కేరళ కర్నాటక ప్రజలు ఈ క్షేత్రాన్ని ఎక్కువగా ఆరాధిస్తారు. ఇక్కడి దేవాలయాన్ని కోర్టుగా భావిస్తారు. సుప్రీం కోర్టులో కూడా పరిష్కారానికి నోచుకోని కేసులు ఈ దేవాలయంలో పరిష్కరించబడుతాయని చెబుతారు. అందుకే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తూ ఉంటారు. అటువంటి విభిన్న క్షేత్రానికి సంబంధించిన కథనం మీ కోసం...
ఆ క్షేత్రం ఏది
P.C: You Tube
కర్నాటక సరిహద్దులోని కాసరగూడ్ లో ఉన్న ఈ క్షేత్రాన్ని కానత్తూరు అని పిలుస్తారు. స్థానికంగా కానత్తూర్ నాలుగు దేవతల క్షేత్రంగా పిలుస్తారు. ఈ క్షేత్రం పేరు వింటూనే కొంతమంది భయపడుతారు. అంతటి పవర్ ఫుల్ క్షేత్రం ఈ దేవాలయం.
రాంచిలో చూడదగినవి, తినదగినవి ఇవే
అబద్దం చెబితే మరణమే
P.C: You Tube
విష్ణుమూర్తి, రక్తేశ్వరీ, రక్తచాముండి, ఉగ్రమూర్తి ప్రధాన దైవమూర్తులు. అందుకే ఈ క్షేత్రాన్ని నాలుగు దేవతల క్షేత్రంగా పిలుస్తారు. కోర్టులో ఎటువంటి పరిష్కారం లభించని క్షేత్రాలకు ఇక్కడ పరిష్కారం లభిస్తుందని చెబుతారు.
ప్రేతాత్మలకు విమోచనం
P.C: You Tube
ప్రేతాత్మల విమోచనం ఇక్కడ లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసుల్లో ఎవరి వైపు న్యాయం ఉంటే వారికి మాత్రమే ఆ సొమ్ము చేరుతుందని చెబుతారు. వివాహ సమస్యలకు కూడా ఈ క్షేత్రంలో పరిష్కారం లభిస్తుందని చెబుతారు. ఇటువంటి అనేక కేసులకు ఇక్కడ పరిష్కారం లభిస్తుంది.
ఈ క్షేత్రం నుంచే నోటీసు
P.C: You Tube
ఏదేని కేసుకు సంబంధించి కక్షిదారు ఈ క్షేత్రంలో ఫిర్యాదు చేస్తాడు. దీంతో ఆ క్షేత్రం నిర్వాహకులు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవతలి వైపువారికి నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు అందిన తక్షణం నోటీసులో పేర్కొన్న రోజున ఇరువైపుల వారు ఖచ్చితంగా ఈ క్షేత్రానికి రావాల్సి ఉంటుంది.
పార్వతీ దేవి నాట్యంలో ఓడిపోయింది ఇక్కడే
తప్పు చేసిన వాడికి శిక్ష
P.C: You Tube
ఒకవేళ ఈ క్షేత్రం నుంచి వచ్చిన నోటీసుని నిర్లక్ష్యం చేస్తే ఈ క్షేత్రానికి సంబంధించిన నిర్వాహకులు మరో నోటీసును పంపుతారు. ఇలా మొత్తం మూడు నోటీసులను పంపుతారు. మూడు సార్లు నోటీసుకు స్పంధించకుంటే ఈ క్షేత్ర నిర్వాహకులు ఇక్కడి దేవతలకు చెబుతారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే నోటీసును నిర్లక్షం చేసినవారిని ఆ దేవుడే శిక్షిస్తాడు. ఇటువంటి ఘటనలు ఎన్నో జరిగాయి.
అన్ని కులాలు, మతాల వారు
P.C: You Tube
హిందూ, ముస్లీం, క్రైస్తవులు ఇలా అన్ని రకాల కులాలు మతాలవారు ఈ క్షేత్రానికి వస్తారు. ఇక్కడికి వచ్చిన వారు ఈ క్షేత్రంలో ఇచ్చే తీర్పును ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. లేదంటే ఖచ్చితంగా ఆ దేవతల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.
పాదరక్షలను కానుకగా తీసుకునే దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా?
కడియాళి మహోత్సవం
P.C: You Tube
ఈ క్షేత్రంలో కడియాళి మహోత్సవంలో దేవతలను నేరుగా చూడవచ్చు. కానత్తూరు క్షేత్రంలో ఈ నలుగురు దేవతలకు భూతారాధన చేస్తారు. ఇక్కడి సంప్రదాయాలు నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి.
దేవుడి క`ప
P.C: You Tube
ఇక్కడ జరిగే కళియాట నాట్యం ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నాట్యం చేసేవారు ఒక వారం పాటు శాఖాహారాన్ని భుజిస్తారు. ఇక ఈ నాట్యం చేసే ముందు రోజు ద్రవ ఆహారాన్ని మాత్రం తీసుకొంటారు.
వీరికే మంగళ హారతులు
P.C: You Tube
వీరు ధరించే ఆభరణాలు, దుస్తులు చాలా బరువుగా ఉంటాయి. సామాన్యులు వాటిని మోయలేరని చెబుతారు. అందువల్లే ఈ నాట్యం చేసేవారిని దైవ సమానులుగా పూజిస్తారు. వీకి భక్తులు మంగళహారతులు ఇస్తారు.
ఇక్కడ లింగమయ్య ఆవు పొదుగు రక్తాన్ని అభిషేకంగా కోరుకొన్నాడు?
ముడుపులు ఖచ్చితంగా చెల్లించాలి
P.C: You Tube
సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ కోర్కెలు కోరిన వారు అవి తీరిన తర్వాత తప్పకుండా ముడుపులు చెల్లిస్తారు. ఈ ముడుపులు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం తప్పకుండా శిక్ష అనుభవిస్తారని చెబుతారు.