Search
  • Follow NativePlanet
Share
» »ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

ఎవరైనా దేవాలయాలను ఎందుకు దర్శిస్తారు చెప్పండి మంచి ఆరోగ్య జీవితం గడపాలని ఇంకా ఇలా ఎన్నో కోరికలతో భక్తితో గుళ్ళకు వెళ్తారు.అయితే మీరు ఈ దేవాలయం గురించి విన్నారా?

By Venkatakarunasri

ఎవరైనా దేవాలయాలను ఎందుకు దర్శిస్తారు చెప్పండి మంచి ఆరోగ్య జీవితం గడపాలని ఇంకా ఇలా ఎన్నో కోరికలతో భక్తితో గుళ్ళకు వెళ్తారు.అయితే మీరు ఈ దేవాలయం గురించి విన్నారా?ఇక్కడ గడిపితే చనిపోయే అవకాశాలు కూడా వున్నాయి అంటారు. చాలా విచిత్రంగా వుంది కదూ.ఇప్పుడు చెప్పబోయే కథ మైహార దేవి ఆలయం గురించి.ఇక్కడ రాత్రిపూట గడిపితే ప్రాణాలు వదిలేసుకోవడమే అని నమ్ముతారు. మరి సాహసాలు చేసేవారు ఇలాంటి వారి గురించే ఆసక్తిగా వుందా?అయితే పదండి.ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. అసలు అక్కడ దెయ్యాలు ఏవైనా వున్నాయా?ఉత్తి అపోహేనా?దీని వెనక కధేంటి తెలుసుకుందాం.

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

మధ్య ప్రదేశ్ పర్యాటకం - ఒక మనోహరమైన కలలరాజ్యం !! ‘భారత దేశం హృదయం' గా పిలువబడే మధ్య ప్రదేశ్ దేశంలోని రెండో అతి పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్ర చరిత్ర, దాని భౌగోళిక స్థానం, ప్రాకృతిక అందం, సాంస్కృతిక వారసత్వ౦, ప్రజలు ఈ రాష్ట్రాన్ని దేశంలోని అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాయి. రాజధాని భోపాల్ ‘సరస్సుల నగరం'గా ప్రసిద్ది పొందింది.

PC:youtube

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

పర్యాటకులు ఆస్వాదించేలా అన్ని రకాల పర్యాటక అవకాశాలను మధ్య ప్రదేశ్ పర్యాటకం అందిస్తోంది. బాంధవ్ ఘర్ జాతీయ పార్కులో పులులను చూడడం దగ్గర నుంచి ఖజురహో లాంటి దేవాలయాల్లో నిర్మాణాల వరకు నిజమైన భారత దేశాన్ని పర్యాటకులు కనుగొంటారు.మధ్య ప్రదేశ్ భౌగోళిక స్వరూపం దేశం మధ్యలో వున్న ఈ రాష్ట్రంలోని ప్రకృతి వైవిధ్యం దీన్ని ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా నిలబెడుతుంది.

PC:youtube

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

ఎత్తైన పర్వత శ్రేణులు, దట్టమైన పచ్చటి అరణ్యాలు, నదులు సరస్సుల తో ప్రకృతి లోని వివిధ అంశాల మధ్య సమన్వయము కనపడుతుంది. వింధ్యా, సాత్పురా పర్వత శ్రేణుల మధ్య నర్మదా, తపతి నదులు సమాంతరంగా ప్రవహిస్తూ వుంటాయి. ఇక్కడి వైవిధ్య భరితమైన వృక్ష, జంతు జాతులు, ప్రాకృతిక అందం మధ్య ప్రదేశ్ పర్యాటకానికి తలమానికంగా నిలుస్తాయి.

PC:youtube

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

మధ్య ప్రదేశ్ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం వివిధ వంశాలకు చెందినా ఎంతో మంది రాజుల పాలన చూసింది మధ్య ప్రదేశ్. ప్రాచీన కాలం లో మౌర్యులు, రాష్ట్రకూటులు, గుప్తుల నుంచి ఇటీవలి బుందేలా, హోల్కర్, ముఘలాయి, సింధియాల పాలన వరకు దాదాపు పద్నాలుగు రాజవంశాల ఉత్థాన పటణాలకు ఇది సాక్షి.

PC:youtube

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

వివిధ రాజుల పాలన వల్ల రకరకాల కళా, నిర్మాణ శైలులు కూడా వచ్చాయి.ఖజురహో లోని శృంగార శిల్పాలు, రాజసం వుట్టి పడే గ్వాలియర్ కోట, ఉజ్జయిని లోని దేవాలయాలు, ఒర్చ్చా లోని చిత్రకూట్ లేదా చట్ట్రిస్ - అన్నీ అద్భుత నిర్మాణాలకు ప్రతీకలే. ఖజురహో, సంచి, భీమ్ బెట్కా లను యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రాలుగా ప్రకటించింది.

