ఖజురహోలో ఉన్న ఈ హిందూ దేవాలయాలు తప్పక చూడండి
భారతదేశంలోని ప్రజలు ఆధ్యాత్మిక శాంతిని పొందడానికి అనేక రకాల దేవాలయాలను నిర్మించారు. ఇక్కడ ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి దేవాలయాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని పురాతనమైనవి మరియు వాటి చారిత్రక ప్రాముఖ్యత పొందినవి. అదే సమయంలో, కొందరు తమ విశ్వాసాలను మరియు అద్భుత నిర్మాణ శైలిని ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా కృషి చేశారు. ఈ దేవాలయాలు భారతీయ సంస్కృతి మరియు జీవనశైలి యొక్క వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి.
ఈ రకమైన చర్చ వచ్చినప్పుడు ఖజురహో గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. ఈ ప్రాంతం పురాతన ఆలయాలకు కేంద్రంగా చెప్పొచ్చు. 12వ శతాబ్దం నాటికి ఖజురహోలో 85 దేవాలయాలు ఉండేవి. 13వ శతాబ్దంలో మధ్య భారతదేశాన్ని ఢిల్లీ సుల్తానేట్ స్వాధీనం చేసుకున్నప్పుడు కొన్ని దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయని చరిత్ర చెబుతోంది. దీంతోపాటు మిగిలినవి నిర్లక్ష్యానికి గురవడంతో శిథిలమైపోయాయి. ఆ తర్వాత 22 దేవాలయాలు మాత్రమే ఇక్కడ మనుగడలో ఉన్నాయి. ఈ కథనంలో ఖజురహోలో ఉన్న కొన్ని హిందూ దేవాలయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చౌసత్ జోగిని ఆలయం
ఈ ఆలయ సముదాయంలో కాళీ దేవి యొక్క స్త్రీ జోగినిల 64 చిన్న గదులు ఉన్నాయి. వీటి ఆధారంగానే ఆలయానికి ఆ పేరు పెట్టారు. ఆశ్చర్యకరంగా, ఈ 64 చిన్న గదులలో దేనిలోనూ ఎలాంటి చిత్రాలూ ఉండవు. ఖజురహోలో పూర్తిగా రాతితో నిర్మించిన ఏకైక ఆలయం ఇదే అని చెప్పొచ్చు. ఈశాన్యం మరియు నైరుతి వైపుగా ఈ నిర్మాణం ఉంది. ఆలయంలో మొత్తం 65 గదులు ఉండగా, వాటిలో ఇప్పుడు 35 మాత్రమే మిగిలి ఉన్నాయి.

కందారియా మహాదేవ్ ఆలయం
ఖజురహోలోని అన్ని దేవాలయాలలో అతిపెద్ద ఆలయంగా కందారియా మహాదేవ్ ఆలయం పరిగణించబడుతుంది. ఇది క్రీ.శ.10వ శతాబ్దానికి చెందింది. మొత్తం 109 అడుగుల ఎత్తు మరియు 60 అడుగుల వెడల్పుతో గంభీరంగా దర్శనమిస్తుంది ఈ ఆలయం. కందరియా ఆలయ గోడలపై దాదాపు తొమ్మిది వందల చిత్రాలున్నాయి. ఇక్కడి విగ్రహాల ఎత్తు 2.5 అడుగుల నుండి 3 అడుగుల వరకు ఉంటుంది. గర్భగుడి లోపల శివుని చిహ్నమైన పాలరాతి లింగం అద్భుతంగా కనిస్తుంది.

వామన దేవాలయం
ఖజురహోలోని వామన దేవాలయం 11వ శతాబ్దం చివరిలో నిర్మించబడింది. ఈ ఆలయం విష్ణువు యొక్క మరగుజ్జు అవతారానికి అంకితం చేయబడింది. చాలా ప్రధాన దేవతలు గర్భగుడి గోడలపై కనిపిస్తాయి. ఆలయంలో విష్ణువు అనేక రూపాలలో దర్శనమిస్తాడు. ఇది చాలా అందమైన దేవాలయం. ఇక్కడకు వచ్చే సందర్శకులు ఎంతో మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు.

మాతంగేశ్వర దేవాలయం
ఖజురహోలోని చాలా దేవాలయాలు ఇప్పుడు కేవలం పర్యాటక ప్రదేశాలుగా మారాయి. అందులో మాతంగేశ్వర ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం ఇప్పటికీ వాడుకలో ఉంది. ఇక్కడ ఉదయం మరియు మధ్యాహ్నం పూజలు నిర్వహిస్తారు. గర్భగుడిలో దాదాపు 81/2 అడుగుల పొడవున్న భారీ లింగం దర్శనమిస్తుంది.

బ్రహ్మ దేవాలయం
ఖజురహో సముద్రం ఒడ్డున ఉన్న ఈ ఆలయ గర్భగుడి లోపల నాలుగు ముఖాల (చతుర్ముఖ) చిత్రం ఉంది. ఈ చిత్రం బహుశా శివునిది అయినప్పటికీ, స్థానిక ఆరాధకులచే ఇది బ్రహ్మదేవుని ప్రతిమ అని నమ్ముతారు. అందుకే ఈ ఆలయానికి బ్రహ్మ మందిర్ అని కూడా పేరు పెట్టారు. గర్భగుడిపైన, పడమర కిటికీల పైన విష్ణుమూర్తి బొమ్మలు ఉంటాయి. ఖజురహోలో రాతి మరియు ఇసుకరాయితో నిర్మించబడిన కొన్ని దేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయం 9వ శతాబ్దం చివరిలో లేదా 10వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడిందని నమ్ముతారు.

దులాదేవ్ ఆలయం
ఇది ప్రధాన ఖజురహో దేవాలయాల నుండి మైలున్నర దూరంలో ఉంది. 70 అడుగుల ఎత్తు, 41 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయంలో ఐదు గదులు ఉంటాయి. ఈ ఆలయాన్ని దాదాపు 10వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications













