శాస్త్ర సాంకేతికత ఎంతగా అందుబాటులోకి వచ్చినా చివరికి ఆ పరిజ్జానం పై ఆధ్యాత్మికత విజయం సాధిస్తుందని హిందూ పురాణాలతో పాటు ప్రపంచంలోని అనేక మత గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అటువంటి కోవకు చెందిన శంభల. శంభల అన్నది ఒక ఆధ్యాత్మిక నగరం. ఈ నగరం ఉనికిని గుర్తించడానికి అనేక వేల పరిశోధనలు జరుగుతున్నాయి. అసలు ఈ శంభల దేశం అంటే ఏమిటి, అక్కడకు చేరుకోవడం ఎలా తదితర వివరాలన్నీ మీ కోసం...
హిమాలయాల్లోని శంభల దేశం
P.C: You Tube
కొన్ని వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న హిమాలయాల్లో మానవుడు చేరుకోలేని ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ఆధునిక సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా అక్కడకు కాలు మోపడం సాధ్యం కావడం లేదు.
హిమాలయాల్లోని శంభల దేశం
P.C: You Tube
అంతేకాకుండా అటు వంటి ప్రాంతాలు ఎన్ని ఉన్నాయన్న విషయం కూడా తెలుసుకోలేకపోతున్నాడు. దీంతో మానవ మేధస్సుకు అందని ఎన్నో విషయాలు ఈ విశ్వంలో దాగున్నాయన్న విషయం మనకు స్పష్టమవుతుంది.
హిమాలయాల్లోని శంభల దేశం
P.C: You Tube
అటువంటి విషయాల్లో శంభల కూడా ఒకటి. హిమాలయాల్లోని ఒక రాజ్యం పేరే శంభల. హిందూ పురాణాల్లోనే కాకుండా బౌద్ధ గ్రంధాల్లో కూడా ఈ శంభల రాజ్యానికి సంబంధించి వివరంగా రాసారు.
హిమాలయాల్లోని శంభల దేశం
P.C: You Tube
దాని ప్రకారం ఇక్కడ నివసించేవారు నిత్యం సుఖ సంతోషాలతో ఉంటారు. ఆయురారోగ్యాలతో సాధారణ మానవుల కంటే ఎక్కువ ఏళ్లు బతక గలుగుతారు. వీరికి సంపద పై ఆశ ఉండదు.
హిమాలయాల్లోని శంభల దేశం
P.C: You Tube
అంటే వీరి అయ:ప్రమాణం సాధారణ ప్రజల కంటే దాదాపు రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ద`డంగా ఉండాలి.
హిమాలయాల్లోని శంభల దేశం
P.C: You Tube
ప్రతి ఒక్కరికి ఈ దేశం కనిపించదు. అతి పవిత్రమైన ఈ దేశం కేవలం ధార్మిక విలువలు ఉన్నవారికి మాత్రమే కనిపిస్తుంది. అటువంటి ధార్మిక ఆలోచనలు ఉన్నవారికి మాత్రమే ఈ పవిత్ర దేశంలోకి ప్రవేశం కూడా.
హిమాలయాల్లోని శంభల దేశం
P.C: You Tube
హిందూ, బౌద్ధ పురాణాలను అనుసరించి ఈ నగరం వయస్సు దాదాపు 60 లక్షల సంవత్సరాలు. ఇక్కడ ప్రజలు సుమారు 12 నుంచి 14 అడుగుల పొడవైన ఆజానుబాహువులు.
హిమాలయాల్లోని శంభల దేశం
P.C: You Tube
మిక్కిలి బలవంతులు, శాంతి స్వభావులు. అయితే అన్యాయం జరిగితే మాత్రం ఊరికే ఉండరు. హిమాలయాల్లో ఎక్కడ ఉందో తెలియని ఈ నగరం చేరుకోవడం చాలా ప్రయాసలతో కూడిన వ్యవహారం.
హిమాలయాల్లోని శంభల దేశం
P.C: You Tube
అంతటి చల్లని, మంచుతో కప్పబడిన హిమాలయల్లో ఈ శంభల రాజ్యానికి చేరుకోవడంలో మొదట మనకు ఎడారి ఎదురవుతుంది. ఆ ఎడారి మార్గం చాలా కఠినంతో కూడుకున్నది.
హిమాలయాల్లోని శంభల దేశం
P.C: You Tube
ఇదిలా ఉండగా ఈ నగరానికి సంబంధించి ఇతర దేశాల వారు ఎన్నో పరిశోధనలు చేశారు. అందులో ముఖ్యమైనది రష్యా దేశీయులు క్రీస్తుశకం 1920లో జరిపిన పరిశోధనలు.
