సమయపురం మరియమ్మ ఎటువంటి వ్యాధులనైనా తగ్గిస్తుందని భక్తులు నమ్ముతారు. అందువల్లే మనలో ఏ శరీర భాగానికి వ్యాధి సోకి ఉంటుందో ఆ శరీర భాగంను పోలిన వెండి లేదా స్టీల్తో తయారు చేసిన శరీరభాగాలను అమ్మవారికి ముడుపుగా చెల్లిస్తారు. దీంతో ఎటువంటి వ్యాదైనా ఇట్టే నయమవుతుందని భక్తులు నమ్ముతున్నారు. ఈ ఆచారం తరతరాలుగా అనవాయితీగా వస్తోంది. ఈమెను మహాకాళి లేదా దుర్గాదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. ఈ విగ్రహాన్ని ఇసుక, బంకమట్టిని వినియోగించి రూపొందించారు. అందువల్లే ఇక్కడి ప్రధాన దేవతకు అభిషేకం ఉండదు. ఇంకా ఈ దేవతకు సంబంధించిన మరిన్ని వివరాలు మీ కోసం...
సమయపురం మరియమ్మ, తమిళనాడు
P.C: You Tube
తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉన్న సమయపురంలో సమయపురం మరియమ్మ దేవాలయం ఉంది. ఈమెను మహాకాళి లేదా దుర్గాదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. ఈ విగ్రహాన్ని ఇసుక, బంకమట్టిని వినియోగించి రూపొందించారు.
సమయపురం మరియమ్మ, తమిళనాడు
P.C: You Tube
అందువల్లే ఇక్కడి ప్రధాన దేవతకు అభిషేకం ఉండదు. అయితే ఆదేవతను పోలిన చిన్న రాతి విగ్రహం ప్రధాన దేవత ముందు ఉంటుంది. ఈ విగ్రహానికి అభిషేకం చేస్తారు. ఈ సమయపురం మరియమ్మ ఎటువంటి వ్యాధులనైనా తగ్గిస్తుందని భక్తులు నమ్ముతారు.
సమయపురం మరియమ్మ, తమిళనాడు
P.C: You Tube
అందువల్లే మనలో ఏ శరీర భాగానికి వ్యాధి సోకి ఉంటుందో ఆ శరీర భాగంను పోలిన వెండి లేదా స్టీల్తో తయారు చేసిన శరీరభాగాలను అమ్మవారికి ముడుపుగా చెల్లిస్తారు. దీంతో ఎటువంటి వ్యాధైనా ఇట్టే నయమవుతుందని భక్తులు నమ్ముతున్నారు.
సమయపురం మరియమ్మ, తమిళనాడు
P.C: You Tube
ఈ ఆచారం తరతరాలుగా అనవాయితీగా వస్తోంది. అదేవిధంగా భక్తులు మావిలక్కు అనే తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెడుతారు. ఇది బెల్లం, బియ్యం పిండి, నెయ్యి తయారుచేసిన తీపి వంటకం అందిస్తారు.
సమయపురం మరియమ్మ, తమిళనాడు
P.C: You Tube
మరికొంతమంది భక్తులు దేవతకు ఉప్పును కూడా ముడుపుగా అందిస్తారు. ఈ ఆలయం ప్రతి ఆది, మంగళ, శుక్రవారాల్లో లక్షల మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. తమిళనాడులో పళని తర్వాత అత్యంత సంపన్న ఆలయం సమయపురంలోని మరియమ్మ ఆలయమేనని చెబుతారు.
సమయపురం మరియమ్మ, తమిళనాడు
P.C: You Tube
దీన్ని బట్టి ప్రతి రోజూ ఎంతమంది ఈ ఆలయానికి వస్తుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర అస్పష్టంగా ఉంది. అయితే ప్రస్తుతం లభిస్తున్న ఆధారాలను అనుసరించి ప్రస్తుత సమయపురం మరియమ్మ ఆలయాన్ని విజయరాయ చక్రవర్తి క్రీస్తుశకం 18వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు.
సమయపురం మరియమ్మ, తమిళనాడు
P.C: You Tube
అయితే అంతకు కొన్ని శతాబ్దాల ముందే అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉందని స్థానికులు దానిని పూజించేవారని తెలుస్తోంది. అదేవిధంగా అమ్మవారి విగ్రహం ఇక్కడికి రావడం వెనుక ఒక కథను కూడా వారు వినిపిస్తారు.
సమయపురం మరియమ్మ, తమిళనాడు
P.C: You Tube
వాస్తవంగా ఈ విగ్రహం శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉండేదని కథనం. అయితే ఆ ఆలయ పూజారికి తరుచుగా ఏదో ఒక వ్యాధి వచ్చేది. ఇందుకు ఈ విగ్రహమే ప్రధాన కారణమని భావించి ఆ దేవాలయం నుంచి తొలగించాల్సిందిగా సూచించారు.
సమయపురం మరియమ్మ, తమిళనాడు
P.C: You Tube
అలా తొలిగించిన విగ్రహం ప్రస్తుతం సమయపురంలో ఉంది. కాగా, అప్పట్లో ఆ పూజారి ఈ విగ్రహానికి సరిగా పూజలు చేసేవాడు కాదని అందువల్లే అతను తరుచూ అనారోగ్యానికి గురయ్యేవాడని చెబుతారు.
సమయపురం మరియమ్మ, తమిళనాడు
P.C: You Tube
అయితే ప్రస్తుతం అదే దేవత ఏ వ్యాధినైనా తగ్గించే శక్తిగల దేవతగా పూజలు అందుకొంటూ ఉండటం గమనార్హం. కాగా, విజయనగర రాజుల కాలంలో ఓ యుద్ధంలో గెలిచినందుకు విజయరాయ ఈ దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు.
సమయపురం మరియమ్మ, తమిళనాడు
ఈ సమయపురం మరియమ్మ దేవాలయంతో పాటు ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు తమిళనాడు సంస్క`తి, సంప్రదాయాలకు చిహ్నాలని చరిత్రకారులు చెబుతారు. విదేశాల్లో కూడా ఈ దేవాలయానికి భక్తులు ఉన్నారు. కాగా, శ్రీలంక, ఫిజి వంటి దేశాల్లో సమయపురం మరియమ్మ పేరుతో దేవాలయాలు కూడా నిర్మిస్తున్నారు.