PC:youtube

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

మధ్య ప్రదేశ్ లోని గిరిజన సంస్కృతి ఇక్కడి పర్యాటకంలో ప్రధాన భాగం. గోండ్ లు, భిల్లులు, ఇక్కడ నివసించే ప్రధాన జాతులు. గిరిజన హస్త కళాకృతులు ఇక్కడి పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఇక్కడి జానపద సంగీతం, నృత్యం దేశ కళా వారసత్వానికి పట్టుగొమ్మలు. వన్య ప్రాణులు - మధ్య ప్రదేశ్ లో ప్రేరణ కలిగించే అంశం.

PC:youtube

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

వింధ్య, సాత్పురా పర్వతాలు, పచ్చటి అడవులు చాలా జీవజాతులకు ఆలవాలం. వన్య ప్రాణి అభయారణ్యాలు, వన్యప్రాణి జాతీయ పార్కులు కూడా మధ్య ప్రదేశ్ పర్యాటకం లోని ప్రధాన ఆకర్షణలు. బాంధవ్ ఘర్ జాతీయ పార్కు, పెంచ్ జాతీయ పార్కు, వన్ విహార్ జాతీయ పార్కు, కాన్హా జాతీయ పార్కు, సాత్పురా జాతీయ పార్కు, మాధవ్ జాతీయ పార్కు, పన్నా జాతీయ పార్కు మధ్య ప్రదేశ్ లోని కొన్ని సుప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు. ఈ కేంద్రాల్లో చాలా జాతులకు చెందిన పక్షులు, జంతువులూ, మొక్కలూ చూడవచ్చు. నీముచ్ లోని గాంధీ సాగర్ అభయారణ్యం కూడా వన్యప్రాణి నిలయమే.

PC:youtube

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

ఇలాంటి కధనానికి ప్రఖ్యాతిగాంచిన ఈ దేవాలయం మధ్యప్రదేశ్ రాష్టంలోని భోపాల్ సమీపంలో సాత్నాజిల్లాలో మైహార్ వుంది.ఈ దేవాలయంలో శారదా అమ్మవారు కొలువై వున్నారు.మైహార్ అంటే 'మా కా హర్' అని అర్థం.

PC:youtube

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

అంటే దేవత యొక్క హారం అని తెలుగులో అర్ధం.ఈ గుడి త్రికూట్ అనే కొండలమధ్య వుంది.ప్రతీ సంవత్సరం ఇక్కడి శారదాదేవిని దర్శించుకొనేందుకు వేలాదిమంది భక్తులు తండోపతండాలుగా వస్తూ వుంటారని చెబుతారు.అక్కడ అంత భయంకరమైన చలితో వున్నాసరే లెక్కచేయకుండా వీరు అక్కడికి వస్తారు.దేవాలయం గురించి కధలుకధలుగా చెబుతారు.

PC:youtube

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

ఈ నమ్మకాలన్నీ నిజమని నమ్మి చాలా మంది నమ్ముతారుకూడా.ఇక రాత్రిపూట అక్కడ వుండలేమని కూడా అంటారు.అలా వున్న వారు ఎవరూ ప్రాణాలతో బ్రతికిబట్టకట్టలేరని కూడా చెబుతారు.ఈ నమ్మకం వెనుక ఓ కధ వుంది.

PC:youtube

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

ఇప్పటికీ శారదామాతకు అతిపెద్ద భక్తులైనా అలహా, ఉదం అనే ఇద్దరుసోదరులు ఆత్మలు అక్కడ తిరుగుతాయట.ఈ రెండు ఆత్మలు అప్పట్లో పృథ్వీరాజ్ చౌహాన్ తో వీరోచితంగా పోరాడాయని చెబుతారు. అదీకాకుండా వీళ్ళిద్దరూ మొదటి సారి మైహార్దేవి ఆలయాన్ని గుట్టలో కనుగొన్నారని చెబుతారు.

PC:youtube

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

ప్రాణాలు తీసే గుడి ఇది! అక్కడ రాత్రయితే చాలు...

రాత్రి పూట దేవాలయాన్ని మూసివేస్తారు.అక్కడివారు నమ్మేదాని ప్రకారం. ఈ ఇద్దరు సోదరులు అమ్మవారిని పూజిస్తారట. అదే కారణంగా చెప్పి గుడిలోపల రాత్రివేళ ఎవరినీ అనుమతించరు. ఎవరైనా సాహసం చేసి రాత్రంతా గడిపితే ఇక మరునాడు ప్రాణాలతో వుండరని అంటారు.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X