తుల్జాభవానీ దేవాలయం భారత దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి. ఇది శక్తిపీఠం కూడా. ముఖ్యంగా మహారాష్ట్రలోని అనేక కుటుంబాలకు ఆరాధ్య దైవం. 51 శక్తిపీఠాల్లో ఒకటైన ఈ దేవాలయంలోని అమ్మవారిని చూడటానికి ఒక్క మహారాష్ట్ర వాసులే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తుంటారు. ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం....
తుల్జా భవానీ
P.C: You Tube
మహారాష్ట్రలోని సోలార్ పుర నుంచి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో తుల్జాభవానీ దేవాలయం ఉంది. ఈ దేవాలయం అత్యంత ప్రచీనమైనది. ప్రస్తుతం దొరికిన కొన్ని ఆధారాలను అనుసరించి ఈ దేవాలయాన్ని క్రీస్తుశకం 12వ శతాబ్దంలో నిర్మించారని చెబుతారు.
తుల్జా భవానీ
P.C: You Tube
ఈ తుల్జాభవానీ దేవాయం దగ్గర్లో అనేక పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ దేవాలయం ఎల్లప్పుడూ చలన స్థితిలో ఉండటం విశేషం. మహారాష్ట్రలోని ఉస్మానాభాద్ నగరానికి కూడా దేవాలయం అత్యంత సమీపంలో ఉంటుంది.
తుల్జా భవానీ
P.C: You Tube
సముద్ర మట్టం నుంచి 650 మీటర్ల ఎత్తులో ఈ దేవాయం ఉంటుంది. సహ్యాద్రి పర్వత పంక్తుల మధ్య ఉన్న తుల్జాపూర్ అనే చోట ఈ దేవాలయం ఉంది. ఈ తుల్జాపూర్ నగరంలోనే తుల్జా భవనానీ కొలువై ఉన్నారు.
తుల్జా భవానీ
P.C: You Tube
ఈ దేవాలయం లోనికి ప్రవేశించిన వెంటనే ఒక విధమైన భక్తిభావం కలుగుతుంది. ఇక్కడ ఒక సరస్సు ఉంది. ఈ సరస్సులోని నీటిని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఇక్కడి విగ్రహం స్వయంభువుగా చెబుతారు. భవానీ మాతకు 8 చేతులు ఉంటాయి.
తుల్జా భవానీ
P.C: You Tube
ఇక్కడ విగ్రహం ఎల్లప్పుడూ చలన స్థితిలో ఉంటుంది. అంటే కదులుతూనే ఉంటుందని అర్థం. ఇలా విగ్రహం ఎప్పుడూ చలన స్థితిలో ఉండే దేవాలయం భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఎక్కడా మనకు కనిపించదు.
తుల్జా భవానీ
P.C: You Tube
నవరాత్రి సమయంలో ఈ దేవాలయానికి ఎక్కువ మంది భక్తులు వస్తారు. గుడిపడ్వా, రథసప్తమి తదితర రోజుల్లో కూడా ఎక్కువ మంది ఈ దేవాలయానికి వస్తారు. ఆ సమయంలో ఇక్కడ జరిగే జానపద న`త్యాలు, పాటలు ఆకట్టుకొంటాయి. ఈ దేవాలయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ భక్తుల కోసం తెరిచి ఉంచుతారు.
తుల్జా భవానీ
P.C: You Tube
ఈ దేవాలయానికి సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో అత్యంత ప్రాచూర్యం పొందినది దుర్గామాత మహిషాసురుడిని చంపిన తర్వాత ఇక్కడే నివశించాలని నిర్ణయించిందంట. దీనిని దేవతలందరూ స్వాగతించారు. దీంతో ఇక్కడ స్వయంభువుగా అమ్మవారు వెలిశారని చెబుతారు.