ఈ క్షేత్రాన్ని పేదల తిరుపతిగా పిలుస్తారు. ఇక్కడ సామాజికంగా వెనుకబడిన కులాలకే అగ్రస్థానం. వారే ఈ క్షేత్రంలో పూజలు, ఉత్సవాల సమయంలో ముందుండి కార్యక్రమాలను నిర్వహిస్తారు. అందువల్లే ఈ క్షేత్రంలో కులమతాలకు అతీతంగా అందరకూ కలిసి జాతర జరుపుకొంటారు. ఆ జాతర సమయంలో ఊరేగించే చెప్పులను తమ తలపై కొట్టించుకొంటారు. దీని వల్ల పాపాలు పోతాయని నమ్ముతారు. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతికి ఈ పేదల తిరుపతికి ఎన్నో పోలికలు ఉన్నాయి. ఆ పోలికలతో పాటు ఇక్కడ జరిగే విశేషాలతో కూడిన కథనం మీ కోసం...
పేదల తిరుపతి
P.C: You Tube
తిరుపతికి కురుమూర్తికి అనేక పోలికలు ఉన్నాయి. తిరుపతి క్షేత్రం మేరుపర్వత పుత్రుడైన ఆందగిరి పై శ్రీనివాసుడు వెలిశాడని పురాణాలు చెబుతాయి. కురుమూర్తి కొండలూ ఆనందగిరిలో భాగమే
పేదల తిరుపతి
P.C: You Tube
తిరుపతిలో విఘ్నేశ్వరుడి విగ్రహం లేదు. కురుమూర్తిలో కూడా ఆ వినాయకుడి విగ్రహం లేదు. వేంకటేశ్వరుడు తిరుపతిలో ఏడు కొండల కొలువై ఉన్నాడు. కురుమూర్తిలో కూడా ఏడు కొండల పైనే ఉన్నాడు.
పేదల తిరుపతి
P.C: You Tube
కురుమూర్తిలో ఉన్న ఏడు కొండలు వరుసగా శ్వేతాద్రి, ఏకాద్రి, కోటగట్టు, ఘనాద్రి, భల్లూకాద్రి, పతాగాద్రి, దైవతాద్రి. ఇందులో దైవతాద్రి పై శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు.
పేదల తిరుపతి
P.C: You Tube
కుమూర్తిలో కూడా ఏడు కొండల పైనే ఈ వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. తిరుపతిలో స్వామివారు నిలుచొన్న భంగిమలో ఉంటాడు. ఇక్కడ కూడా స్వామి వారు నిలుచొన్న భంగిమలో దర్శనమిస్తాడు.
పేదల తిరుపతి
P.C: You Tube
తిరుమలకు వెళ్లే సమయంలో శ్రీపాద చిహ్నాలు కలనిపిస్తాయి. కురుమూర్తిలో కూడా శ్రీపాద చిహ్నాలను మనం చూడవచ్చు. తిరుపతిలో స్వామివారికి అలిపిరి మండపం ఉన్నట్లుగానే ఇక్కడ ఉద్దాల మంటపం ఉంది.
పేదల తిరుపతి
P.C: You Tube
తిరుపతిలో స్వామివారి దర్శనానికి వెళ్లే సమయంలో మోకాళ్ల గుండు కనిపిస్తుంది. కురుమూర్తిలో కూడా మనం అలాంటిది చూడవచ్చు. మొత్తంగా అక్కడ ఉన్న అనేక విషయాలతో కురుమూర్తి స్వామికి పోలికలు ఉన్నాయి.
పేదల తిరుపతి
P.C: You Tube
మహబూబ్ నగర్ నుంచి కురుమూర్తి దేవాలయం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్ నగర్ నుంచి దేవరకద్ర, కౌకుంట్ల మీదుగా కురుమూర్తి చేరుకోవచ్చు. కురుమూర్తి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో రైల్వేష్టేషన్ ఉంది.
