భారత దేశాన్ని అనేకమంది పొరుగు దేశాలకు చెందిన చక్రవర్తులు పరిపాలించారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది ఇక్కడి హిందూ మతం పై గౌరవం పెంచుకొని ఆలయాలను నిర్మించారు. అయితే మరికొంతమంది మాత్రం హిందూ మతం అంతానికి కంకణం కట్టుకొని కనిపించిన దేవాలయాలను, వాటిలోని శిల్పాలను నాశనం చేయడానికి విఫలయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఔరంగజేబు నుంచి ఓ అరుదైన శ్రీకృష్ణుడి విగ్రహం కాపాడటానికి మధురలోని ఆలయ నిర్వహాకులు ఓ సాహసమే చేసి విజయం సాధించారు. ఆ మధురలోని విగ్రహం రాజస్థాన్ లో పూజలు అందుకొంటూ ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం
ఉదయ్ పూర్ కు దగ్గర
P.C: You Tube
ఆరావళి పర్వతశ్రేణిలో రాష్ట్రమైన రాజస్థాన్ లోని రాజసమండ్ జిల్లాలోని నాథ్ ద్వారా అనే చిన్న పట్టణంలో శ్రీనాథ్ జీ విగ్రహం ఉంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు 48 కిలోమీటర్ల దూరంలో ఈ నాథ్ ద్వారా ఉంది. ఈ విగ్రహం మథుర నుంచి ఇక్కడికి వచ్చిందని చెబుతారు.
ఔరంగజేబు
P.C: You Tube
మొగల్ వంశానికి చెందిన ఔరంగజేబు హిందూ దేవాలయాలను నాశనం చేసేవాడని చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలోనే ఆయన కృష్ణుడి జన్మస్థానమైన మధురలో ఉన్న శ్రీనాథ ఆలయాన్ని క్రీస్తు శకం 1672 కూడా ధ్వంసం చేయాలని భావిస్తాడు.
విగ్రహం రక్షించాలని
P.C: You Tube
ఈ విషయాన్ని ముందుగా తెలుసుకున్న ఆలయ నిర్వాహకులు మూలవిరాట్ అయిన శ్రీనాథ విగ్రహాన్ని రక్షించాలని భావిస్తాడు. కృష్ణుడు ఏడేళ్ల వయస్సులో గోవర్థన గిరిని ఎత్తుతున్నట్లు ఉండే ఆ విగ్రహాన్ని శ్రీనాథుడిగా పూజించేవారు.
మధుర నుంచి తరలిస్తారు
P.C: You Tube
ఈ విగ్రహం మధురలోని యమునా నది తీరంలో దొరికిందని చెబుతారు. ఈ విగ్రహం అరుదైన నల్లరాతితో చేయబడి చూడటానికి నయనమనోహరంగా ఉంటుంది. అరుదైన శ్రీనాథ విగ్రహాన్ని ఎద్దుల బండిలో ఉంచి ఔరంగజేబు కంటబడకుండా మధుర నుంచి ఆలయ నిర్వాహకులు తరలిస్తారు.
నాథ్ ద్వారా వద్ద ఆగిపోతుంది.
P.C: You Tube
అలా వెలుతున్న ఎద్దుల బండి ప్రస్తుతం నాథ్ ద్వారా కు వచ్చిన వెంటనే ఆగిపోతుంది. ఎంత ప్రయత్నించినా ఎద్దులు ముందుకు కదలవు. దీంతో ఆ బండి వెంబడి ఉన్న పండితులు ఆ ప్రాంతంలోనే శ్రీనాథుడికి ఆలయం కట్టించాలని భావిస్తారు
రాజ్ సింగ్
P.C: You Tube
ఈ విషయాన్ని అప్పట్లో ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజ్ సింగ్ కు తెలియజేస్తారు. రాజు సంతోషంగా ఆలయ నిర్మాణానికి అంగీకరిస్తాడు. సొంత ఖర్చులతో ఆ ఆలయాన్ని నిర్మిస్తాడు. అంతేకాకుండా పండితులకు అక్కడ నివాసాలు ఏర్పాటు చేస్తారు.
అందుకే ఆ పేరు
P.C: You Tube
అలా ద్వారక నుంచి వచ్చిన శ్రీనాథుడి విగ్రహం కొలువైన ప్రాంతం కావునే దానికి నాథ్ ద్వారా అని పేరొచ్చింది. ఇక ఆలయాన్ని బ`ందావనంలోని నందమహారాజ ఆలయం శైలిలో నిర్మించారు. మూలవిరాట్టును కూడా శ్రీనాథ్ జీ పేరుతో కొలువడం మొదలుపెట్టారు. ఆలయం గోపురం మీద ఎప్పుడూ ఏడు జండాలు ఎగురుతూ ఉంటాయి.
గోవర్థనగిరి ఎత్తుతున్నట్లు
P.C: You Tube
ఇక ఆలయంలో శ్రీ కృష్ణుడి విగ్రహం ఎడమచేతితో గోవర్థన గిరిని ఎత్తుత్తూ కూడి చేతిని పిడికిలిగా బిగించి ఛాతి మీద విశ్రాంతిగా పెట్టున్నట్లు ఉంటుంది. ఈ శిల్పంలో శ్రీ కృష్ణుడితోపాటు ఒక సింహం, రెండు ఆవులు, రెండు నెమళ్లను చూడవచ్చు.
అచ్చం అలాగే పూజలు
P.C: You Tube
ఈ ఆలయంలోని పూజలన్నీ మధురలో కృష్ణుడికి ఏవిధంగా జరుగుతాయో అలాగే జరుగుతాయి. వల్లభాచార్యుడి వంశీయులే ఈ గుడికి పూజారులు. ఈ విగ్రహాన్ని బాలకృష్ణుడిగా భావించి గోవులు కాయడానికి వినియోగించే కర్రను విగ్రహం వద్ద ఉంచుతారు.
మూడు పూటలా నైవేద్యం
P.C: You Tube
ఆలయంలో జన్మాష్టమి, దీపావళి, హోలీ పండుగులు బ్రహ్మండంగా జరుగుతాయి. స్వామివారికి నేత పంచె, జరీ కండువా, రత్నఖచిత ఆభరణాలతో ప్రతి రోజూ ఆలంకరణ ఉంటుంది. మూడు పూటలా స్వామివారికి నైవేద్యం ఇక్కడ విశేషం.