భారతదేశం దేవాలయాలకు పుట్టినిల్లు. ఇక్కడ కుల, మత, జాతి, వర్ణ బేధం లేకుండా ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి గొప్ప చరిత్రగల దేశంలో దేవాలయాలకు కొదువలేదు. ఇక్కడున్న అనేక కట్టడాలు, రాజప్రసాదాలు, కోటలు మరియు గత కాలము యొక్క దేవాలయాలు భారతదేశం యొక్క గత వైభవాలను గుర్తుతెస్తుంది. భారతదేశంలో ప్రయాణీకులు గర్వంగా తలెత్తుకొని దేవాలయాలను సందర్శించవచ్చు.
ఎన్నో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే అంతులేని సంపద. బంగారు ఆభరణాలు, వజ్రాలు ఇలా ఒక్కటేమిటి. నిధి అంటే అందులో వుండే నగలకు లెక్కకట్టడం మానవమాత్రులకు సాధ్యమయ్యే పనికాదు. ఈ క్రమంలో ఏదైనా ఒక ప్రదేశంలో నిధి వుందని తెలిస్తే కొందరు దుండగులు దాన్ని సొంతం చేసుకొనేదాకా వదలరు. ఇదే నేపధ్యంలో వచ్చిన అనేక సినిమాలను కూడా మనం చూసాం. అయితే సినిమాల్లోనే కాదు అలాంటి అంతులేని సంపద వున్న కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ మన దేశంలో వున్నాయ్.
మన దేశంలో వెలకట్టలేని నిధి, నిక్షేపాలు ఉన్న 5 ప్రాంతాలు ఇవే !
టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి
1.నదీర్షా నిధి
క్రీ.శ. 1939లో పర్షియన్ రాజు నదీర్షా తన 50,000 మంది సైనికులతో 30,000 మంది ప్రజలను దోచుకున్నాడట. ఎన్నో విలువైన ఆభరణాలు, లెక్కలేనన్ని వజ్రాలు అతను దోపిడీ చేసాడట.
pc: youtube
2. ఆభరణాలు
అయితే ఆ ఆభరణాలలో నెమలి సింహాసనం కూడా ఉందట. ప్రస్తుతానికి అది ఇరాన్లో ఉంది.
pc: youtube
3. ఖుష్ లోయ
అయితే అది తప్ప అతను దోచుకున్న నిధిలో ఇంత వరకు ఒక్క ఆభరణం కూడా ఎవరికీ దొరకలేదట. కొందరేమో ఆ నిధి హిందు ఖుష్ లోయలో ఉందని చెబుతున్నారు.
pc: youtube
4. సోన్బందర్ గుహలు, బీహార్
బీహార్లోని రాజ్గిర్లో ఉన్న సోన్బందర్ గుహల్లో బింబాసర అనే రాజుకు చెందిన నిధి ఉందట. ఆ గుహల లోపల సీలింగ్కు బంగారు పూత ఉంటుంది.
pc: youtube
5. సోన్ బందర్ గుహలు
అందుకే వాటిని సోన్ బందర్ గుహలు అని పిలుస్తారు. అయితే ఆ గుహ లోపల ఓ రహస్య ద్వారం ఉందట.
pc: youtube
6. నిధి
దాంట్లో నుంచి ఇంకా చాలా లోపలి వైపు నిధి ఉందట. ఈ క్రమంలో ఆ రహస్య ద్వారాన్ని బ్రిటిషర్లు ఓసారి తెరిచేందుకు యత్నించారట. కానీ అది వారికి సాధ్యపడలేదట.
pc: youtube
7. కృష్ణా నది, ఆంధ్రప్రదేశ్
ప్రఖ్యాత కోహినూర్ వజ్రం గురించి తెలుసు కదా. అయితే ఆ వజ్రం కృష్ణా నదిలోనే ఒకప్పుడు రాజులకు దొరికిందట.
pc: youtube
8. డైమండ్స్
ఈ క్రమంలో అది ఇప్పుడు ఎక్కడ ఉందో అందరికీ తెలుసు. అయితే నిజానికి కోహినూర్ వజ్రాన్ని పోలిన ఎన్నో డైమండ్స్ ఇప్పటికీ కృష్ణా నదిలో చాలా లోతులో ఉన్నాయట.
pc: youtube
9. పద్మనాభ స్వామి ఆలయం, కేరళ
కేరళలోని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభ స్వామి ఆలయం గురించి ఇటీవలి కాలంలో మనం తరచూ వింటూనే ఉన్నాం.
pc: youtube
10. టన్నుల కొద్దీ బంగారం, వజ్రాలు, ఆభరణాలు
అయితే ఆలయానికి చెందిన నేలమాళిగలలో ఎన్నో టన్నుల కొద్దీ బంగారం, వజ్రాలు, ఆభరణాలు ఉన్నాయట. వాటి విలువ రూ.1 లక్ష కోట్లకు పైనే ఉంటుందట.
pc: youtube
11. ఎలా వెళ్ళాలి?
ఇది కేరళ రాష్ట్ర రాజధాని. చెన్నై-తిరువనంతపురం (త్రివేండ్రం)రైలు మార్గము. తిరువనంతపురము సెంట్రల్ స్టేషన్ నుండి 1 కి.మీ.
pc: youtube
12. శ్రీ మూకాంబిక ఆలయం, కర్ణాటక
కర్ణాటకలోని పశ్చిమ కనుమల వద్ద కొడచద్రి పర్వతాలపై ఉన్న శ్రీ మూకాంబిక ఆలయంలో కింది భాగంలో ఓ రహస్య ద్వారం ఉందట.
pc: youtube
13. వెలకట్టలేని బంగారు ఆభరణాలు, వజ్రాలు
దాని గుండా వెళ్తే పర్వతాల్లో నిధి ఉన్న ఓ రహస్య గది ఓపెన్ అవుతుందట. అందులో వెలకట్టలేని బంగారు ఆభరణాలు, వజ్రాలు ఇప్పటికీ ఉన్నాయట.
pc: youtube
14. నివాస వసతులు
కొల్లోర్ లో అనేక లాడ్జింగ్లు ఉన్నాయి. దేవాలయ దేవస్వాం సౌపర్ణిక అనే ఒక వసతిగృహాన్ని నిర్వహిస్తుంది.
pc: youtube
15. వసతిగృహాలు
శ్రీ లలితాంబికా వసతిగృహం, మాతా ఛత్రం వసతి గృహం, గోయంకా వసతి గృహం మొదలగునవి కూడా అందుబాటులో ఉన్నాయి.
pc: youtube
16 .సదుపాయాలు
మొత్తం మీద ఈ సదుపాయాలతో దాదాపుగా 400 గదులు ఉన్నాయి. గది అద్దెలు సామాన్య భక్తులకు అందుబాటులోనే ఉంటాయి.
pc: youtube
17. సదుపాయం
ఒంటరి సందర్శకులకు బస్సు స్టాండు సముదాయము యొక్క ఆవరణలోనే ఒక డార్మిటరీ ఉంది. మరొక సదుపాయం అయిన అతిథి మందిర రామకృష్ణ యోగాశ్రమంచే నిర్వహించబడుతుంది.
pc: youtube
18. ఎలా వెళ్ళాలి?
కొల్లూర్ మూకాంబిక మెటల్ రోడ్డు ద్వారా చేరుకునే వీలు కలిగి ఉండి, మంగుళూరు, ఉడుపి, మరియు కుందాపూర్ నుండి నేరు బస్సులు ఉన్నాయి.
pc: youtube
19. ఎలా వెళ్ళాలి?
కొంకణ్ రైల్వే దారిలోని కుండాపూర్ లేక మూకాంబికా రోడ్డు ( బైన్డూర్) లు అత్యంత చేరువలో ఉన్న రైల్వే స్టేషన్లు.
pc: youtube
- ఈ గుడికి వెళ్ళాలంటే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే !
- తలక్రిందులుగా పడే ఆలయ శిఖరం నీడ ఎక్కడ ఉంది ?
- వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే !