Search
  • Follow NativePlanet
Share
» »సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాలు.. పిచ్చవరంలోని మడ అడవులు

సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాలు.. పిచ్చవరంలోని మడ అడవులు

సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాలు.. పిచ్చవరంలోని మడ అడవులు

సుమారు 1,100 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న పిచ్చవరంలోని మడ అడవులు సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశంగా పేరుగాంచింది. ఈ అడవిలో దాదాపు 40 ద్వీపాలు ఉన్నాయి. చుట్టూ పచ్చటి చెట్లతో ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మడ అడవులుగా గుర్తింపు పొందాయి. తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఉన్న ఈ అడవి వివిధ రకాల వృక్షజాలం మరియు జంతుజాలానికి నిలయంగా ఉంది. బంగాళాఖాతం నుండి ఇసుక మేట‌ల‌ ద్వారా వేరు చేయబడింది.

చెన్నై నుండి కారులో వెళితే దాదాపు ఐదున్న‌ర‌ గంటల ప్ర‌యాణంతో అక్కడికి చేరుకోవచ్చు. స్నిప్‌లు, ఎగ్రెట్స్, కొంగలు అనేక వంటి వలస పక్షులకు ఈ ప్రాంతం స్వర్గధామం. అక్కడికి చేరుకున్న తర్వాత, స్పీడ్ బోట్‌లు మరియు బోట్ క్రూయిజ్‌ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. తమిళనాడు రాష్ట్ర‌ టూరిజం శాఖ ద్వారా నిర్వహించబడుతోంది. దాదాపు 200 రూపాయలతో కూడా బోటింగ్‌ని ఎంచుకోవచ్చు.

pichavaram

కొంచెం అదనంగా చెల్లిస్తే బోట్ హ్యాండ్లర్ సంద‌ర్శ‌కుల‌ను అడవి లోపలి భాగానికి కూడా తీసుకెళతాడు. అక్కడ నీటి మ‌ధ్య‌లో చెట్లు మీ పడవలకు దారి ఇస్తూ స్వాగతం ప‌లికిన‌ట్లు క‌నిపిస్తాయి. మధ్యాహ్నం వేళల్లో చాలా వేడిగా ఉంటుంది. అంతేకాదు, ఇక్కడ సూర్యాస్తమయం చూసేందుకు ఎంతో ఆహ్లాద‌క‌రంగా క‌నిపిస్తుంది. కాబట్టి సాయంత్రం పూట పిచ్చవరం మడ అడవులకు వెళ్లాలని అక్క‌డి వారు సూచిస్తారు!

మ‌న‌సారా బోటులో..

అయితే, వేడిని అధిగమించడానికి, ఉష్ణోగ్రతను ఆహ్లాదకరంగా మార్చుకునేందుకు ఒక అవ‌కాశం ఉంది. అందుకోసం మొదటి రైడ్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. వారంలోని అన్ని రోజులలో ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇవి తెరిచి ఉంటాయి. స్థానిక బోట్‌మెన్‌తో మంచి బేరం చేయడం మర్చిపోవద్దు! వారికి ఇక్క‌డి ఆహ్లాద‌క‌ర‌మైన స్పాట్‌లపై పూర్తి అవ‌గాహ‌న ఉంటుంది. వారు స‌హ‌క‌రిస్తే.. మనోహరమైన అన్వేషించదగ్గ సుంద‌ర వ్యూపాయింట్‌ల‌ను మ‌న‌సారా బోటులో ఆస్వాదించ‌వ‌చ్చు. ఇక్క‌డి మ‌డ అడ‌వులలో బోటు ప్ర‌యాణం ద్వారా స్నిప్‌లు, కార్మోరెంట్‌లు, ఎగ్రెట్స్, కొంగలు, స్పూన్‌బిల్స్ మరియు పెలికాన్‌లతో సహా వలస, స్థానిక పక్షులను కూడా ఆకర్షిస్తాయి.

cuddalore

ఇక్క‌డ అధికారికంగా 41 కుటుంబాలకు చెందిన 177 జాతుల పక్షులు నమోదు చేయబడ్డాయి. ఆహార లభ్యత ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల విదేశీ వ‌ల‌స‌ప‌క్షుల‌ తాకిడి ఇక్క‌డ ఎక్కువ‌గా ఉంటుంది. ఏటా ఈ ప‌క్షులు వాటి సంతానోత్పత్తి కోసం ఇలాంటి ప్ర‌దేశాల‌కు చేరుకుంటాయి. నవంబర్ నుండి జనవరి వరకు ఇక్క‌డ‌ అధిక సంఖ్యలో పక్షులను చూడవచ్చు. చానెల్స్, క్రీక్స్, గల్లీలు, బురద ఫ్లాట్లు, ఇసుక ఫ్లాట్‌లతోపాటు ప్రక్కనే ఉన్న సముద్ర తీరం కార‌ణంగా మ‌రిన్ని జాతుల పక్షులు మరియు జంతువులకు ఈ అడ‌వులు అనువైన ఆవాసంగా నిలిచింది.

అందుకే, పాండిచ్చేరి పర్యటనలో పిచ్చవరం మడ అడవుల సందర్శనను కూడా జోడించవచ్చు. లేదా మీరు చిదంబరంలోని నటరాజ ఆలయం వంటి దేవాలయాలు మరియు చారిత్రక ప్రదేశాలను సందర్శించిన తర్వాత రాత్రికి చిదంబరంలో బస చేయవచ్చు. త‌ర్వాత‌ చేయాల్సిందల్లా పట్టణం నుండి పిచ్చవరం గ్రామానికి స్థానిక బస్సును పట్టుకోవడం లేదా సొంత వాహ‌నంలో బ‌య‌లుదేరడం. పిచ్చవరం మడ అడవులను సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్య ఉంటుంది.

More News

Read more about: pichavaram cuddalore tamil nadu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+