మన భారతదేశంలో కొన్ని స్థలాలు రహస్యంగా వున్నాయి.కట్టడాలు, ప్రక్రుతిసిద్ధమైన ఏర్పడిన నిర్మాణం కూడా తనలో అనేక నిగూఢాలను దాచుకున్నది.అటువంటివాటిలో హిమాలయాలలోని స్టోన్ టవర్ ఏ వుద్దేశ్యంచేత నిర్మించారు అనేది ఇప్పటికీ తెలీని విషయమై వుంది.వాటిని ఎప్పుడు నిర్మించారు అనేది కూడా తెలీదు. వేలాది సంవత్సరాలనుండి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని నిలిచివున్నాయి.
మార్టిన్ అనే వ్యక్తి దీని మీద కొన్ని సంవత్సరాల కాలంపాటు పరిశోధనలు చేసెను.ఈ టవర్స్ హిమాలయాలలో తగ్గు ప్రదేశంలో వున్నాయి.అయితే ఇక్కడ నివసించిన టిబెట్ సన్యాసులు కూడా వీటిగురించి దాగున్న అనేక రహస్యాలను బట్టబయలుచేయటానికి ప్రయత్నించారంట కాని అది సాధ్యంకాలేదు. హిమాలయాలలో వున్న భూభాగం మీద ఈ టవర్స్ నిర్మించటం అంత సులభం కాదు అని చెప్తారు.
అలాగయితే ఆ రహస్యమైన టవర్స్ ను ఎవరు నిర్మించారు?వాటి విశేషతలేమి? అనే అనేకమైన ప్రశ్నలకు జవాబులు ఈ వ్యాసంమూలంగా తెలుసుకుందాం.
హిమాలయాల్లో ఇప్పటికీ రహస్యంగానే వున్న టవర్స్
ఈ టవర్స్ ను 1800 సంల క్రితమే నిర్మించివుండవచ్చును.ఇవి సముద్రమట్టం నుండి సుమారు 200అడుగుల ఎత్తులో వున్నాయి. ఇవన్నీ హిమాలయాలలో వున్న తగ్గు ప్రదేశంలో చూడవచ్చును. అయితే దీనికి ఎటువంటి ఆధారం లేదు.
హిమాలయాల్లో ఇప్పటికీ రహస్యంగానే వున్న టవర్స్
వీటిలో 40 కి పైగా నక్షత్ర ఆకారంలో వున్నా ఇంకా కొన్ని 12 మూలాలను కలిగియున్న ఆకారంలో నిర్మించటంజరిగింది.అయితే టిబెట్ లో వీటిని "సిగ్నల్ టవర్" అని పిలుస్తారు.
దీని గురించి ఎటువంటి వైజ్ఞానిక కారణం ఇప్పటివరకూ లభించలేదు.అయితే కొంత మంది అభిప్రాయం ప్రకారం...
హిమాలయాల్లో ఇప్పటికీ రహస్యంగానే వున్న టవర్స్
కొందరి ప్రకారం ఇది సర్గానికల్ టవర్స్ లాగా టిబెట్ లేజెంటర్ ను కలిగివున్న టవర్స్ అని భావిస్తారు. టిబెట్ అనేది అత్యంత ప్రాచీనమైన సంస్కృతిని , సంప్రదాయాన్ని మరియు ఆచార, విచారాలను కలిగివున్నది.
హిమాలయాల్లో ఇప్పటికీ రహస్యంగానే వున్న టవర్స్
ఈ వింటర్ లో చూడదగిన ప్రదేశాలు
ఈ టవర్స్ అత్యంత ఎత్తులో వున్నా , వీటిని ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు?అనేది ఎప్పటికీ రహస్యంగానే వుంది.ప్రస్తుతం చలికాలం కావటంచేత హిమాలయాలలో వున్న అత్యంత జనప్రియమైన చలికాలంలో చూడవలసిన టూరిస్ట్ ప్రదేశాలగురించి తెలుసుకుందాం.
హిమాలయాల్లో ఇప్పటికీ రహస్యంగానే వున్న టవర్స్
గుల్మార్గ్
గుల్మార్గ్ హిమాలయాలలో ప్రసిద్ధమైన గిరిధామం.ఇది చలికాలసమయంలో సందర్శించటానికి వుత్తమమైన టూరిస్ట్ ప్రదేశాలు. ఇక్కడ మంచుతో కప్పబడిన పర్వతాలు, అద్భుతమైన భూదృశ్యాలను చూడవచ్చును. ఇది ప్రపంచంలోనే రెండవ అత్యంత ఎత్తైన కేబుల్ కారు.
