మన హిందూదేవాలయాల్లో కొన్నింటికి వేలసంవత్సరాల చరిత్ర వుంది. ఆనాడు నిర్మించిన దేవాలయాల్లో ఎన్నో రహస్యాలు దాగివున్నాయి.అయితే ఇలా నిర్మించినవాటిలో రాక్షసగుళ్ళుకూడా వున్నాయని మీకు తెలుసా? అసలు రాక్షసగుళ్ళు అంటే అర్ధం ఏంటి రాక్షస గుళ్ళలో నిదినిక్షేపాలు వుంటాయంటారు.అది ఎంతవరకూ నిజం.అసలు రాక్షస గుళ్ళు ఏఏప్రాంతాల్లో వున్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా?అయితే ఈ వ్యాసం మూలంగా తెలుసుకుందాం.
వేల కోట్ల రూపాయల కుబేరుడి ఖజానా ఎక్కడుందో తెలుసా !
చరిత్రను ఒక్కసారి పరికించిచూస్తే మనకు పాతరాతి యుగం, కొత్తరాతి యుగం అనేవి కనిపిస్తాయి. వాటిలో కొత్తరాతియుగపు ఆదిమానవులు ఎక్కడికివెళ్ళినా గుంపులుగుంపులుగా వెళ్ళేవారట. గుంపులుగుంపులుగానే జీవనాన్ని కొనసాగించే వారట.
PC: youtube
వేల కోట్ల రూపాయల కుబేరుడి ఖజానా ఎక్కడుందో తెలుసా !
వారికి పునర్జన్మలపై విశ్వాసం ఎక్కువగా వుండేది అందుకే వారిలో ఎవరైనా చనిపోయినట్లయితే వారు మళ్ళీ ఎక్కడోఓచోట జన్మిస్తారనే వుద్దేశ్యంతో ఒక పెద్దమట్టికుండను తయారుచేయించి చనిపోయిన వారి మృతదేహాన్ని ఆ కుండలో పెట్టి ఆకులు ఇంకా నారలతో ఆ కుండల్ని చుట్టి భూమిలో పాతిపెట్టేవారు.
PC: youtube
వేల కోట్ల రూపాయల కుబేరుడి ఖజానా ఎక్కడుందో తెలుసా !
అంటే ఖననం చేసేవారన్న మాట.అలా పాతి పెట్టిన శవాల్ని ఏ జంతువూ పీక్కుతినకుండా వాటిచుట్టూ పెద్దపెద్ద బండరాళ్ళను గోడలుగా నిలబెట్టి వాటిపై కప్పులాగా వుండేందుకు ఇంకొన్ని బండ రాళ్ళను వుంచేవారట.వీటినే మన పురావస్తు శాస్త్రవేత్తలు రాక్షసగుళ్ళు అని,పాండవగుళ్ళు అనీ పిలుస్తున్నారు.
PC: youtube
వేల కోట్ల రూపాయల కుబేరుడి ఖజానా ఎక్కడుందో తెలుసా !
పురావస్తు శాస్త్రవేత్తలపరిశోధనల్లో ఈ గుళ్ళు ఎక్కడైతే బయటపడుతున్నాయోఅక్కడే నాటి ఆది మానవులు నివశించారని ఆ గుళ్ళే అందుకు సాక్ష్యాలని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ కాలంలో చనిపోయినవారిని సమాధిచేసి నిర్మించిన పెద్దపెద్ద ప్రాకారాలనే నేడు రాక్షస గుళ్ళు అంటున్నాం.
PC: youtube
వేల కోట్ల రూపాయల కుబేరుడి ఖజానా ఎక్కడుందో తెలుసా !
అలాంటి రాక్షస గుళ్ళు శ్రీకాకుళం, విజయనగరం ఇంకా ఉభయగోదావరిజిల్లాలలో అక్కడక్కడా కనిపిస్తున్నాయి. రాయలసీమలో బయటపడిన ఈ సమాధుల్ని పాండవ గుళ్ళు అని అక్కడివారు పిలుస్తుంటారు. కర్నూలుజిల్లా శంఖవారంలో గోర్రెఆకారంలోనల్గొండజిల్లా ఏలేశ్వరంలో శంఖుఆకారంలో విశేష నిర్మాణాలు బయటపడ్డాయి.
PC: youtube
వేల కోట్ల రూపాయల కుబేరుడి ఖజానా ఎక్కడుందో తెలుసా !
పెద్దపెద్ద బండరాళ్ళతో నిర్మించిన ఈ సమాధులు క్రీపూ2000ల నుండి క్రీపూ500 ల ల సంలమధ్య కాలంనాటి వాటివిగా చరిత్ర కారులు చెపుతున్నారు.ఈ సమాధుల్లో చనిపోయినవారి అస్థికలుగానీ,మృత దేహాలు గానీ వుంచి వారికి సంబంధించిన వస్తువులని కూడా మృతదేహంతోపాటే పూడ్చటం నాడు ఆచారంగా వుండేది.
PC: youtube
వేల కోట్ల రూపాయల కుబేరుడి ఖజానా ఎక్కడుందో తెలుసా !
ఈ సమాధుల్లో బంగారు ఆభరణాలు, వేణువులు,ఇతర వస్తుసముదాయాలు వున్నట్టుగా పురావస్తుశాస్త్రవేత్తలు కనుగొన్నారు.చనిపోయిన వారితో పాటు వారు వుపయోగించినవస్తువులు పూడ్చిపెట్టినట్లయితే వారి ఆత్మకు శాంతిచేకూరుతుందని,అలా చేస్తే వారు మళ్ళీ వారి కుటుంబాలలో ఎవరోఒకరికి జన్మించే అవకాశంవుందనే వుద్దేశ్యంతోనే ఆనాటి మానవులు విశ్వసించి అలా చేసేవారు.
PC: youtube
వేల కోట్ల రూపాయల కుబేరుడి ఖజానా ఎక్కడుందో తెలుసా !
కొంతమందైతే ఆ సమాధులదగ్గర చనిపోయిన వారి జ్ఞాపకార్ధంగా కొన్ని శిలాస్థంభాలను ఏర్పాటుచేసేవారు.పురావస్తు శాఖ వారు జరిపిన తవ్వకాలలో నాగార్జునకొండ దగ్గర నాటి ఇక్ష్వాకులకాలంనాటి ఛాయాస్థంభాలు బయటపడ్డాయి.
PC: youtube
వేల కోట్ల రూపాయల కుబేరుడి ఖజానా ఎక్కడుందో తెలుసా !
ఈ సమాధుల్లోనూ రకాలు ఉన్నాయి. అవి 1. డాల్మెన్లు, 2. సిస్త్లు ఈ రెండు రకాల సమాధులు తెలుగు నేల మీద వేల సంఖ్యలో ఉన్నట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ రెండు రకాల సమాధులకు పై కప్పు బండలకు రంధ్రములు ఏర్పరిచి ఉన్నాయి. ఈ రంధ్రాల ద్వారా ప్రేతాత్మ సమాధి నుండి బయటికి వచ్చి సంచరించి, తిరిగి సమాధులలోకి పోతుందని ఆనాటి ప్రజల విశ్వాసం.
PC: youtube
వేల కోట్ల రూపాయల కుబేరుడి ఖజానా ఎక్కడుందో తెలుసా !
డాల్మెన్లు
రాతి పలకలతో పెట్టె వలె నిర్మించి, పైన మూత వలె పెద్ద రాతి పలకను ఉంచెడి లోహ యుగం నాటి సమాధులను డాల్మెన్లు అంటారు. రాతి పలకకు ఒకవైపు పెద్ద రంధ్రం ఏర్పాటు చేస్తారు. ఈ రాతి పెట్టెను భూమి ఉపరి భాగంలో ఉంచి, శవంతో పాటు, మృతుడు వాడిన వస్తువులను అందులో ఉంచి పైన రాతి పలకను ఉంచెడివారు.
డాల్మెన్ సమాధి ప్రాంతాలు
వాడవల్లి, శిరిపురం, వెల్లటూరు, చిట్యాల తాడ్వాయి
PC: youtube
వేల కోట్ల రూపాయల కుబేరుడి ఖజానా ఎక్కడుందో తెలుసా !
సిస్త్లు
పెద్ద గోయి తీసి రాతి పలకలతో సిద్ధపరచిన పెట్టెను శవంతో పాటు భూస్థాపితం చేసి, చుట్టూ వృత్తాకారంలో పెద్ద పెద్ద రాతిగుండ్లను పేర్చి సురక్షితమొనర్చిన సమాధులను సిస్త్లు అని అంటారు.
సిస్త్ సమాధి ప్రాంతాలు
మట్టపల్లి, తిప్పర్తి, నల్లగొండ, ఏలేశ్వరం, వలిగొండ, మౌలాలి, రాయగిరి, తుమ్మల గూడెం, పొడిచేడు, సింగాపురం, దేవరుప్పల, నడింపల్లి, కదంబాపూర్, పెద్ద మరూర్
రాక్షసగూళ్ళు మన తెలుగురాష్ట్రాలలోనే వేలకొలది వున్నాయని పురావస్తుశాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ రాక్షసగూళ్ళలో కోట్లువిలువ చేసే బంగారు ఆభరణాలు వున్నట్టుగా వారు చెబుతున్నారు.
PC: youtube
వేల కోట్ల రూపాయల కుబేరుడి ఖజానా ఎక్కడుందో తెలుసా !
శ్రీకాకుళం ఎలా చేరాలి
హైదరాబాద్ నుండి సూర్యాపేట, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం మార్గాలద్వారా శ్రీకాకుళం చేరవచ్చును
PC:google maps
ఈ లింగాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు సమస్త పీడలు నశిస్తాయి ! ఆదిశివలింగం ఎక్కడ ఉందో తెలుసా ?
భూమిలోపల 10 కి మీ వరకు గుహ..ఆ గుహలో బయటపడ్డ వింత వింత పాత్రలు !
మిస్టరీలకు సాక్షి ... దౌలతాబాద్ కోట !
మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు