భారత దేశంలోనే అత్యంత పురాతన దేవాలయాన్ని ఇటీవల తమిళనాడులో పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు. ఈ దేవాలయం అత్యంత మానమానవాతీత శక్తులకు నిలయమని కొంతమంది అఘెరాలుచెబుతున్నారు. ముఖ్యంగా శైవారాధన చేసేవారు ఈ దేవాలయం గురింంచి కథలు కథలుగా చెబుతారు. అందుకే ఈ దేవాలయం వద్ద రహస్యంగా పూజలు చేస్తున్నారు.
ముఖ్యంగా ఆ దేవాలయం బయల్పడిన ప్రదేశంలో మట్టిని తీసుకుని వెలుతూ తమ తాంత్రిక పూజల్లో వినియోగిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా మట్టిలో కూరుకుపోయిన ఆ ఆలయ గర్భగుడి లో వింతైన మురుగన్ విగ్రహంతో పాటు విలువైన నిధి దాగిఉందని కూడా సమాచారం.
ఇవన్నీ ఒక కోణమైతే ప్రస్తుతం ఈ దేవాలయం ప్రముఖ పర్యాటక కేంద్రాంగా మరింది. మహాబలిపురం దగ్గరగా ఉండటమూ ఇందుకు కారణమయ్యింది. ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడ ఉంది. అక్కడికి ఎలా చేరుకోవాలి, దాని నిర్మాణం ఎలా ఉంది తదితర వివరాలన్నీ మీ కోసం...
సాలువకుప్పన్ మురుగన్ దేవాలయం
P.C: You Tube
తమిళనాడులో మిగిలిన దేవతలతో పోలిస్తే మురుగన్ దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తారు. మిగిలిన ప్రాంతాల్లో ఆ మురుగన్ ను సుబ్రహ్మణ్యస్వామి పేరుతో పిలుస్తారు.
సాలువకుప్పన్ మురుగన్ దేవాలయం
P.C: You Tube
నాగపంచమి రోజున సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్న క్షేత్రంలో భక్తులు ఎక్కువగా పూజలు చేస్తారు. దీని వల్ల సంతానం కలుగుతుందని వారి నమ్మకం.
సాలువకుప్పన్ మురుగన్ దేవాలయం
P.C: You Tube
అయితే తమిళనాడులో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మహాబలిపురం వద్ద ఉన్న సాలువకుప్పం అనే గ్రామం వద్ద కనుగొన్నారు.
సాలువకుప్పన్ మురుగన్ దేవాలయం
P.C: You Tube
దాదాపు 10వేల సంవత్సారాలకు పూర్వంమే ఈ దేవాలయాన్ని ఇటుకలతో నిర్మించారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఈ దేవాలయం పూర్తిగా నేలలో కూరుకు పోయింది.
సాలువకుప్పన్ మురుగన్ దేవాలయం
P.C: You Tube
అటు పై ఈ దేవాలయం గొప్పతనాన్ని కనుగొన్న పల్లవులు తిరిగి 8వ శతాబ్దంలో పున: నిర్మించారు. ఈ సారి ఇటుకలతో కాకుండా మొత్తం దేవాలయాన్ని గ్రానైట్ తో నిర్మించారు.
సాలువకుప్పన్ మురుగన్ దేవాలయం
P.C: You Tube
అయితే ఆ దేవాలయం కూడా వాతావరణం వల్ల లేదా కొంతమంది ధ్వంసం చేయడం వల్ల తిరిగి నాశనమయ్యింది. అయితే సునామి వచ్చిన తర్వాత ఈ దేవాలయం కొంత బయటికి కనబడింది.
సాలువకుప్పన్ మురుగన్ దేవాలయం
P.C: You Tube
మొత్తంగా ఈ దేవాలయం సంగం కాలంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయం ఉత్తరముఖంగా ఉంది. తమిళనాడులోనే పల్లవులకు ముందు నిర్మించిన దేవాలయాల్లో ఇది రెండవది మాత్రమే.
సాలువకుప్పన్ మురుగన్ దేవాలయం
P.C: You Tube
మరో దేవాలయం మనకు విప్పత్తూరు లోని విత్తిరుద్ర పెరుమాళ్ దేవాలయం. దీనిని ఏడు పగోడాల్లో ఒకటిగా గుర్తించే విషయమై పరిశోధనలు జరుగుతున్నాయి.
సాలువకుప్పన్ మురుగన్ దేవాలయం
P.C: You Tube
ప్రస్తుతం గర్భగుడి మొత్తం ఇసుకతో, ఒక పెద్ద గ్రానైట్ బండతో కప్పబడి ఉంది. దీనిని బయటికి తీస్తే అతి విశిష్టమైన, విలువైన సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం లభిస్తుందని తెలుస్తోంది.
సాలువకుప్పన్ మురుగన్ దేవాలయం
P.C: You Tube
దీని కోసమే కొంతమంది అఘోరాలు పూజలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన శాసనాలు కూడా ఇక్కడ లభించాయి.
సాలువకుప్పన్ మురుగన్ దేవాలయం
P.C: You Tube
సునామిల వల్లే ఈ దేవాలయం నషించిపోయినట్లు పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఆ దేవాలయం లోపల విశిష్టమైన విగ్రహంతో పాటు విలువైన సంపద కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
సాలువకుప్పన్ మురుగన్ దేవాలయం
P.C: You Tube
ఇక్కడ దొరికిన ఆధారాలను అనుసరించి ఈ దేవాలయం నిర్మాణంలో అనుసరించిన వాస్తుశాస్త్రం మనకు దక్షిణాదిలో మరే దేవాలయంలోనూ కనిపించదు.
సాలువకుప్పన్ మురుగన్ దేవాలయం
P.C: You Tube
ఈ దేవాలయంలో కనిపించే శిల్పాలను అనుసరించి వాటి భంగిమలను బట్టి ఈ దేవాలయం తాంత్రిక పూజలు కూడా చేసేవారని అనుమానిస్తున్నారు.
సాలువకుప్పన్ మురుగన్ దేవాలయం
P.C: You Tube
భారతదేశంలో వాస్తుశాస్త్రం రచించడానికి ముందే నిర్మించిన ఈ దేవాలయం గురించి మరింత పరిశోధనలు ఒకవైపు పురావస్తుశాఖ చేస్తుంటే మరోవైపు అఘోరాలు చేస్తున్నారు.
సాలువకుప్పన్ మురుగన్ దేవాలయం
P.C: You Tube
ఇక్కడ నంది, ఒక మహిళ తల, దీపం, శివలింగం, అత్యంత అరుదైన నీల మణితో రూపొందించిన అరుదైన రూపం కలిగిన వస్తువును కూడా ఈ స్థలంలో దొరికాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారింది.