ఢిల్లీ నగరం దేశానికి రాజధాని మాత్రమే కాదు, ఇది ఒక సంస్కృతి, చరిత్ర, వారసత్వం కల ప్రదేశం. ఇండియా లో ఢిల్లీ ఒక ప్రసిద్ధ పర్యాటక నగరం. దేశానికి చరిత్ర పరంగా చెప్పవలసిన భారీ ప్రదేశాలు ఇక్కడ ఎన్నో కలవు. మరి ఢిల్లీ వెళితే, ప్రధానంగా ఏమి చూడాలి అనే అంశంలో మీకు కొన్ని ప్రదేశాల అందమైన చిత్రాలు పొందు పరచం. చూసి ఆనందించండి. మీ తదుపరి ఢిల్లీ పర్యటనలో వాటిని మిస్ కాకుండా చూసి ఆనందించండి.
ఇండియా గెట్
ఇండియా గెట్ ఢిల్లీ లో ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇండియా గెట్ దేశ చరిత్రలో కూడా ఒక ప్రసిద్ధ స్థానం పొందింది. ఢిల్లీ నగర నడిబొడ్డున ఈ ప్రదేశం కలదు.
ఇండియా గెట్
42 మీటర్ల ఎత్తు గల ఇండియా గెట్ పారిస్ లోని ఆర్క్ డి త్రయోమ్పి అనే కట్టడాని పోలి వుంటుంది.
Photo Courtesy: Dhruv
ఇండియా గెట్
ఇండియా గెట్ ను పూర్వం అల్ ఇండియా వార్ మెమోరియల్ అనేవారు. మొదటి ప్రపంచ యుద్ధంలోను మరియు ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ లోను ఈ ప్రదేశంలో సుమారు 70,000 మంది సైనికులు ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. Photo Courtesy: Juntas
ఇండియా గెట్
ఇండియా గెట్ లో అమర్ జవాన్ జ్యోతి, నిరంతరం వెలిగే కాగడా, వంటివి మరణించిన సైనికుల కు నివాళిగా ఉంచారు.
Photo Courtesy: Budhesh
ఇండియా గెట్
ఢిల్లీ లోని ప్రధాన రోడ్లు అన్నీ ఇండియా గెట్ చుట్టూ కలవు ఈ స్మారకం రాత్రులందు, వెలుగులతో కన్నుల విందు చేస్తూ వుంటుంది. Photo Courtesy: Thebrowniris
రెడ్ ఫోర్ట్
అతి పెద్ద దిన రెడ్ ఫోర్ట్ కోటను మొఘల్ చక్రవర్తి 17 వ శతాబ్దంలో నిర్మించాడు. ఒకప్పుడు ఈ కోట మొగల వంశ రాజధానిగా వుండేది.
Photo Courtesy: Arjuncm3
రెడ్ ఫోర్ట్
రెడ్ ఫోర్ట్ ను ఎర్రని రాతితో నిర్మించారు. ఇది ప్రపంచం లో ఒక బెస్ట్ పర్యాటక ఆకర్షణగా చెపుతారు.
రెడ్ ఫోర్ట్
రెడ్ ఫోర్ట్ ను యునెస్కో సంస్థ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రకటించింది. ఈ ప్రదేశంలో చూడ దాగిన అనేక ప్రధాన ఆకర్షణలు కలవు.
రెడ్ ఫోర్ట్
రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ లో దివాన్ ఐ ఖాస్, దివాన్ ఐ అం, మోతీ మసీద్ మరియు ముంతాజ్ మహల్ వంటి అద్భుత నిర్మాణాలు కలవు.
రెడ్ ఫోర్ట్
రెడ్ ఫోర్ట్ ప్రదేశంలో ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినం నాడు మన దేశ ప్రధాన మంత్రి జాతీయ పతాకం ఎగుర వేస్తారు. ఇక్కడ సాయంత్రాలు సౌండ్ అండ్ లైట్ షో లు ప్రదర్శిస్తారు.
లోటస్ టెంపుల్
లోటస్ టెంపుల్ ఢిల్లీ సమీపంలోని నోఇడా ప్రదేశంలో కలదు. కొద్ది నిమిషాల ప్రయాణంలో దీనిని చేరవచ్చు.
లోటస్ టెంపుల్
లోటస్ టెంపుల్ ను బహాయి కమ్యూనిటీ నిర్మించింది. ఢిల్లీ లో ఇది ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ
లోటస్ టెంపుల్
లోటస్ ఆకారంలో కల ఈ టెంపుల్ దాని యొక్క అద్భుత శిల్ప శైలికి ఇరవై వ శతాబ్దపు తాజ్ మహల్ గా అభివర్ణిస్తారు.
లోటస్ టెంపుల్
లోటస్ టెంపుల్ ను వైట్ మార్బుల్ తో నిర్మించారు. చుట్టూ లాన్ లు, తోటలు, నడక మార్గాలు అందంగా రూపొందించారు.
లోటస్ టెంపుల్
లోటస్ టెంపుల్ రూఫ్ గ్లాస్ మరియు స్టీల్ తో నిర్మించారు. ఈ గ్లాస్ ద్వారా లోపల వెలుగు పడి టెంపుల్ ను మరింత కాంతివంతం చేస్తుంది.
అక్షర ధాం టెంపుల్
స్వామీ నారాయణన్ అక్షరధాం టెంపుల్ ఢిల్లీ లో ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ.
అక్షర ధాం టెంపుల్
అక్షర ధాం టెంపుల్ భారతీయ, సంస్కృతి, శిల్ప శైలి, ఆధ్యాత్మికత లను ప్రతిబింబిస్తుంది. ఈ టెంపుల్ నిర్మాణానికి అయిదు సంవత్సరాలు పట్టింది.
