మహారాష్ట్ర జిల్లాలలో షోలాపూర్ జిల్లా ఒకటి. షోలాపూర్ నగరం జిల్లా కేంద్రంగా ఉంది. షోలాపూర్ రాష్ట్ర ఆగ్నేయ ప్రాంతంలో భీమా మరియు సీనా నదీమైదానాల మద్య ఉంది. జిల్లా మొత్తానికి భీమానది నుండి నీటిపారుదల వసతి లభిస్తుంది. షోలాపూర్ జిల్లా బీడి ఉత్పత్తికి ప్రసిద్ధిచెందింది. అక్కల్కోట మల్లికార్జునఆలయంలో ప్రతిరోజూ అనేకమంది లింగాయత భక్తులు శివుని ఆరాధిస్తుంటారు.
ఎండలు మరియు వర్షాలు లెక్కచేయక లక్షలాది వార్కరీలు పండరీపురానికి యాత్రార్ధం వస్తుంటారు. వారు తుకారాం కీర్తనలను గానం చేస్తూ వందలాది మైళ్ళు ప్రయాణం చేస్తూ విఠ్ఠల్ దర్శనానికి వస్తుంటారు. విఠ్ఠల్ భగవానుని ఆలయం చాలా పురాతనమైనది.
ఇది కూడా చదవండి: సోలన్ - భారతదేశపు పుట్టగొడుగుల నగరం !
ఇక్కడ విఠ్ఠల్ భగవానుని భక్తులు స్పృజించి ఆరాధించడానికి అవకాశం ఉంది. దామాజి, కంహొపాత్రా మరియు తికచార్యా ప్రంతాలలాగ మంగల్వేధ కూడా సన్యాసులకు నిలయం. దామాజీ కొరకు విఠ్ఠల్ భగవానుడు స్వయంగా వచ్చి దర్శనం ఇచ్చాడు.
కలియుగ అంతానికి కారణమయ్యే గుడి !
ఆరంభకాలంలో ఈ ప్రాంతాన్ని బదామీ చాళుఖ్యులు పాలించారు. వారి రాజధానులు కన్నడ దేశంలో ఉండేవి. వీరిని కుంతలేశ్వర్లు అని కూడా అనేవారు. రాజధాని మణపురాలో (ప్రస్తుత సతారా జిల్లాలో ఉంది) ఉండేది. పొరుగు ప్రాంతం ప్రస్తుతం సతారా జిల్లా మరియు షోలాపూర్ జిల్లాలోఉన్నాయి. దీనిని మనదేశ అనే వారు.
ఆ ఊళ్ళో ప్రతి ఇంటికి ఒక పామును పెంచుతారు !
టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి
1. సిద్ధేశ్వర్
షోలాపూర్ పురాతనమైన చారిత్రాత్మక మరియు మతప్రధానమైన ప్రాంతం. షోలాపూర్ ప్రజలు సిద్ధేశ్వర్ను గ్రామదేవతగా ఆరాధిస్తున్నారు.
PC: youtube
2. ఆరాధ్యదైవం
సిద్ధేశ్వర్ 12వ చెందిన వాడు. సిద్ధేశ్వర్ అనుసరించిన కర్మయోగం ఆయనను స్వస్థలంలో ఆరాధ్యదైవంగా మార్చింది.
PC: youtube
3. లింగాయత గురువులు
సిద్ధరామ లింగాయతులకు చెందినవాడు. లింగాయత గురువులు 6 గురులో సిద్ధరామ ఒకడని భావిస్తున్నారు. ఆయన సిద్ధి పొందాడు.
PC: youtube
4. షోలాపూర్లో జీవసమాధి
షోలాపూర్లో కరువు సంభవించినప్పుడు శ్రీసిద్ధేశ్వర్ 4000 మంది సహాయకులతో ఒక సరసును త్రవ్వించాడు. సరసులో మంచినీరు లభించింది. ఆయన షోలాపూర్లో జీవసమాధి అయ్యాడు.
PC: youtube
5. విషయం
పామును చూస్తే కిలోమీటర్ దూరం పారిపోయే మనం ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతాం. అదేంటా అనుకుంటున్నారా!
PC: youtube
6. షేప్త్ పాల్ గ్రామం
పామును ఆ గ్రామంలో అందరూ పెంచుకుంటారు. నిజం! ఆ విషయం గురించి తెల్సుకుందాం. మహారాష్ట్రాలోని షోలాపూర్ జిల్లా షేప్త్ పాల్ గ్రామంలో పాముల ఆరాధనకు ప్రసిద్ధిచెందింది.
ఉత్తర మహారాష్ట్ర ప్రధాన ఆకర్షణలు !!
PC: youtube
7. పామును ఆరాధిస్తారు
ఈ ఊళ్ళో ప్రతి ఇంటికీ ఒక పామును పెంచుతారు మరియు ఆ పామును ఆరాధిస్తారు.
PC: youtube
8. నాగేంద్రస్వామి
మన భారతదేశంలో పూర్వం నుండి ఈ నాగేంద్రస్వామిని కొలిచినట్లు అందరికీ తెలిసినదే. కానీ ఇక్కడ ప్రతి ఇంటికీ ఒక పామును పెంచటం మాత్రం ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు.
PC: youtube
9. స్థలం
ఇక్కడ వారి ఇంటి పైకప్పులలో పాములు విశ్రాంతి తీసుకునేందుకు కొంచెం స్థలం కూడా వదులుతారు.
PC: youtube
10. ఆశ్చర్యకరమైన విషయం
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇంతవరకు అక్కడ పాము ఎవరినైనా కరిచినట్టు ఒక్క రిపోర్ట్ కూడా నమోదుకాలేదు.
PC: youtube
11. పిల్లలతో సహా అందరూ
పిల్లలతో సహా అందరూ ఆ పామును పట్టుకొని వాటితో స్నేహం చేస్తారు. పామును హిందువులు ఆరాధిస్తారు మరి అందరూ ఆరాధించే శివయ్య మెడలో ఈ నాగేంద్రుడు కోలువైవుండటం వలన ఈ గ్రామం వాళ్ళు పూర్వం నుంచి ఈ పామును ఆరాధిస్తూ వున్నారు.
PC: youtube
12. భారతదేశంలో చాలా చోట్ల కూడా ఈ నాగుపాము విగ్రహాలు
మనకి భారతదేశంలో చాలా చోట్ల కూడా ఈ నాగుపాము విగ్రహాలు మనకు కనిపిస్తాయి. పూర్వం చాలాకాలం నుంచి ఈ పాములను ఆరాధించేవారు అని మనకు ఈ విగ్రహంల ద్వారా తెలుస్తుంది.
PC: youtube
13. చెప్పుకునే విషయం
కానీ ఇక్కడ చెప్పుకునే విషయం ఏమిటంటే ఇన్ని పాములున్నా ఒక పాము కరిచిన సందర్భాలు కూడా లేవు. ఇవి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
PC: youtube
14. మిస్టరీ
ఇది కూడా ఒక మిస్టరీ అని చెప్పాలి. ఈ గ్రామంలో సాక్షాత్తూ ఆ దేవుడు పాముల రూపంలో వున్నాడు అని ఈ విషయం తెలిసినవాళ్ళు అంటుంటారు.
PC: youtube
- ఈ గుడికి వెళ్ళాలంటే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే !
- తలక్రిందులుగా పడే ఆలయ శిఖరం నీడ ఎక్కడ ఉంది ?
- వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే !