పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రుతుపవనాల పండుగ గుజరాత్లో ప్రారంభమైంది. అవును! ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది పర్యాటకులను ఆకర్షించే గుజరాత్లోని మేఘ్ మలహర్ పర్వ్ ఉత్సవం ప్రారంభమైంది.
పర్యాటక శాఖ మంత్రి పూర్ణేష్ మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల ప్రతినిధులు కూడా ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ పండుగ గురించి మరిన్ని ముఖ్యాంశాలను ఇక్కడ చూడండి!
నిత్యం పర్యాటకులను ఆకర్షించే గుజరాత్, వివిధ ప్రత్యేకతలలో భారతదేశంలోని ఉత్తమ పర్యాటక గమ్యస్థానాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. యునెస్కో ప్రదేశాలు, మతపరమైన ప్రార్థనా స్థలాలు, జ్యోతిర్లింగ, చార్ ధామ్ దేవాలయాలు, మ్యూజియంలు, విస్తారమైన రాన్ ఆఫ్ కచ్ ఎడారి, స్టాట్యూ ఆఫ్ యూనిటీతో సహా గుజరాత్ వివిధ రకాల పర్యాటక ఆకర్షణలను అందిస్తుంది.
వర్షాకాలపు అందాలు..
గుజరాత్లోని ఏకైక హిల్ స్టేషన్ అయిన సపుతారాలో మేఘ్ మలహర్ పర్వ్ 2022 నిర్వహిస్తోంది. ఇక్కడి ప్రకృతి సహజ సౌందర్యం రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. గుజరాత్లోని డాంగ్ జిల్లాలో ఉన్న ఈ పట్టణం, ముఖ్యంగా వర్షాకాలంలో రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది పశ్చిమ కనుమల వెంబడి ఉండి, వర్షాకాలంలో అత్యంత అందమైన దృశ్యాలను అందిస్తుంది. ప్రతి సంవత్సరం గుజరాత్ పర్యాటక శాఖ నిర్వహించే ఈ పండుగ నెల రోజుల వేడుక. ఈ పండుగ జూలై ౩౦న ప్రారంభమై ఆగస్టు ౩౦న ముగుస్తుంది. ఇది నెల పొడవునా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యకలాపాలు, సాంప్రదాయ పండుగల కన్నుల పండుగగా జరుగుతుంది. అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనడానికి సపుతారా వైపు కవాతు చేస్తారు.
సంప్రదాయక రుచులు..
ఇక్కడి ఆసక్తికరమైన కార్యకలాపాలలో దహీ హండీ, రెయిన్ రన్ మారథాన్, బోట్ రేస్, నేచర్ ట్రెజర్ హంట్, టాంకీ డాన్స్ షోలు, క్విజ్ పోటీలు, సెమినార్లు ఉన్నాయి. వర్షాకాలం పండుగ సందర్భంగా గానం, రంగోలి సహా అనేక పోటీలు నిర్వహించబడుతున్నాయి. వీటితో పాటు ఫోటోగ్రఫీ, వార్లీ పెయింటింగ్, ఆర్ట్ పెయింటింగ్, వెదురు క్రాఫ్ట్, గిరిజన క్రీడా పోటీలు, బోట్ రేస్, యోగా క్లాసులు, మ్యూజిక్ క్లాసులు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన ఆర్ట్ అండ్ క్రియేటివిటీ వర్క్ షాప్ లు ఈ నెల పొడవునా జరుగుతాయి. అంతేకాక, పర్యాటకులు సపుతారా స్థానిక వంటకాల రుచిని ఆస్వాదించగలుగుతారు.
ఎన్నో సందర్శనీయ ప్రదేశాలు..
ప్రకృతి ఒడిలో ఉన్న అందమైన సపుతారాను ఈ వర్షాకాలంలోనే చాడాలి. అంటే, ఈ పండుగ సమయంలో తప్పక వెళ్ళాలన్న మాట. ప్రకృతిని ప్రేమించడమే కాకుండా ఇక్కడి సాంస్కృతిక కార్యక్రమానికి హాజరైన వారు ఆ అనుభూతులను జీవితంలో మర్చిపోలేరు. ఇక్కడికి దగ్గరలో చాలా సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. గవర్నర్ హిల్, బాలాసినోర్ డైనోసార్ మ్యూజియం, ఎకో పాయింట్, రోప్-వే, షబ్రీ ధామ్, టాంకీ డాన్స్, వాగై బొటానికల్ గార్డెన్, హడ్కాట్ ఫోర్ట్, వాన్స్టా నేషనల్ పార్క్, సన్ రైజ్, కిరా ఫాల్స్ మరియు సన్ సెట్ పాయింట్స్ వంటివి మీరు ఇక్కడ సందర్శించాల్సిన కొన్ని ప్రదేశాలు. ప్రకృతి, సంస్కృతి యొక్క శక్తివంతమైన పండుగలో పాల్గొనడానికి మేఘ్ మేఘ్ మలహర్ పర్వ్ను సందర్శించండి!