హిమాలయాల్లోని శంభల దేశం
P.C: You Tube
అయితే ఈ పరిశోధనల్లో ఆ దేశానికి చెందిన కొంతమంది మిలటరీ, ఆధ్యాత్మిక వేత్తలు శంభల దేశానికి చేరుకోకపోయినా ఇందుకు సంబంధించిన స్పష్టత మాత్రం కొంతమంది యోగుల నుంచి తెలుసుకొన్నారు.
హిమాలయాల్లోని శంభల దేశం
P.C: You Tube
దీంతో తాము ఆ ప్రాంతానికి ఇప్పట్లో చేరుకోలేమని తెలుసుకొని వెనుతిరిగారు. ఇందుకు సంబంధించిన లిఖిత పూర్వతక ఆధారాలు నియంత అడాల్ఫ్ హిట్లర్ కు దొరికాయి.
హిమాలయాల్లోని శంభల దేశం
P.C: You Tube
దీంతో అతను తిరిగి క్రీస్తుశకం 1930లో ఈ శంభల దేశం ఎక్కడ ఉంది? ఎలా చేరకోవాలి.? అనే విషయాలను తెలుసుకోవాల్సిందిగా తనకు నమ్మకమైన కొంతమందిని పురమాయించాడు.
హిమాలయాల్లోని శంభల దేశం
P.C: You Tube
అయితే వారు కూడా ఎన్నోప్రయాసలకు ఓర్చుకొని ఈ శంభల దేశం దరిదాపుల్లో తపస్సులో కుర్చొన్న కొంత మంది యోగులను మాత్రం వెనుతిరిగారు. వారితో అతికష్టం పై కొద్ది సేపు సంభాషించగలిగారు.
హిమాలయాల్లోని శంభల దేశం
P.C: You Tube
అటు పై ఈ బ`ందానికి నాయకత్వం వహించిన వ్యక్తి హిట్లర్ నుకలుసుకొని అక్కడికి చేరుకోవడం అసాధ్యమని చెప్పినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే అది భూలోకం పై ఉన్న స్వర్గమని చెప్పారు.
హిమాలయాల్లోని శంభల దేశం
P.C: You Tube
ఇదిలా ఉండగా బౌద్ధ గ్రాంధాల్లోని వివరాలను అనుసరించి ప్రస్తుత భూ మండలం పై పాపం పెరిగిపోయి అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో ఈ శంభల దేశంలోని పుణ్యపురుషులు విశ్వపాలనను తమ చేతుల్లోకి తీసుకొంటారు.
హిమాలయాల్లోని శంభల దేశం
P.C: You Tube
అప్పటి నుంచి భారత దేశంలో కొత్త శకం ప్రారంభమవుతుంది. ఆ శకం ప్రస్తుత కాలమాన ప్రకారం క్రీస్తు శకం 2424. ఈ విషయాలన్నీ కాలచక్రలో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన మరికొన్ని రహస్యాలు బయటికి రావడం లేదు.
హిమాలయాల్లోని శంభల దేశం
P.C: You Tube
ఇక హిందూ పురాణాలు కూడా ఈ శంభల దేశంలోనే కల్కీ భగవానుడు ఉద్భవిస్తాడని చెబుతోంది. అటు పై ఈ విశ్వం పై దండెత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేపడుతారని అనేక పురాణాలు చెబుతున్నాయి.
హిమాలయాల్లోని శంభల దేశం
P.C: You Tube
ఇదిలా ఉండగా ఈ శంభల దేశానికి సంబంధించిన ఒక విషయం ప్రచారంలో ఉంది. దీనిని అనుసరించి ఫ్రాన్స్ కు చెందిన చారిత్రక పరిశోధకురాలు, రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ తన 56 ఏళ్ల వయస్సులో టిబెట్ వచ్చారు.
హిమాలయాల్లోని శంభల దేశం
P.C: You Tube
అక్కడ కొంతమంది బౌద్ధ సన్యాసులను కలుసుకొన్నారు. వారి ద్వారా శంభల వెళ్లి అక్కడి మహిమాన్వితుల ఆశీర్వాలు తీసుకున్నరని చెబుతారు. అందువల్లే ఆమె 101 ఏళ్లు పూర్తి ఆరోగ్యంతో బతికారని చెబుతారు.
హిమాలయాల్లోని శంభల దేశం
P.C: You Tube
ఒక్క రష్యానే కాకుండా అనేక దేశాల వారు ఈ శంబల దేశం కోసం అనేక పరిశోధనలు చేశారు. ఇంకా చేస్తున్నారు. అయితే వారు ఈ శంభల దేశాన్ని ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్. దిఫర్బిడెన్ ల్యాండ్, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్, హిడన్ సిటీ తదితర పేర్లతో పిలుస్తున్నారు.