భారత దేశంలో ఉత్తరాఖండ్ కు దేవతలు కొలువై ఉన్న రాష్ట్రంగా పేరు. హిమాలయ పర్వత పాదాల్లో ఉన్నటు వంటి ఈ రాష్ట్రంలో హిందూ పురాణాలకు సంబంధించిన అనేక దేవాలయాలు ఉన్నాయి. అందులో కొన్నింటి వివరాలు విస్తుగొల్పేవిగా ఉన్నాయి. అటువంటి కోవకు చెందినదే కార్తికేయస్వామి దేవాలయం. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం..
కార్తిక్ స్వామి దేవాలయం
P.C: You Tube
కుమార స్వామి దేవాయం శివుడి కుమారుడైన కుమారస్వామికి అంకితం చేయబడిన దేవస్థానం. ప్రక`తి ఒడిలో ఉన్నటువంటి ఈ దేవాలయం హిందువులకు ఎంతో పవిత్రమైనది.
కార్తిక్ స్వామి దేవాలయం
P.C: You Tube
అంతే కాకుండా ఉత్తర భారత దేశంలోనే కుమారస్వామికి ఉన్న అరుదైన దేవాలయాల్లో ఈ దేవాలయం ఒకటి.
కార్తిక్ స్వామి దేవాలయం
P.C: You Tube
సముద్రమట్టానికి దాదాపు 3050 మీటర్ల ఎత్తులో ఉన్నటు వంటి ఈ దేవాలయం చేరుకోవడానికి 3 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది.
కార్తిక్ స్వామి దేవాలయం
P.C: You Tube
హిమాలయాల రాష్ట్రమైన రుద్రప్రయాగ్ జిల్లాలో కనక్ చౌరి గ్రామం సమీపంలో ఈ దేవాలయం ఉంటుంది. కనక్ చౌరి గ్రామం వరకూ వాహనాల్లో వెళ్లవచ్చు.
కార్తిక్ స్వామి దేవాలయం
P.C: You Tube
అక్కడి నుంచి మాత్రం అత్యంత కఠినమైన మార్గంలో ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే ఈ దేవాలయన్ని చేరుకోగలం. ఇక ఈ దేవాలయం ముందు దాదాపు రెండు వందల గంటలు ఉంటాయి.
కార్తిక్ స్వామి దేవాలయం
P.C: You Tube
వాటి శబ్ధం 800 మీటర్ల దూరం వరకూ వినిపిస్తుంది. హరిద్వార్ లేదా రిషికేష్ నుంచి రుద్రప్రయాగ్ వరకూ బస్సులో ప్రయాణం చేసి అక్కడి నుంచి కనక్ చౌరి గ్రామాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.
కార్తిక్ స్వామి దేవాలయం
P.C: You Tube
అటు పై ట్రెక్కింగ్ ద్వారా ఈ కుమారస్వామిని దేవాలయాన్ని చేరుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు అన్నీ రుషికేష్ లోనే చేసుకొని ఇక్కడికి రావడం మంచిది.
కార్తిక్ స్వామి దేవాలయం
P.C: You Tube
ఇదిలా ఉండగా ఉత్తర భారత దేశంలోని అరుదైన ఈ కుమారస్వామి దేవాలయం దర్శనం వల్ల సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని నమ్ముతారు.
కార్తిక్ స్వామి దేవాలయం
P.C: You Tube
ఈ దేవాలయం ఇక్కడ ఉండటం వెనుక ఒక ఆసక్తికర కథనం వినిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడా లేనటు వంటి కుమారస్వామికి చెందిన ఎముకలు ఈ దేవాలయంలో ఉన్నాయిని స్థానికులు భావన.
కార్తిక్ స్వామి దేవాలయం
P.C: You Tube
ప్రమధ గణాలకు అధిపతితో పాటు , దేవుళ్లలో మొదటి పూజ ఎవరికి చేయాలన్న దాని పై తీవ్ర చర్చ జరుగుతుంది. చివరికి ఇందుకు వినాయకుడితో పాటు, కుమరస్వామి సరైన వారిగా అందరు దేవతలు గుర్తిస్తారు.
కార్తిక్ స్వామి దేవాలయం
P.C: You Tube
అయితే ఒక్కరికి మాత్రమే ఈ గౌరవం దక్కాలని దేవవతలు నిర్ణయిస్తారు. ఇందు కోసం అన్నదమ్ములైన ఆ కుమారస్వామి, వినాయకుడికి పరీక్ష పెట్టాలని ఆ పరమశివుడు నిర్ణయిస్తారు.
కార్తిక్ స్వామి దేవాలయం
P.C: You Tube
దాని ప్రకారం ఈ భూ మండలాన్ని ఎవరు ఏడుసార్లు చుట్టి, తీర్థాల్లో స్నానం చేసి మొదట ఇక్కడికి వస్తారో వారికే మొదటి పూజ నిర్వహించాలని పరమశివుడు పరీక్ష పెడుతాడు.
కార్తిక్ స్వామి దేవాలయం
P.C: You Tube
దేవతలతో పాటు కుమారస్వామి, వినాయకుడు కూడా ఈ పరీక్ష విధానం పట్ల మొదట ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే కుమారస్వామి వాహనం నెమలి. అది గాలిలో బాగా ఎగురుతుంది.
కార్తిక్ స్వామి దేవాలయం
P.C: You Tube
ఇక కుమారస్వామి శరీరం కూడా చాలా సాధారణంగా ఉంటుంది. అయితే వినాయకుడి వాహనం ఎలుక చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది. వినాయకుడి శరీర ఆకారం వేగంగా వెళ్లడానికి సహకరించదు.
కార్తిక్ స్వామి దేవాలయం
P.C: You Tube
దీంతో ప్రతి ఒక్కరూ ఇక కుమారస్వామి ఈ పరీక్షలో నెగ్గడం ఖాయమని భావిస్తారు. ఇదిలా ఉండగా కుమారస్వామి తన వాహనమైన నెమలి సహాయంతో విశ్వాన్ని చుట్టి రావడానికి బయలుదేరుతాడు.
కార్తిక్ స్వామి దేవాలయం
P.C: You Tube
బాగా ఆలోచించిన వినాయకుడు తన తల్లిదండ్రులైన ఆ పరమశివుడు, పార్వతీ దేవిల కాళ్లకు నమస్కరించి వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు.
కార్తిక్ స్వామి దేవాలయం
P.C: You Tube
దీంతో కుమారస్వామి ఏ తీర్థానికి వెళ్లినా మొదట అక్కడ వినాయకుడే కనిపిస్తాడు. అయినా పట్టు విడవని కుమారస్వామి ఈ విశ్వాన్ని ఏడు సార్లు చుట్టి వస్తాడు.
కార్తిక్ స్వామి దేవాలయం
P.C: You Tube
అయితే వినాయకుడు కుమారస్వామి కంటే ముందే తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుని అక్కడ కుర్చొండిపోతాడు. ఇక పరమశివుడు కూడా వినాయకుడు పరీక్షలో విజయం సాధించినట్లు ప్రకటిస్తాడు.
కార్తిక్ స్వామి దేవాలయం
P.C: You Tube
ఎవరికైనా తల్లిదండ్రులే ప్రపంచమని వారి పాదపూజ కోటి తీర్థాలతో సమానమని చెబుతాడు. అయితే చిన్నవాడైన కుమారస్వామి ఈశ్వరుడి నిర్ణయం పట్ల అలుగుతాడు.
కార్తిక్ స్వామి దేవాలయం
P.C: You Tube
దీంతో తన శరీరంలో కఠినంగా ఉండే కొన్ని ఎముకలను తీసి తన తల్లి అయిన పార్వతీ దేవికి ఇచ్చి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోతాడు. ఈ ఘటన మొత్తం జరిగింది ప్రస్తుతం కార్తికేయ దేవాలయం ప్రాంతం.
కార్తిక్ స్వామి దేవాలయం
P.C: You Tube
ఇప్పటికీ కార్తికేయునికి చెందిన ఎముకలను మనం ఈ దేవాలయంలో చూడవచ్చు. అందువల్ల కొంత కఠినప్రయాణమైనా చాలా మంది ఈ దేవాలయానికి వెలుతుంటారు.