రాయల్ జర్నీ కోసం డెక్కన్ ఒడిస్సీ రైలులో ప్రయాణించండి
పట్టాలపై పరుగులు పెడుతూ పర్యాటక ఆనందాన్ని చేరువచేస్తోన్న దక్కన్ ఒడిస్సీ రైలు గురించి మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. ఈ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు అనేక రకాల సౌకర్యాలు మీకు అందించబడతాయి. భారతదేశంలో ఇలాంటి పలు రకాల రైళ్లు ఉన్నాయి. వీటిలో ప్రయాణీకులు రాచరికపు ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఈ రైళ్లలో వివిధ సౌకర్యాలు కల్పిస్తారు. దక్కన్ ఒడిస్సీ రైలుకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

దక్కన్ ఒడిస్సీ రైలు ఎప్పుడు ప్రారంభించారు?
దక్కన్ ఒడిస్సీ రైలును ప్రారంభించడానికి మొదటి ప్రతిపాదన 2001 సంవత్సరంలోనే జరిగింది. MTDC మరియు భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ఈ రైలు గురించి చర్చించాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఇది 2004 సంవత్సరంలో పట్టాలపైకి వచ్చింది. నిజానికి, ఇలాంటి రాయల్ రైలు టిక్కెట్లు ఖరీదైనవిగానే ఉంటాయి. అదే విధంగా ఈ దక్కన్ ఒడిస్సీ రైలు టిక్కెట్ ధర ఐదు లక్షల 46 వేల రూపాయల నుండి మొదలవుతుందంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈ రైలులోని అన్ని కోచ్లకు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల పేర్లను పెట్టారు. ప్యాలెస్ ఆన్ వీల్స్ పథకం కింద ఈ రైలు ప్రారంభించబడింది.

సౌకర్యాలు ఏంటో తెలుసా?
డెక్కన్ ఒడిస్సీ రైలులో మొత్తం 21 కోచ్లు ఉంటాయి. ఈ రైలు రాచరిక ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే రాజభవనాలలో ఆతిథ్యం ఎలా ఉంటుందో, అదే విధంగా ప్రయాణికులకు ఈ రైలులో సౌకర్యాలు లభిస్తాయి. రైలులోని 21 కోచ్లలో 11 కోచ్లు ప్రయాణీకుల వసతికి అనుగుణంగా రూపొందించబడ్డాయి. మిగిలిన కోచ్లలో డైనింగ్, లాంజ్, కాన్ఫరెన్స్ మరియు స్పా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ రైలులో వివిధ రకాల సంస్కృతికి అద్దం పట్టేలా అద్భుతమైన కళాఖండాలను పొందుపరచారు. ఆ చిత్రాలను చూసినవారికి ఎవ్వరైనా చారిత్రక నేపథ్యాన్ని ఫీల్ అవ్వకుండా ఉండలేరు. ఈ రైలులో కోచ్లోనే వ్యక్తిగత సేఫ్ లాకర్, టెలిఫోన్ మరియు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నాయి. ఈ రైలు కూడా పూర్తిగా ఎయిర్ కండీషనర్తో అనుసంధానించబడి ఉంటుంది. దీంతో పాటు ఈ రైలులో ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పించారు.

ప్రత్యేక ప్రయాణ ప్రణాళికలు..
ఈ రైలు ఎన్నో ప్రత్యేక ప్రాంతాలకు వెళుతుంది. అలాగే, ముంబై, గోవా, సింధుదుర్గ్, దౌల్తాబాద్, చంద్రపూర్, అజంతా గుహలు, కొల్హాపూర్ మరియు నాసిక్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను చుట్టేసే అవకాశం కల్పిస్తుంది. రైలు నిలిచే ప్రతి స్టేషన్ ఒక ప్రత్యేకమైన పర్యాటక కేంద్రమనే చెప్పాలి. ఈ రైలులో అనేక సౌకర్యాలతో పాటు, ప్రత్యేక ప్రయాణ ప్రణాళికలు కూడా ఉన్నాయి. మొత్తం ఈ టూర్లో ఎనిమిది రోజుల పర్యటన ఉంటుంది. అలాగే, ఈ రైలులో డీలక్స్ క్యాబిన్ క్వీన్ మరియు ప్రెసిడెన్షియల్ సూట్ కూడా ఉన్నాయి. ఇందులో గడిపే ప్రతి క్షణం ఓ రాచరకపు అనుభూతిని పొందొచ్చు. ఇక్కడ సర్వ్ చేసేవారు సైతం అలనాటి రాజకుటింబీకుల దగ్గర ఉన్న వారి మాదిరిగానే గంభీరమైన వస్త్రాదరణతో కనిపిస్తారు. వీరు అందించే ఆహారం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. దేశంలోని వివిధ వంటకాలతోపాటు విభిన్న రుచులను ఎప్పటికప్పుడు అందిస్తారు.



Click it and Unblock the Notifications