పేదల తిరుపతి
P.C: You Tube
మహబూబ్ నగర్ జిల్లా సీసీకుంట మండలం అమ్మాపూర్ లోనే ఏడు కొండల మధ్య కురుమూర్తి దేవాలయం ఉంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ఏడాది పాటు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో ఉద్దాల మహోత్సవం ప్రధానమైంది. ఉద్దాలు అంటే స్వామి వారి పాదుకలు అని అర్థం.
పేదల తిరుపతి
P.C: You Tube
కురుమూర్తి ఆలయానికి దళితులకు విడదీయరాని అనుబంధం ఉంది. వడ్డేమాన్ లోని దళితులు ఆవు చర్మంతో స్వామివారి పాదుకలను తయారు చేస్తారు. ఉద్దాల మండపంలో దళితులే అర్చకులు.
పేదల తిరుపతి
P.C: You Tube
ఉత్సవాల్లో భాగంగా ఆ పదుకలను ఊరేగిస్తారు. ఈ పాదుకలు తాకడానికి లక్షల మంది పోటీ పడుతారు. అనంతరం ఆ పాదుకలతో తల పై కొట్టించుకొంటారు. దీని వల్ల పాలపాలు పోతాయని నమ్ముతారు.
పేదల తిరుపతి
P.C: You Tube
కురుమూర్తి ఉత్సవాల్లో పుష్కరిణిలో స్నానాలు చేసి తడిదుస్తులతో కొండపైకి వెళ్లి దేవుడిని దర్శించుకొంటారు. మట్టి కుండల్లో నైవేద్యం సమర్పిస్తారు. ఉత్సవాల్లో స్థానికుల న`త్యాలు ఆకట్టుకొంటాయి.
పేదల తిరుపతి
P.C: You Tube
ఇక్కడ అమావాస్య రోజున స్వామివారిని వేల సంఖ్యలో సందర్శించుకొంటారు. వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అమావాస్య రోజున పుణ్యక్షేత్ర దర్శనం ఇక్కడ ప్రత్యేకం.
పేదల తిరుపతి
P.C: You Tube
ఇక ఈ క్షేత్రం పురాణ కథనానికి వస్తే ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహం చేసుకునేందుకు కుబేరుడితో ఆ శ్రీనివాసుడు అప్పు చేస్తాడు. అయితే ఆ అప్పు తీర్చలేక పోవడంతో మనస్తాపం చెందుతాడు.
పేదల తిరుపతి
P.C: You Tube
ఈ నేపథ్యంలో క`ష్ణానదీ తీరం వెంబడి వస్తూ కురుమూర్తి ప్రాంతానికి చేరుకొంటాడు. అక్కడ నదిలో కాళ్లు కడుక్కుంటూ ఉండగా క`ష్ణవేణమ్మ ప్రత్యక్షమమవుతుంది.
పేదల తిరుపతి
P.C: You Tube
వేంకటేశ్వరుడి కాళ్లు కందిపోకుండా పాదుకలను బహూకరించిందని చెబుతారు. క`ష్ణమ్మ చేసిన మేలుకు గుర్తుగా స్వామివారు ప్రతి ఏటా ఇక్కడ ఉద్దాలోత్సవం (పాదుకలోత్సాహం) జరిపిస్తానని మాట ఇచ్చాడు.
పేదల తిరుపతి
P.C: You Tube
అప్పటి మాటా ఇప్పటికీ ఆచారంగా కొనసాగుతూనే ఉంది. 15వ శతాబ్దంలో కురుమూర్తికి ముక్కెర వంశస్థులైన రాజా సోంభూపాల్ బంగారు ఆభరణాలను సమర్పించారు. అప్పటి నుంచి నేటి వరకూ ఉత్సవాల సందర్భంగా ఆ ఆభరణాల సమర్పణ ఆనవాయితీగా వస్తోంది.