Search
  • Follow NativePlanet
Share
» »పర్యాటకులను రంజింపచేసే పాటలీపుత్ర అందాలు..!!

పర్యాటకులను రంజింపచేసే పాటలీపుత్ర అందాలు..!!

పాటలీపుత్రం పర్యాటలకు రంజింపచేస్తుంది

పాటలీ పుత్రయే, నేటి పాట్నా. నగరానికి ఆనుకొని వున్న ప్రాచీన నగరమే ఈ పాటలీ పుత్ర. పాట్నా దేశంలోని పురాతన నగరాలలో ఒకటి. క్రీ.పూ. నుండి ఈ ప్రాంతం గురించి వింటూ వస్తున్నాం. ఇది ప్రపంచంలోని అతిపురాతన నగరాలలో ఒకటిగా ప్రత్యేకతను పొందింది, చరిత్రలో ఆధిపత్య ఉనికిని చాటుకుంది. పవిత్ర గంగానది దక్షిణ ఒడ్డు చుట్టూ పాట్న పురోగతి చెందింది.

మగధ దేశపు రాజధానిగా, 'పాటలీపుత్ర' గా ప్రస్తుత బీహార్ రాజధానైన పాట్నా సేవలు అందించింది. ఇండియాలో ఎక్కువ జనాభా గల నగరాలలో 14 వ స్థానంలో, సంపన్న నగరాల జాబితాలో 15 వ స్థానంలో ఉంది. పాట్న చారిత్రిక కీర్తి, భవిష్యత్తు శతాబ్దాలుగా పరాకాష్టకు చేరుకుంది.

మగధ సామ్రాజ్యపు రాజైన అజాతశత్రు ఈ నగరాన్ని క్రీ.పూ. 490 లో ఒక చిన్న కోట "పాటలీగ్రామ" అనే పేరుతో నిర్మించాడు. ఈ నగరం గంగా నది తీరములో ఉంది. నవీన పాట్నా సమీపంలో విస్తృతంగా పురావస్తు పరిశోధనా త్రవ్వకాలు జరిగాయి. పాట్నా చుట్టుపక్కల 20 వ శతాబ్దంలో త్రవ్వకాల ప్రారంభంతో పటిష్ఠమైన చెక్క పటకాల సహా పెద్ద కోట గోడలున్నట్టు స్పష్టమైన ఆధారాలు లభించాయి.

ఉత్తర మధ్య భారతదేశంలో కేంద్ర స్థానంగా ఉన్న దీనిని పరిపాలనా రాజధానిగా నందాలు, మౌర్యులు, సుంగలు, గుప్తాలు వరుస రాజవంశ పాలకులుగా పాలించారు. గంగా, గంధక మరియు పుత్ర నదుల సంగమం వద్ద గల పాటలీపుత్ర రూపం "నీటికోట లేక జలదుర్గం". దీని స్థానం మగధ యొక్క ప్రారంభ సామ్రాజ్య కాలంలో ఇండో గంగా మైదానాల నదీ వాణిజ్య ఆధిపత్యానికి సహాయపడ్డాయి. ఇది వర్గక, వాణిజ్యాలకు గొప్ప కేంద్రంగా ఉండేది మరియు భారతదేశ నలుమూలల నుండి ప్రఖ్యాత చాణక్యుడు వంటి వ్యాపారులను మరియు మేధావులను ఆకర్షించింది. వరుస రాజవంశ పాలకులుగా పాలించిన ఈ పాటిలీపుత్రం ప్రస్తుతం 35 కిలోమీటర్ల పొడవు, 18 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉన్న పాట్నా నగరంలో చూడదగ్గ విశేషాలన్నో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

 గోల్‌ఘర్‌

గోల్‌ఘర్‌

నాటి ప్రధాన ధాన్యాగారం, గొల్ఘర్ ధాన్యం నిల్వచేసే పద్ధతులను తిరిగి నిర్వచించే నూతన ప్రయత్నం. ఈ 29 మీటర్ల పొడవైన ధన్యాగారాన్ని 1786 లో భారీ కరువు సమయంలో నిర్మించారు. గొల్ఘర్ దాని వ్యక్తిగత నిర్మాణ స్వభావంలోనే కాకుండా, గంగ నేపధ్యంలో నగరం మొత్తంలో విస్తృత దృశ్యాన్ని అందిస్తుంది. ఈ దృశ్యం ప్రపంచంలోని ప్రతి అంశంలో ఉత్కంఠభరితమైనది. ఆడియో- వీడియో విజువల్స్‌ ద్వారా చరిత్రను పరిచయం చేసే గోల్‌ఘర్‌ సందర్శకులను ఎంతో ఆకర్షిస్తాయి.

