాఖ్యానం మేరకు సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అయిన తరువాత చాలామంది భక్తులు అకస్మాత్తుగా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు.
PC: Offical Site

6. సంగీతం మరియు కథాకళి సాంగత్యం
ఈ ఆలయంలో శైలీశ్వరీ అమ్మవారు దుర్గదేవి రూపంలో ఉంది. అయితే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఒక మృదంగం వాయిద్యం రూపంలో కనిపిస్తుంది అందుకే ఇక్కడ అమ్మవారికి సంగీతంతో సంబంధం ఉందని చెబుతారు.
PC:Rajeshodayanchal

7.మూల విగ్రహం
మూల విగ్రహం కాకుండా ఆలయానికి దక్షిణ వైపు మరొక విగ్రహం ఉంది. ఈమె మిళవు దేవతగా దర్శనమిస్తుంది. ఇప్పుడు ఈ విగ్రహాన్ని ప్రధాన ఆలయంలో ఉంచారు.
PC: Vinayaraj

8. పొర్కాకాళి దేవి
ఇక్కడ యుద్ధదేవత పొర్కాకాళి దేవి రూపంలో ఉంది. సిపాయి తిరుగుబాటు యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సైనికులు చేసిన త్యాగానికి గుర్తుగా ఇక్కడ రావిచెట్టు స్థాపించబడినది. సందర్శకులకు ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇక్కడ గల రావిచెట్టు ఆకులు ఆకుపచ్చగా వుండవు. తెలుపు రంగులో వుంటుంది.
PC: Offical Site



Click it and Unblock the Notifications














