ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాజ్యాంగాన్ని కల్గిన మన భారతదేశం యొక్క పార్లమెంట్ భవనాన్ని ఏ ఆలయానికి నమూనాగా తీస్కొని నిర్మించారో మనం ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
చౌసత్ యోగిని దేవాలయం ఖజురహో లో అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటిగా ఉంది. సుమారు 875-900 AD లో నిర్మించిన ఈ దేవాలయాలు పశ్చిమ సమూహానికి చెందినవి. ఈ ఆలయం 64 యోగిని లకు అంకితం చేయబడింది. ఈ ఆలయం తల్లి దేవత యొక్క వివిధ రూపాలుగా పరిగణిస్తారు.
ఈ ఆలయం స్థానిక గ్రానైట్ తో మాత్రమే నిర్మించబడింది. ఈ ఆలయం రూపకల్పన సరళమైన మరియు ఏ ఆభరణాల అలంకరణలు లేకుండా ఉంటుంది. ఈ గోడలపై ఖజురహో దేవాలయాల స్వాభావిక చెక్కడాలు ఉండవు. అరవై నాలుగు చిన్న యోగిని విగ్రహాలు బయటకు ఉంచడానికి అరవై ఏడు ఆలయాలుగా ఉంటాయి. పెద్ద విగ్రహం దుర్గాదేవి అంకితం చేయబడిన పరాక్రమశాలి మర్దిని రూపంలో ఉంటుంది. మిగిలి ఉన్న దేవాలయాల్లో విగ్రహాలు బ్రాహ్మణి మరియు మహేశ్వరి కోసం ఉన్నాయి. ఈ ఆలయం ఖజురహో లోని అతిపురాతన ఆలయాల్లో ఒకటి. ఇది భారతదేశం లోనే అతి పురాతన యోగిని దేవాలయం.
పార్లమెంట్ భవనాన్ని ఏ ఆలయం ఆధారంగా నిర్మించారో మీకు తెలుసా?

మన పార్లమెంట్ భవన్ నిర్మాణ రహస్యం !
మధ్యప్రదేశ్ మొరెనా జిల్లాలో వున్న యోగిని దేవాలయం మన పార్లమెంట్ భవన నిర్మాణం అనేది దీనికి నమూనాగా వుంటుంది. దీనినే చౌసట్ యోగిని దేవాలయం అని కూడా అంటారు.

మన పార్లమెంట్ భవన్ నిర్మాణ రహస్యం !
ఈ దేవాలయంలో పూర్వకాలంలో మంత్ర,తంత్ర సాధకులు, యోగులు దీనిని వారి యొక్క విశ్వవిద్యాలయంగా భావించి అక్కడే కాళికాదేవిని ఉపాసించేవారు.

మన పార్లమెంట్ భవన్ నిర్మాణ రహస్యం !
ఈ ఆలయంలోని యోగినీలను తాంత్రికులు, మంత్రసాధకులు పూజించేవారు.

మన పార్లమెంట్ భవన్ నిర్మాణ రహస్యం !
అందుకే దీనిని తాంత్రిక విద్యాలయం అన్నారు.

మన పార్లమెంట్ భవన్ నిర్మాణ రహస్యం !
అయితే ఇప్పటికీ కొంతమంది మంత్రసాధనకోసం ఇక్కడికి వస్తారట.

మన పార్లమెంట్ భవన్ నిర్మాణ రహస్యం !
ఈ ఆలయం 300అడుగుల ఎత్తులో వుంటుంది.

మన పార్లమెంట్ భవన్ నిర్మాణ రహస్యం !
ఈ ఆలయం వృత్తాకారంలో వుండి అందులో 64యోగినుల ఆలయాలు నిర్మించబడివున్నాయి.

మన పార్లమెంట్ భవన్ నిర్మాణ రహస్యం !
ఇక్కడ పురాతన శివాలయం కూడా వుంది. ఇది ప్రస్తుతం ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో వుంది.

మన పార్లమెంట్ భవన్ నిర్మాణ రహస్యం !
దీనిని 9వ శతాబ్దంలో నిర్మించివుంటారు.

స్థల పురాణం
ఆదిదేవుడైన పరమశివుడు ... జగన్మాత అయిన పార్వతీదేవి నెలకొని వున్న క్షేత్రాలు పరమ పవిత్రమైనవిగా, మహిమాన్వితమైనవిగా అలరారుతున్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటిగా మధ్యప్రదేశ్ లోని 'జబల్ పూర్' అలరారుతోంది.

స్థల పురాణం
ప్రసిద్ధి చెందిన ఇక్కడి క్షేత్రాల్లో 'చౌసట్ యోగిని' ఆలయం ఒకటిగా అలరారుతోంది. ఇక్కడి ఆలయంలో ప్రాకార మంటపాల్లో 64 మంది యోగినీలు కొలువుదీరి కనిపిస్తారు. ఈ కారణంగానే ఈ ఆలయానికి 'చౌసట్ యోగిని' ఆలయం అనే పేరు వచ్చింది.