PC- Kumartheharshit

బుద్దగయా:

బుద్దగయా:

రెండు ముఖ్యమైన ప్రారంభ భౌద్ధుల సమాఖ్యలు ఇక్కడ జరిగాయి, బుద్ధుని మరణ సమయంలో జరిగినది మొదటిది కాగా, రెండవది అశోకుని పాలన సమయంలో జరిగింది. ఈ గయ కేవలం బౌద్ధులు మాత్రమే కాదు.. హిందువులు కూడా పవిత్రస్థలంగానే భావిస్తారు. బుద్ధుడి సిద్ధాంతాన్ని ఇక్కడి వారంతా శిరసా వహిస్తూ ఉంటారు. క్రీ.శ 1810లో గయ రెండు భాగాలుగా ఉండేది. ఒక భాగం పూజారులు నివసించే భాగం. ఈ భాగాన్ని గయ అనేవారు. రెండవ భాగంలో న్యాయవాదులు, వ్యాపారులు ఉండేవారు. ఇప్పుడు బుద్ధగయ గడిచిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది. గయలో అత్యంత ప్రత్యేకం బోధి చెట్టు. గయ పర్యటనకు వచ్చిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా సందర్శించాలనుకునేది ఈ బౌద్ధ చెట్టు. దీని కింద కూర్చుని ధ్యానించే సిద్ధార్థుడు బుద్ధుడు అయ్యాడు. అయితే అప్పటి బోధివృక్షం ఇప్పుడు లేదు. దాని తాలూకు మొలకే పెరిగి పెద్దదయి ఇప్పుడు సందర్శకులకు కనువిందు చేస్తుంది. తల్లిచెట్టును మరిపిస్తోంది

Photo Courtesy : commons.wikimedia.org

మహావీర్ మందిరం:

మహావీర్ మందిరం:

ఈ ఆలయం హనుమంతుడికి అంకితం చేసిన పవిత్ర ఆలయాలలో ఒకటి. మిలియన్ల యాత్రికులు తమ ఆదరణలను చెల్లించడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తారు, ఉత్తర భారతదేశం లోని మహావీర్ మందిరాలలో రెండవ అత్యంత సందర్శించదగ్గ ఆలయం. హిందూమత శరణార్ధులు విభజన తరువాత పెద్ద సంఖ్యలో పాట్నాకు పారిపోయిన 1947 వ సంవత్సరంలో ఈ ఆలయం గుర్తించబడింది. అక్కడి సంకట్-మోచన్ విగ్రహం భక్తుల మదిలో ప్రత్యెక స్థానాన్ని పొందింది. రామనవమి సందర్భంలో అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

PC-Shivamsetu

పఠాన్‌దేవి మందిర్‌

పఠాన్‌దేవి మందిర్‌

పాట్నా నగరం పేరుకు మూలమైన 'పఠాన్‌దేవి మందిర్‌', పాట్న లోని పేరుగాంచిన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం దుర్గామతకు చెందినదిగా భావిస్తారు. బరి పటాన్ దేవి ఆలయం గంగ నదికి ఉత్తరం వైపు తిరిగి ఉంటుంది. ఈ ఆలయంలోని విగ్రహాలు నల్లరాతితో చెక్కబడ్డాయి. ఏ మతానికి చెందినవారైనా ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు.

PC-Shivams707

పాట్నా ప్లానిటోరియం :

పాట్నా ప్లానిటోరియం :

పాట్న ప్లానిటోరియం నిస్సందేహంగా ఆసియా లోని అతిపెద్ద ప్లానిటోరియం లలో ఒకటి. ఇది ఖగోళ చిత్రాలకు సంబందించిన విషయాలను చూపించే సాధారణ చిత్రాల పర్యాటక అయస్కాంతం. ఇది ప్రదర్శనలను కూడా నిర్వహిస్తుంది.

Photo Courtesy : commons.wikimedia.org

అగంకుయన్

అగంకుయన్

“బాగా లోతైన” అని అర్ధం వచ్చే అగంకుయన్ అపారమైన చరిత్రను కలిగిఉంది. ఇది మౌర్య చక్రవర్తి అశోకుని పాలనతో ముడిపడి ఉన్న ఈ ప్రదేశం పాట్నలో అతిపురాతన పురావస్తు స్థలాలలో ఒకటి. ఈ స్థలానికి సంబంధించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి, వాటిలో కొన్ని హింసతో కూడుకొని ఉంటే, మరికొన్ని అశోకుడు సింహాసనాన్ని సాధించడానికి తన అన్నదమ్ములను విసిరి వేసినట్లు చెప్తాయి. ఈ స్థలానికి సమీపంలో మశూచి, ఆటలమ్మ వంటి రోగాలను తొలగించే శీతల దేవి ఆలయం ఉంది.

PC-Nandanupadhyay

పాట్నా మ్యూజియం

పాట్నా మ్యూజియం

1917లోనే ఇండో ముస్లిం కట్టడ రీతుల్లో ఉన్న 'పాట్నా మ్యూజియం'లో భారతీయ కళాసంపద ముఖ్యంగా పెయింటింగ్స్‌ రూపంలో లభిస్తాయి. స్థానికులు జాదుఘర్ అని ప్రేమగా పిలిచే పాట్న మ్యూజియం, రాష్ట్ర మ్యూజియం. ఈ మ్యూజియంలో అనేక మహుమతులు, గౌతమ బుద్ధుని పునరావశేషాలను ప్రదర్శనలో ఉంచారు, 200 మిలియన్ సంవత్సరాల చెట్టు శిలాజం, దిదర్గంజ్ యక్షి ప్రఖ్యాత విగ్రహ౦ ఉన్నాయి.

Photo Courtesy : commons.wikimedia.org

ఖుదాబక్ష్‌ ఓరియంటర్‌ లైబ్రరీ

ఖుదాబక్ష్‌ ఓరియంటర్‌ లైబ్రరీ

చారిత్రక నేపథ్యం ఉన్న 'ఖుదాబక్ష్‌ ఓరియంటర్‌ లైబ్రరీ', సిన్హా లైబ్రరీలలో వేల కొలదీ పుస్తక సముదాయాన్ని వీక్షించవచ్చు. ఖుదాబక్ష్ గొప్ప వారసత్వం కలిగిన ఒక గ్రంధాలయం. 1900 సంవత్సరంలో స్థాపించిన ఈ గ్రంధాలయంలో అరబిక్, పెర్షియన్ చేతిప్రతులు, రాజపుత్, ముఘల్ చిత్రాలు, ప్రపంచంలోని ఏ గ్రంధాలయంలో లేని 25 ఇళ్ళ ఖురాన్ ను ప్రశంసించే అనేక పుస్తకాలు వంటి అత్యధిక అరుదైన సేకరణలు ఉన్నాయి.

PC-Mukram Khan

గురుద్వారా లేదా తఖ్త్ శ్రీ హర్మందిర్ సాహిబ్

గురుద్వారా లేదా తఖ్త్ శ్రీ హర్మందిర్ సాహిబ్

పాట్న వద్ద గురుద్వారా లేదా తఖ్త్ శ్రీ హర్మందిర్ సాహిబ్, సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ జి జ్ఞాపకార్ధం మహారాజ రంజిత్ సింగ్ నిర్మించారు. ఈ గురుద్వారా చాలా ఖచ్చితంగా భారతదేశంలోని తూర్పు ప్రాంతంలో సిక్కుల మూలంగా ఉంది. బంగారపు పూతపూసిన ఊయల (పంగూర అని పిలుస్తారు) ఇటువంటి గురు గోవింద్ సింగ్ జి వ్యక్తిగత వస్తువులు చాలా ఉన్నాయి.

PC-SUDEEP PRAMANIK

సంజయ్ గాంధీ జైవిక్ ఉద్యాన్

సంజయ్ గాంధీ జైవిక్ ఉద్యాన్

సంజయ్ గాంధీ జైవిక్ ఉద్యాన్ ఒక ప్రశాంతమైన ప్రదేశం. ఈ ప్రాంగణం వృక్షాలతో, మధ్యలో ఒక పెద్ద చెరువుతో, అనేక అడవి దారులతో ముఖ్యంగా పిల్లలకు చాలా ఆశక్తికరమైన ప్రదేశంగా ఉంటుంది. ఈ పార్క్ 300 కంటే ఎక్కువ చెట్లు, మూలికలు, పొదల రకాలతో నిండి ఉంటుంది. ప్రత్యెక మొక్కలను ప్రదర్శించే ఔషధ మొక్కల కోసం ఒక నర్సరీ, ఆర్చేడ్ హౌస్, ఫెర్న్ హౌస్, అద్దాల ఇల్లు, గులాబీ తోట ఉన్నాయి.

Photo Courtesy : commons.wikimedia.org

అమరవీరుల స్థూపం

అమరవీరుల స్థూపం

అమరవీరుల స్థూపం, క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు నాయకుల జీవిత పరిమాణ విగ్రహాలు. ఈ స్థూపం ధైర్య సాహసాలు గల నాయకుల గౌరవార్ధం కట్టబడింది.

Photo Courtesy : commons.wikimedia.org

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+