అక్షరధాం టెంపుల్
అక్షరధాం టెంపుల్ నిర్మాణానికి సుమారు 11,000 మంది శిల్పులు కృషి చేసారు. వారిలో 3,000 మంది వాలంటీర్ లు గా పని చేసారు.
అక్షరధాం టెంపుల్
అక్షరధాం టెంపుల్ ను అయిదు భాగాలుగా విభజించారు. ప్రధాన నిర్మాణం కాంప్లెక్స్ మధ్య భాగంలో వుంతుండు. టెంపుల్ కు స్టీల్ లేదా కాంక్రీట్ దాని నిర్మాణంలో వాడలేదు.
అక్షర ధాం టెంపుల్
టెంపుల్ ప్రధాన నిర్మాణం 141 అడుగుల ఎత్తు వుండి 234 స్తంభాలు, 20 శిఖరాలు, 9 అందమైన డోములు సుమారు 2000 దేవుళ్ళ, దేవతల, ఋషులు, విగ్రహాలు కలిగి వుంటుంది. టెంపుల్ లో ఏనుగులు మోసే ఒక గజేంద్ర పీటం కూడా వుంటుంది.
జంతర్ మంతర్
ఢిల్లీ లోని జంతర్ మంతర్ కట్టడాన్ని పర్యాటకులు అధికంగా దర్శిస్తారు. దీనిలో కొన్ని ప్రత్యేకమైన ఖగోళ సంబంధిత సాధనాలు కలవు. ఈ కారణంగా ఇది ప్రసిద్ధి చెందినది.
జంతర్ మంతర్
జంతర్ మంతర్ నుజైపూర్ మహారాజ జై సింగ్ - II 1724 లో నిర్మించాడు. ఇది ఈయన నిర్మించిన అయిదు నిర్మాణాలలో ఒకటి.
జంతర్ మంతర్
జంతర్ మంతర్ లో 13 విశిష్టమైన ఖగోళ సాధనాలు కలవు. ఇవి సన్, మూన్, ఇతర గ్రహాల కదలికలను చూపుతాయి.
జంతర్ మంతర్
జంతర్ మంతర్ లోని పరికరాలు పూర్వ కాలంలో చక్కటి ఉపయోగంలో ఉన్నప్పటికీ నేడు అవి పర్యాటక ఆకర్షణలు గా మిగిలి ఖగోళ అన్వేషణకు ఉపయోగం లేకున్నాయి.
జంతర్ మంతర్
జంతర్ మంతర్ కట్టడం పార్లమెంట్ స్ట్రీట్ లో కలదు. ఇది వారంలోని అన్ని రోజులలో విజిటర్ లకు ఓపెన్ గా వుంటుంది.
రాష్ట్రపతి భవన్
రాష్ట్రపతి భవనం ఢిల్లీ లో ఒక ప్రసిద్ధ ప్రదేశం. ఇండియా లోని ప్రతిష్టాత్మక నిర్మాణాలలో ఒకటి.
రాష్ట్రపతి భవన్
రాష్ట్రపతి భవనం, ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ మాత్రమే కాక, ఇది మన దేశ రాష్ట్రపతికి నివాసంగా కూడా వుంటుంది.
రాష్ట్రపతి భవన్
రాష్ట్రపతి భవన్ లో దర్బార్ హాల్ మరియు అశోకన్ హాల్ ప్రధాన ఆకర్షణలు. దర్బార్ హాల్ రంగుల మార్బుల్ తో వుంటే, అశోకన్ హాల్ పెయింట్ చేయబడిన సీలింగ్ మియు వూడే న్ ఫ్లూరింగ్ కలిగి వుంటుంది.
రాష్ట్రపతి భవన్
మన దేశ ప్రెసిడెంట్ వుండే ఈ భవనంలో ఒక డ్రాయింగ్ రూమ్, ఒక విందు హాలు, ఒక డైనింగ్ రూమ్, ఒక టెన్నిస్ కోర్ట్ , ఒక మ్యూజియం, ఒక పోలో గ్రౌండ్ మరియు ఒక క్రికెట్ ఫీల్డ్ ఉంటాయ్.
రాష్ట్రపతి భవన్
రాష్ట్రపతి భవన్ మొత్తంగా నాలుగు అంతస్తులు కలదు. దీనిలో 340 గదులు, కలవు. నిర్మాణంలో టెంపుల్ బెల్స్ కూడా ఉపయోగించటం ఈ భావన విశిష్టత.
కుతుబ్ మినార్
కుతుబ్ మినార్ యునెస్కో గుర్తించిన ప్రపంచ హెరిటేజ్ సైట్. ఇది ఒక చారిత్రక స్మారకం.
కుతుబ్ మినార్
కుతుబ్ మినార్ దేశంలో అతి పొడవైన టవర్.72.9 మీటర్ల ఎత్తు కల ఈ టవర్ పైకి చేరేందుకు 399 మెట్లు కలవు.
కుతుబ్ మినార్
పొడవైన టవర్ మాత్రమే కాక కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లో అనేక ఆసక్తి కల ఇతర నిర్మాణాలు కూడా కలవు.
కుతుబ్ మినార్
కుతుబ్ కాంప్లెక్స్ లో ప్రధాన నిర్మాణాలు అంటే అవి ఒక ఐరన్ పిల్లర్, అల ఐ మినార్ మరియు అలా ఐ దర్వాజా.
కుతుబ్ మినార్
కుతుబ్ మినార్ సుల్తాన్ ఘరి, ఇల్తుమిష్ మరియు అల్లావుద్దీన్ ఖిల్జీ ల సమాధులు, కుతుబ్ మినార్ లోని ఇతర ఆకర్షణలు.