స్థల పురాణం
ఈ యోగినీ రూపాలు అద్భుతంగా మలచబడ్డాయి. మొఘల్ చక్రవర్తుల కాలంలో ఈ ఆలయంపై దాడులు నిర్వహించి, ఈ శిల్పాలను ధ్వంసం చేశారు. ఈ కారణంగా చాలా శిల్పాలు భిన్నమై కనిపిస్తుంటాయి. అయినా ఆనాటి శిల్పకళా వైభవానికి ఈ శిల్పాలు సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి. 10 వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం, ఆనాటి రాజుల శైవ భక్తిని ఆవిష్కరిస్తూ వుంటుంది.

స్థల పురాణం
అపూర్వమైన ఇక్కడి నిర్మాణాలు సందర్శకులను అబ్బురపరుస్తుంటాయి. ఇక ఇక్కడి ప్రధాన విశేషం ఏమిటంటే, గర్భాలయంలోని శివపార్వతులు నంది వాహనాన్ని అధిరోహించి కనిపిస్తుంటారు. నంది వాహనంపై ముందువైపున కూర్చున్న శివుడు, వెనక కూర్చున్న పార్వతీదేవి వైపు తిరిగి ఏదో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంటాడు. ఆదిదంపతుల అన్యోన్యతకు ఈ దృశ్యం అద్దం పడుతూ వుంటుంది.

స్థల పురాణం
ఓ మహర్షి తపస్సుకు మెచ్చి ఆయన అభ్యర్ధన మేరకు స్వామివారు ఈ రూపంలో ఆవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది. మనోహరమైన ఈ మూలమూర్తిని దర్శించడం వలన, వివాహ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు ... ఆ స్వామి సేవా భాగ్యాన్ని పొందుతూ తరిస్తుంటారు.

ఏక్ లింగ్ జీ మహాదేవ్ టెంపుల్
మరిప్పుడు ఏక్ లింగ్ జీ మహాదేవ్ టెంపుల్ గురించి తెలుసుకుందాం.

ఎక్కడ వుంది?
ఇది మహారాష్ట్రలోని ఉదయ్ పూర్ జిల్లాలో వుంది.

కైలాస్ పురి
రెండు కొండల మధ్య వున్న ఈ ప్రాంతం అతిప్రాచీన శివాలయాన్ని కలిగివుంది.ఈ ఊర్ని "కైలాస్ పురి" అంటారు.

ఏక్ లింగ్ జీ మహాదేవ్ ఆలయం
కానీ ఇక్కడ వున్న ఏక్ లింగ్ జీ మహాదేవ్ ఆలయం కారణంచేత ఈ ప్రాంతం ఏక్ లింగ్ జీ మహాదేవ్ ఆలయం ప్రాంతంగా ప్రసిద్ధిచెందింది.

ఏక్ లింగ్ జీ మహాదేవ్ ఆలయం
అత్యంత ప్రాచీన శివాలయాల్లో "ఏక్ లింగ్ జీ శివాలయం" కూడా ఒకటి.

మేవాడ
మహారాష్ట్రలోని మేవాడ రాజులయోక్క కుల దైవంగా, ఇష్టదైవంగా శివుడు ఇక్కడ పూజలను అందుకున్నాడు.

108ఉపఆలయాలు
ఈ ఆలయం యొక్క ప్రాంగణంలో 108ఉపఆలయాలు వున్నాయి.

ఏక్ లింగ్ జీ శివాలయం
ఇక్కడ వున్న ఏక్ లింగ్ జీ శివాలయంలో శివుడిని నాల్గుముఖాలతో వున్న విగ్రహమూర్తి ప్రత్యేకంగా,అద్భుతంగా అనిపిస్తుంది.

అత్యంత భక్తిశ్రద్ధలు
మేవాడ్ వారు ఈ శివుడ్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించేవారు.ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించారు.

పునరుద్ధరణ
ఇక ఇక్కడ వున్న శివుడియొక్క 19 అవతారాల్ల 18 వ అవతారం నక్లేష్ అవతారం అనీ ఇలాంటి ఆలయం మరెక్కడా లేదని అయితే ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో మహారాజ్ రాణాముల్లో తిరిగిపునరుద్ధరించాడు.

నాల్గుముఖాలు
ఇక్కడ శివుడికి వున్న నాల్గుముఖాలు నాల్గు సంకేతాలకు నిదర్శనంగా వున్నాయి.

నాల్గుముఖాలు
తూర్పు దిక్కుకు వున్న శివుడియొక్క స్వరూపాన్ని సూర్యభగవానుడికి సంకేతంగా, పశ్చిమదిక్కుకు వున్న మూర్తిని బ్రహ్మదేవుడికి ప్రతీకగా మరియు గర్భగృహ ద్వారానికి పశ్చిమ దిక్కులో వుంటుంది.

లక్షలాది మంది భక్తులు
గర్భగృహంలోనికి ఎవ్వరినీ అనుమతించరు. ఇక్కడ శివరాత్రి మొదలైన పర్వదినాలలో లక్షలాదిభక్తులు వచ్చి ఆ పరమశివుడిని దర్శించుకుని అభిషేకాదులు సమర్పించివారి జీవితాన్ని ధన్యం చేసుకుంటూవుంటారు.



Click it and Unblock the Notifications