హిమాలయాల్లో ఇప్పటికీ రహస్యంగానే వున్న టవర్స్
శ్రీనగర్
శ్రీనగర్ జమ్మూ & కాశ్మీర్ యొక్క వేసవి రాజధాని మరియు చలికాలంలో ప్రసిద్ది చెందిన స్థలం. ఇది చలికాలంలో భారీ హిమపాతంతో కూడివుంటుంది. మొత్తం కాశ్మీర్ లోయ మంచు నాలుగు అంగుళాల కవచానికి లోబడి ఉంటుంది. శ్రీ నగర్ దాల్ సరస్సు, పడవ ఇళ్ళు, తోటలు ప్రసిద్ధి చెందింది.
హిమాలయాల్లో ఇప్పటికీ రహస్యంగానే వున్న టవర్స్
పహల్గం
అందమైన పహల్గం జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క అనంతనాగ్ జిల్లాలో వున్న ఒక పట్టణం. ఇది భారతదేశం యొక్క అత్యంత జనప్రియ స్థలం. ఇక్కడ ప్రధాన ఆకర్షణ బీటాబ్ లోయ, అమర్నాథ్ యాత్ర, హార్స్ రైడ్ (రైడ్) మరియు అనేకమైనవి.
హిమాలయాల్లో ఇప్పటికీ రహస్యంగానే వున్న టవర్స్
పాట్ని టాప్
జమ్మూ మరియు కాశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలో జాతీయ రహదారి 1 హిమాలయ పర్వతాలలో శివాలిక్ పర్వతాలపై ఉన్న పట్నితోప్ హిల్ యొక్క ప్రదేశం. ఇది పారా గ్లైడింగ్ కోసం ఒక ప్రసిద్ధ ప్రదేశం. చలికాలంలో ఈ ప్రాంతం మంచుతో కప్పబడినది.
హిమాలయాల్లో ఇప్పటికీ రహస్యంగానే వున్న టవర్స్
సిమ్లా
హిమాచల ప్రదేశ్ లో రాజధాని అయిన సిమ్లాని కిన్నౌర్ మరియు సిమ్లౌర్ ప్రసిద్ధిచెందినవి.సిమ్లా చలికాలంలో చెప్పుకోదగ్గ టూరిస్ట్ ప్రదేశాలు. ఇక్కడ ఎక్కువగా స్కేటింగ్ మరియు స్కీయింగ్ వంటి చలికాలంలోని క్రీడలను ఆనందించవచ్చును. ఇక్కడ ముఖ్యంగా హిందూ దేవతైన కాళి దేవాలయం, అందమైన వుద్యానవనాలు ఇక్కడి ప్రముఖమైన ఆకర్షణలు.
హిమాలయాల్లో ఇప్పటికీ రహస్యంగానే వున్న టవర్స్
కుఫ్రి
కుఫ్రి సిమ్లాకి సమీపంలో వున్న ఒక చిన్నదైన కొండప్రాంతం. కుఫ్రి విశ్వంలో అతి ఎత్తైన గో-కార్ట్ ట్రాక్. అంతేకాదు హిమాలయాలలోని అభయారణ్యాలు కూడా చూడవచ్చును. ఇక్కడి సుందరమైన స్థలాలు ఎలాంటివారినైనా మంత్రముగ్దులను చేస్తాయి.
హిమాలయాల్లో ఇప్పటికీ రహస్యంగానే వున్న టవర్స్
మనాలి
ఇదొక అద్భుతమైన టూరిస్ట్ ప్రదేశం.ఇక్కడ అందమైన పర్వతాలు ఎక్కువగా మంచుతో కప్పబడివుంటాయి. ఇక్కడ ముఖ్యంగా మంచుతో కప్పబడివుండటంవలన అద్భుతమైన సౌందర్యాన్ని చూడవచ్చును.
మౌంటేన్ బైకింగ్, పారాగ్లైడింగ్, స్కేటింగ్ మరియు ఝోర్భింగ్ లాంటి వినోద కార్యక్రమాలను అందిస్తుంది.మనాలి నుండి 51కిమీ దూరంలో వున్న విశ్వ ప్రసిద్ధ రోతాంగ్ పాస్ మనాలీ-లెహ్ కులు లోయతో కలుస్తుంది.
హిమాలయాల్లో ఇప్పటికీ రహస్యంగానే వున్న టవర్స్
ధర్మశాల
ప్రసిద్ధమైన కాంగ్రా లోయలోవున్న ధర్మశాల హిమాచలప్రదేశ్ చలికాల నగరం.,ఇది హిమాచలప్రదేశ్ యొక్క అత్యంత జనప్రియ టూరిస్ట్ ప్రదేశమైనా,దలైలామాకు సమీపంలోవున్న ధౌలాధర్ శ్రేణి యొక్క మ్యాక్లియోడ్ గంజ్ గ్రామానికి సమీపంలో వుంది.