ఢిల్లీలోని టాయిలెట్ మ్యూజియం ప్రత్యేకతలేంటో మీకు తెలుసా?!
నవంబర్ 19 వరల్డ్ టాయిలెట్ డే 2022 పురష్కరించుకుని ఢిల్లీలో టాయిలెట్ మ్యూజియంకు సందర్శకులు పోటెత్తారు. ఇది చాలా ప్రత్యేకమైన మ్యూజియం. అందుకే ఢిల్లీవాసులుతోపాటు పర్యాటక ఆసక్తి ఉన్నవారు వారాంతాన్ని కుటుంబసమేతంగా సరదాగా గడిపేందుకు ఈ మ్యూజియంను సందర్శిస్తూ ఉంటారు. ఈ మ్యూజియం ప్రత్యేకలు తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం నవంబర్ 19న టాయిలెట్ డేని జరుపుకోవడం వెనుక గొప్ప ఉద్దేశమే ఉంది. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకుండా నిరోధించడం అలాగే, మరుగుదొడ్డి అనే మానవ హక్కును ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉంచడం ఇందులో భాగంగానే ఉంటుంది. అంతే కాకుండా పరిశుభ్రత, ఆరోగ్య భద్రతా విధానాలను పటిష్టం చేయడంతోపాటు బహిరంగ మలవిసర్జన వల్ల కలిగే అనర్థాలను ప్రపంచానికి చాటిచెప్పడం ప్రధాన ఉద్దేశంగా చెప్పబడుతోంది.
టాయిలెట్ మ్యూజియం
మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాయిలెట్ మ్యూజియం ఢిల్లీలో ఉంది. దీనిని 1992లో సామాజిక కార్యకర్త డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ స్థాపించారు. ఈ మ్యూజియంలో క్రీస్తుపూర్వం 2500 నుండి ఇప్పటి వరకు అన్ని రకాల మరుగుదొడ్ల అభివృద్ధి, వాటి పూర్తి వివరాలు పొందుపరచారు. ఈ మ్యూజియం వివిధ రకాల టాయిలెట్లకు సంబంధించిన టాయిలెట్ కస్టమ్స్, పద్ధతులు మరియు ఈవెంట్స్ గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఛాంబర్ పాట్లు, టాయిలెట్ ఫర్నిచర్, బిడ్లు మరియు వాటర్ క్లోసెట్లు వంటివి 1145 AD నుండి నేటి తరం వరకు ఉన్నాయి.
ఈ మ్యూజియం ఎందుకు ప్రత్యేకమైనది?
ఈ మ్యూజియంలో పురాటన టాయిలెట్ల యొక్క ప్రతి ముఖ్యమైన సేకరణతోపాటు చారిత్రక నేపథ్యం, వారి జీవశైలికి సంబంధించిన వాస్తవాలు మరియు చిత్రాలు ప్రదర్శనకు ఉంచుతారు. ఇది టాయిలెట్ల వినియోగంలో వచ్చిన పరిణామక్రమాన్ని తెలుసుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అంతే కాదు, ఢిల్లీలోని ఈ మ్యూజియంలో టాయిలెట్లకు సంబంధించిన అందమైన కవితల సంకలనం కూడా అందుబాటులో ఉంది. మ్యూజియంలో అడుగుపెడితే రోమన్ చక్రవర్తులు బంగారం మరియు వెండితో చేసిన టాయిలెట్లను ఎలా ఉపయోగించారో తెలుసుకోవచ్చు. క్వీన్ ఎలిజబెత్ హయాంలో సర్ జాన్ హారింగ్టన్ 1596లో తయారు చేసిన ఫ్లష్ పాట్ రికార్డు కూడా మ్యూజియంలో ఉంది. అంతేకాకుండా, ఈ మ్యూజియం 2,500 BC నాటి హరప్పా నాగరికత యొక్క మురుగునీటి శైలిని కూడా ప్రదర్శిస్తుంది.
మ్యూజియం యొక్క వివిధ భాగాలు
పురాతన, మధ్యయుగ మరియు ఆధునిక భాగాలుగా ఈ మ్యూజియం మూడు విభాగాలుగా విభజించబడింది. పురాతన కాలం విభాగంలో, మీరు 3000 BC నాటి హరప్పా నాగరికత యొక్క పారిశుధ్య వ్యవస్థ గురించి తెలుసుకుంటారు. దీనితో పాటు, ఈజిప్ట్, క్రీట్, జెరూసలేం, గ్రీస్ మరియు రోమ్లోని ఇతర పురాతన నాగరికతల యొక్క సానిటరీ వ్యవస్థను కూడా పరిశీలించే అవకాశం ఉంది. మధ్యయుగ కాలంలో రాజులు మరియు చక్రవర్తులు పెద్ద కోటలలో నివసించేవారు. కాబట్టి ఈ మ్యూజియంలో ఆంధ్రప్రదేశ్లోని గోల్కొండ కోట, జైపూర్లోని అంబర్ కోట, తమిళనాడులోని జింగీ కోట, ఆగ్రాలోని ఫతేపూర్-సిక్రీ కోటల్లోని టాయిలెట్ ఏర్పాట్ల సేకరణ కూడా ఉంది.
ఆధునిక విభాగంలో, మీరు వివిధ దేశాల నుండి ఆసక్తికరమైన కార్టూన్లు, ఛాయాచిత్రాలు, పబ్లిక్ టాయిలెట్లు మరియు టాయిలెట్లకు సంబంధించిన జోకులు తెలుసుకోవచ్చే. మరీ ముఖ్యంగా ఇలాంటి మ్యూజియంల సందర్శన ద్వారా పిల్లలకు, విద్యార్థులకు ఆహ్లాదంతోపాటు విజ్ఞానాన్ని అందించినట్లవుతుంది. వారికి ఆరోగ్య ప్రమాణాలపై పూర్తి అవగాహన వస్తుంది.