పెళ్లైన మహిళల్లో చాాలా మంది తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని దేవతలను పూజిస్తూ ఉంటారు. ఇందుకోసం సుదూర ప్రాంతాలకు సైతం వెలుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ముంబైలోని ఓ ప్రాచీన దేవాలయం మహిళా భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా కార్తీక మాసంలో చాలా మంది మహిళా భక్తులు ఈ దేవాలయానికి వెలుతూ ఉంటారు. ఈనేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించిన కథనం మీ కోసం...
జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై
P.C: You Tube
ముబైంలోని అత్యంత ప్రాచీన దేవాలయం జోగేశ్వరీ మాత దేవాలయం. ఇది ఒక గుహాలయం అంటే కొండను గుహాగా మార్చి నిర్మించిన దేవాలయం అని అర్థం.
జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై
P.C: You Tube
ఈ దేవాలయం వల్లే ఆ ప్రాంతానికి జోగేశ్వరీ అని పేరువచ్చింది. ఈ దేవాలయంలోని అమ్మవారైన జోగేశ్వరీ అత్యంత మహిమలు కలిగిన వారని మహిళలు నమ్ముతారు.
జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై
P.C: You Tube
ముఖ్యంగా తమ పసుపు కుంకుమలను చల్లగా చూస్తుందనేది వారి నమ్మకం. అందువల్లే ఒక్క ముంబై నుంచే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు మహిళలు వచ్చి పూజలు చేస్తుంటారు.
జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై
P.C: You Tube
ఈ జోగేశ్వరీ మాత ముంబైతో పాటు మహారాష్ట్రలోని చాలా కుటుంబాలకు కులదైవంగా ఉంది. ఈ దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారన్నదానికి సరైన ఆధారాలు ఏవీలేవు.
జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై
P.C: You Tube
అయితే ఇక్కడ దొరికిన కొన్ని ఆధారులను అనుసరించి ఈ దేవాలయాన్ని ఐదో దశాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. ఆ సమయంలో స్థానిక రాజులు వారిని ఆదరించినట్లు పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు.
జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై
P.C: You Tube
మరికొంతమంది మాత్రం అజంతా, ఎల్లోరా గుహలను నిర్మించిన సమయంలో, ఆ గుహాలయాలను నిర్మించినవారే ఇక్కడ కూడా ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు.
జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై
P.C: You Tube
ముంబైలోని జోగేశ్వరీ అనే ప్రాంతంలో ఉన్న ఈ గుహాలయాన్ని అజంతా, ఎల్లోరా గుహలను నిర్మించిన కార్మికులే నిర్మించినట్లు భావిస్తున్నారు.
జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై
P.C: You Tube
అక్కడి గుహాలయాలకు, ఈ గుహాలయానికి ఉన్న పోలికలే ఇందుకు కారణం. అజంతా ఎల్లోరా గుహల్లో ఉన్నటువంటి శిల్పాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఆ శిల్పాలను చెక్కిన తీరు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై
P.C: You Tube
ఇక్కడికి చేరుకోవడానికి ముంబై నగరంలో చాలా ప్రాంతాల నుంచి బస్సులు, లోకల్ ట్రైన్లు ఉన్నాయి. ఈ గుహాలయంలో జోగేశ్వరీతో పాటు పరమేశ్వరుడు, గణపతి తదితర దేవుళ్ల విగ్రహాలను కూడా మనం చూడవచ్చు.
జోగేశ్వరీ మాత దేవాలయం, ముంబై
P.C: You Tube
అంబోలి గుహాలయంగా కూడా దీనికి పేరు. ప్రతి శివరాత్రి, కార్తిక సోమవారాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. అందువల్లే ఆ సమయంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు ఉంటారు.