నేటి గోవా పనాజి పోలి ఉంటుంది. అది పెద్ద సిటి కాకపోవచ్చు. జనసాంద్రత అధికంగా లేకపోవచ్చు. కాని అక్కడ ఎపుడూ కొంత బిజీగానే ఉంటుంది. పనాజి ను ఎప్పటికి పొంగని ప్రాంతంగా వర్ణిస్తారు. సముద్ర మట్టానికి సుమారు 7 మీటర్ల ఎత్తులో ఉంటుంది. జీవనం గోవాలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే కూడా వేగంగానే ఉంటుంది. అయితే, ఇతర మెట్రోలతో పోలిస్తే జీవనం నెమ్మది. నగర వాసులకు విశ్రాంతి సెలవుల దినాలుగా అనిపిస్తుంది. దీనికి తగినట్లుగా పట్టణంలో కూడా సుమారు 1,50,000 మంది నివాసితులు మాత్రమే ఉంటారు.
గోవా విశ్రాంతి సెలవులకు వెళితే, బసకు పనాజి మంచి ప్రదేశం కావలసినన్ని అయిదు నక్షత్రాల హోటళ్ళుమరియు, నాలుగు నక్షత్రాల హోటళ్ళు, రెస్టరెంట్లు, షాపింగ్ ప్రదేశాలు ఉంటాయి. ఎప్పుడూ పార్టీలు నడిచే నార్త్ గోవాకు, వారసత్వం కల సౌత్ గోవాకు నగర ప్రదేశాలైన వాస్కోడా గామా మరియు మార్మెగోవాలకు దూరంగా ఉంటుంది.
పనాజి లోని పురాతన మ్యూజియం తప్పక చూడాలి. ఇక్కడ గోవాకు సంబంధించిన వాణిజ్య మరియు సాంస్కృతిక అంశాలు ఎన్నో కనపడతాయి. గోవా నేటి స్ధితికి ఎలా చేరిందనేది తెలుస్తుంది. గోవాలోని రబ్బర్ తోటలు నుండి దాని ఉప్పు కయ్యల వరకు అన్నీ ఉంటాయి. బిగ్ ఫుట్ చరిత్ర బాగా ప్రదర్శించబడింది. బిగ్ ఫుట్ అనేది ఒక పెద్ద స్టేజ్. దీనిలో అనేక కార్యక్రమాలుజరుగుతాయి.
మీరు పాణ్ జింలో ఇడిసి కాంప్లెక్స్ సమీపంలో ఉంటే, గోవా స్టేట్ మ్యూజియం మరియు దానిలోని 8000 ప్రదర్శనలు, మట్టి, ఇతర లోహాలు, చెక్క మొదలైనవి, మరియు వివిధ ఇండియన్ పెయింటింగ్ లు అన్ని కూడా హిందూ మరియు జైన శాసనాలతో చూడవచ్చు. గోవా రాష్ట్ర మ్యూజియం ప్రతి సంవత్సరం వేలాది పర్యాటకులను, విద్యార్ధులను, కళా పిపాసకులను ఆకర్షిస్తుంది.
మండోవి నదిపై సూర్యోదయ, సూర్యాస్తమయాలను చూసేటందుకు అక్కడ కల బాన్ స్టారిమ్ బ్రిడ్జి లేదా మెటా బ్రిడ్జి పైకి వెళ్ళవచ్చు. పాణజిం బ్రిడ్జి కూడా తప్పక చూడండి. దీనినే మండోవి బ్రిడ్జి అని కూడా అంటారు. సుమారుగా 1980లలో ఈ బ్రిడ్జి కూలిపోతుందనే వార్తలు రావటంతో అప్పటినుండి అంటే మూడు దశాబ్దాలనుండి ఫెర్రీ సర్వీసులు వాడుతున్నారు.
పనాజి బ్రిడ్జి రెండు సమాంతర బ్రిడ్జిలు కలిగి ఉంటుంది. సూర్యాస్తమయం ఇక్కడినుండి చాలా బాగుంటుంది. పనాజి నుండి రీస్ మేగోస్ కోట కూడా చూడవచ్చు. మండోవి నది ఒడ్డున రీస్ మేగోస్ అనే గ్రామం కూడా కలదు. ఇక్కడే రీస్ మేగోస్ కోట కూడా ఉంటుంది. ఇక్కడినుండి చూస్తే పాంజిం మనోహరంగా కనపడుతుంది. ఇటీవలే దీనిని పునర్నిర్మించారు. ఈ కోటను అగుడా కోటకు ముందు 50 సంవత్సరాల క్రిందటే నిర్మించారు.
పనాజి మతపరంగా కూడా ప్రసిద్ధి ఇక్కడ ఛాపెల్ ఆఫ్ సెయింట్ కేధరిన్ మరియు పనాజి చర్చి ఉన్నాయి. హిందువులైతే మహలక్ష్మీ మరియు మారుతి దేవాలయాలు చూడవచ్చు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమంటే, సుమారు 2012 ప్రారంభంలో స్ధానికులు ఎద్దు పందేలను ఆరంభించారు. అయితే, స్ధానిక అధికారులు వాటిని వెంటనే రద్దు చేశారు.
పనాజి గోవాలోని అన్ని ప్రాంతాలనుండి బస్ లలో చేరవచ్చు. లేదా బైక్ అద్దెకు తీసుకొని పర్యటించవచ్చు. సూచనా బోర్డులు అనేకం ఉండి తేలికగా చేరేలా ఉంటాయి. మీరు కనుక ముంబై లేదా పూనే పట్టణాలనుండి ప్రయాణిస్తూంటే, గోవాకు మొదటగా తగిలేది పాంజిం మాత్రమే. పనాజి విమానాశ్రయం నుండి 30 నిమిషాలలో చేరవచ్చు. ప్రి పెయిడ్ క్యాబ్స్ విమానాశ్రయ టర్మినల్ వద్ద దొరుకుతాయి.