పచ్చదనంతో ఆహ్వానం పలికే భారతీయ నగరాలను చూద్దాం!
భారతదేశంలోని కొన్ని పెద్ద నగరాలు దీనిని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాలుగా అభివృద్ధి చేయబడ్డాయి.
పర్యావరణ స్పృహతో నగరవాసులకు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని పంచేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి. అత్యంత పచ్చదనం ఉన్న కొన్ని భారతీయ నగరాల జాబితాను చూద్దాం.
మైసూర్, కర్ణాటక
నిస్సందేహంగా మైసూర్ భారతదేశంలోని ప్రఖ్యాత పచ్చని నగరం. దేశంలోని అత్యుత్తమ ప్రణాళికాబద్ధమైన నగరాల్లో ఒకటైన మైసూర్ అనేక నగర ఉద్యానవనాలు, చెట్లతో నిండిన వీధులు, జలపాతాలు మరియు సరస్సులు ఉన్నాయి. అలాగే, మైసూర్ నగరం సమర్థవంతమైన డ్రైనేజీ మరియు మురుగునీటి వ్యవస్థలకు ప్రసిద్ధి చెందింది. ఈ నగరం 'గ్రీన్ సిటీ' అనే మారుపేరుతో మాత్రమే కాకుండా, దీనిని గ్రీన్ అండ్ క్లీన్ అని పిలుస్తారు. తద్వారా ఇది భారతదేశంలోని అత్యంత నివసించదగిన నగరాలలో ఒకటిగా కూడా మారింది. ఈ ఆకుపచ్చ నగరం ప్రశాంతతతోపాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుందనడంలో సందేహమే లేదు.
బెంగళూరు, కర్ణాటక
నిజమే, బెంగళూరులో ఎక్కడ చూసినా చెట్లు కనిపిస్తున్నాయి. ప్రకాశవంతమైన భవిష్యత్తు వైపు చూస్తే, చెట్లతో కప్పబడిన మార్గాలు మీకు ఆహ్లాదాన్ని అందించడానికి పలకరిస్తాయి. బెంగళూరులోని కబ్బన్ పార్క్ భారతదేశంలోనే మీరు చూసే అందమైన పట్టణ ఉద్యానవనాలలో ఒకటిగా గుర్తింపు పొందుతుంది. ఈ పార్క్లో గుబురుగా పెరిగిన పెద్దసంఖ్యలోని చెట్లు సందర్శకులను సైతం ఆకట్టుకుంటాయి.
ముంబై, మహారాష్ట్ర
ముంబై.. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన నగరాలలో ఒకటిగా ఉన్నప్పటికీ, ఈ సంవత్సరం ప్రారంభంలో యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) మరియు అర్బర్ డే ఫౌండేషన్ 2021 ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్గా గుర్తించింది. ఈ గుర్తింపును ముంబై, హైదరాబాద్తో పంచుకుంది. ముంబైలో 200కి పైగా సిటీ గార్డెన్లు ఉన్నాయి. అంతేకాదు, ఇక్కడి చాలా బంజరు భూములను నగర తోటలుగా మార్చారు. ముఖ్యంగా ముంబైలో అటవీ విస్తీర్ణంలో పెద్ద పెరుగుదల నమోదైంది. నగర అడవులను రక్షించే ప్రయత్నాలు ముంబైని అద్భుతమైన ఆరోగ్య నగరంగా తయారు చేసేందుకు సహకరిస్తాయి.
జంషెడ్పూర్, జార్ఖండ్
జంషెడ్పూర్, భారతదేశంలోని అత్యంత పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటి. స్టీల్ సిటీ అనే మారుపేరుతో ఉన్నప్పటికీ, ఆశ్చర్యకరంగా చాలా పచ్చగా దర్శనమిస్తుంది. ఇది హరిత నగరంగా ఉండాలని భావించిన దీని వ్యవస్థాపకుడు జమ్సెట్జీ టాటా దూర దృష్టికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. భారతదేశంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఇది కూడా ఒకటి. అధ్యయనాల ప్రకారం, నగరం యొక్క మొత్తం భూభాగంలో 33% పచ్చదనం కలిగి ఉంది.
హైదరాబాద్, తెలంగాణ
2021లో, ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) మరియు అర్బర్ డే ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ను '2020 ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్'గా ప్రకటించారు. మళ్లీ ఈ ఏడాది హైదరాబాద్ మరియు ముంబై '2021 ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్' టైటిల్ను పంచుకున్నాయి. హైదరాబాద్కు ఈ ప్రతిష్టాత్మక బిరుదు లభించిందంటే ప్రధాన కారణం నగర అడవులను సంరక్షించడంలో అక్కడివారు చేసిన కృషే కారణంగా చెప్పొచ్చు.
చండీగఢ్
భారతదేశంలోని అత్యంత ప్రణాళికాబద్ధమైన నగరాలలో ఒకటి చండీగఢ్. ఈ ప్రాంతం నిత్యం స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటుంది. పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల రాజధాని నగరం చండీగఢ్ కూడా కేంద్ర పాలిత ప్రాంతం. చండీగఢ్ నగరంలో ఎక్కడికి వెళ్లినా పచ్చదనం దొరుకుతుంది. అది తోటల రూపంలోనే కాకుండా, పెద్ద పెద్ద చెట్లు రూపంలోనూ పచ్చదనం పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి చండీగఢ్ పర్యావరణ స్పృహతో కూడుకున్న నగరం అని చెప్పవచ్చు.
గౌహతి, అస్సాం
విమానాశ్రయం నుండి నగరానికి సుదీర్ఘ ప్రయాణంలో గౌహతి ఈ జాబితాలో ఎందుకు వచ్చిందో మీకు తెలియజేస్తుంది. ఈ ప్రాంతం తన సహజ అడవులను నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకూ విస్తరించింది. ఇది కేవలం కొత్త చెట్లను నాటడం వల్ల మాత్రమే కాదు, దాని అసలు అటవీ విస్తీర్ణం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. సిటీ ఫారెస్ట్తో పాటు, గౌహతిలో సిటీ రోడ్ల పొడవునా పొదలు, చెట్లుతో స్వాగతం పలుకుతాయి.