Search
  • Follow NativePlanet
Share
» »అద్భుత నిర్మాణ నైపుణ్యానికి చిరునామా.. పద్మనాభపురం ప్యాలెస్

అద్భుత నిర్మాణ నైపుణ్యానికి చిరునామా.. పద్మనాభపురం ప్యాలెస్

కేరళలోని పద్మనాభపురం ప్యాలెస్ యొక్క నిర్మాణ నైపుణ్యానికి ఎవ్వ‌రైనా మంత్ర‌ముగ్దులు కావాల్సిందే. పురాత‌న నిర్మాణంగా ఇది ప్రసిద్ధి చెందింది. అంతేకాదు, ఈ రాష్ట్ర వారసత్వ‌ క‌ట్ట‌డాల‌కు సంబంధించిన అత్యుత్తమ నమూనాలలో ఒకటిగా నిలుస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి చాలా మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సంద‌ర్శించేందుకు వ‌స్తూ ఉంటారు. అద్భుత నైపుణ్యంతో చెక్కిన స్తంభాలు, పెయింట్ చేయబడిన పైకప్పులతోపాటు చెక్క‌తో త‌యారు చేసిన ప‌నితీరు ఈ ప్రదేశానికి మ‌రింత‌ ఆకర్షణను పెంచుతాయనే చెప్పాలి.

పద్మనాభపురం ప్యాలెస్ లోపల ప్రదర్శనలో ఉన్న దేనినీ తాకడానికి సందర్శకులకు అనుమతి లేదు. ఈ నిబంధ‌న‌ను మీరితే జరిమానా చెల్లించవలసి ఉంటుంది. అల‌నాటి రాచ‌రిక‌పు అనుభూతిని క‌లిగించే అనేక వ‌స్త‌వులు ఇక్క‌డ చూసేందుకు అవ‌కాశం ఉంటుంది. చారిత్ర‌క విశేషాల‌పై మ‌క్కువ ఉన్న‌వారికి ఈ ప్యాలెస్ ఎంత‌గానో ఆక‌ర్షిస్తుంది. కెమెరాను తీసుకెళ్లేందుకు నామ‌మాత్ర‌పు ఛార్జీలు చెల్లించాలి.

లోప‌ల ప్లాస్టిక్ సంచులు లేదా సీసాలు పూర్తిగా నిషేధించ‌బ‌డింది. ప్యాలెస్ లోప‌లి స్థలాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుతారు. ఈ ప్యాలెస్ చాలా పెద్దది. అందుకే, కుటుంబ స‌మేతంగా వెళ్లేవారు పిల్ల‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. ఇక్క‌డి మొత్తం విశేషాల‌ను తెలుసుకునేందుకు స్థానికంగా గైడ్‌లు అందుబాటులో ఉంటారు. దీంతోపాటు ప్యాలెస్ చ‌రిత్ర‌ను తెలియ‌జేసే స‌మాచారం పుస్త‌క రూపంలో ఇక్క‌డ ల‌భిస్తుంది.

సీ ఫుడ్‌తో మిళ‌త‌మ‌య్యే రుచిక‌ర‌మైన‌..

సీ ఫుడ్‌తో మిళ‌త‌మ‌య్యే రుచిక‌ర‌మైన‌..

మీ కేరళ ప్రయాణంలో ఆహారం ప్రధాన భాగంగా చెప్పొచ్చు. ఈ ప్రాంతంలోని ఏదైనా స్థానిక రెస్టారెంట్‌లలో సీ ఫుడ్‌తో మిళ‌త‌మ‌య్యే రుచిక‌ర‌మైన‌ దక్షిణ భారత ఆహారాన్ని ఆస్వాదించ‌డం అస్స‌లు మిస్స‌వ్వొద్దు. ప్యాలెస్ లోప‌లికి ప్రవేశ రుసుముగా పెద్దలకు ప‌ది రూపాయలు చెల్లించాలి. కెమెరా లేదా వీడియో కెమెరాను తీసుకెళ్లడానికి మీరు అదనపు ఛార్జీలు చెల్లించాలి. ఛార్జీలు వరుసగా 25 రూపాయ‌ల నుంచి వెయ్యి రూపాయ‌ల వ‌ర‌కూ ఉంటుంది. పద్మనాభపురం ప్యాలెస్ అన్ని సోమవారాలు మరియు ఇతర జాతీయ సెలవు దినాలలో మూసివేయబడి ఉంటుంది. మంగళవారం నుండి ఆదివారం వరకు, మ్యూజియం ఉదయం 9 గంటలకు తెరిచి సాయంత్రం 5 గంటలకు మూసివేయబడుతుంది.

సందర్శన వ్యవధి సుమారు గంట‌ నుండి రెండు గంటలు ఉంటుంది.

సమీపంలోని ఆకర్షణలు..

సమీపంలోని ఆకర్షణలు..

- వివేకానంద మెమోరియల్

- గాంధీ మెమోరియల్

- తిరువల్లువర్ విగ్రహం

- కుమార అమ్మన్ ఆలయం

- శ్రీ భద్రకాళి దేవస్థానం

- తిర్పరప్పు జలపాతం

సందర్శించడానికి ఉత్తమ సమయం

సందర్శించడానికి ఉత్తమ సమయం

ఇక్క‌డ సంవత్సరం పొడవునా వాతావరణం చాలా ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది. ట్రిప్ ప్లాన్ చేయడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు. చాలా మంది పర్యాటకులు ఆనందించే సాయంత్రం సమయంలో చల్లని గాలి వీచే వసంతకాలం అద్భుతమైన సమయం.

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

ఇది కేరళ రాజధాని త్రివేండ్రం నుండి 55 కిలోమీటర్ల దూరంలో తుక్కలేలో ఉంది. అక్క‌డి నుంచి క్యాబ్‌ని అద్దెకు తీసుకోవచ్చు లేదా బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి. సమీప రైల్వే స్టేషన్ నాగర్‌కోయిల్. ఇది ప్యాలెస్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్క‌డి నుంచి బస్సు లేదా టాక్సీ ద్వారా చాలా సులభంగా చేరుకోవచ్చు. విమానాల కోసం, త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాలి. అక్క‌డి నుంచి ఇష్టమైన రవాణాను ఎంపిక చేసుకోవ‌చ్చు. దాదాపు 52 కిలోమీటర్ల ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

Read more about: kerala trivandrum tukkale
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X