మన దేశంలో ఎన్నో లక్షల దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానిది ఒక్కొక్క విశిష్టత. అదే విధంగా ఇక్కడ ఆచారవ్యవహారాలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఒక దేవాలయంలోని ఆచారాలు చాలా సులభంగా ఉంటే మరికొన్నింటిలో ఆచారవ్యవహారాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక విభిన్న అత్యంత కఠినమైన ఆచారం సంప్రదాయంగా వస్తుంన్న ఓ దేవాలయానికి సంబంధించిన వివరాలు మీకోసం...
కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం
P.C: You Tube
ఈ ఆచారం చాలా కుతూహలంగా ఉంటుంది. అయితే ఆ ఆచారంలో పాల్గొనేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఒక్కొక్కసారి ప్రాణాలకే ముప్పు ఏర్పడవచ్చు. అదే అగ్ని కేళి ఆచారం.
కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం
P.C: You Tube
ఈ ఆచారంలో భాగంగా ఒకరి పై మరొకరు అగ్ని దివిటీలను విసురుకొంటారు. అగ్నికేళి ఆచారం చాలా ఏళ్లుగా అమల్లో ఉంది. ఈ ఆచారంలో కేవలం పురుషులు మాత్రమే పాల్గొంటారు.
కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం
P.C: You Tube
ఈ ఆచారంలో భాగంగా ఒకరి పై మరొకరు అగ్ని దివిటీలను విసురుకొంటారు. అగ్నికేళి ఆచారం చాలా ఏళ్లుగా అమల్లో ఉంది. ఈ ఆచారంలో కేవలం పురుషులు మాత్రమే పాల్గొంటారు.
కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం
P.C: You Tube
అర్థనగ్నంగా ఉన్న పురుషులు దివిటీలను వెలిగించి పట్టుకొంటారు. అటు పై ఒకరి పై మరొకరు ఈ దివిటీలను విసురుకొంటారు. ఈ విశేష సంప్రదాయం మంగళూరులోని కటీలు దుర్గాపరమేశ్వరీ దేవాస్థానంలో కొనసాగుతోంది.
కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం
P.C: You Tube
ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు ఈ దుర్గా పరమేశ్వరీ దేవస్థానానికి వస్తుంటారు. పురుషులు ఈ అగ్ని కేళిలో పాల్గొంటారు. శరీరం కింది భాగంలో దుస్తులను ధరిస్తారు.
కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం
P.C: You Tube
ఇక పై భాగం లో నూలుపోగు కూడా ఉండదు. ఒకరి పైకి మరొకరు దివిటీలను విసిరే సమయంలో చిన్నిచిన్న గాయాలు అవుతాయి. అయితే ఒక్కొక్కసారి ఈ గాయాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.
కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం
P.C: You Tube
ఇలా తీవ్రంగా గాయపూడిన వారికి అమ్మారికి కుంచుమార్చన చేయడానికి వినియోగించిన నీటిని దేహం పై పూస్తారు. దీని వల్ల వారికి నొప్పి మాయమవుతుందని చెబుతారు.
కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం
P.C: You Tube
అంతేకాకుండా సదరు గాయం కూడా త్వరగా సమసిపోతుందని చెబుతారు. ఈ అగ్నికేళ సంప్రదాయాన్ని ప్రతి ఏడాది ఏప్రిల్లో 8 రోజుల పాటు నిర్వహిస్తారు.
కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం
P.C: You Tube
ఈ జాతర రెండో రోజున లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఇందులో కొంతమంది ఈ ఉత్సవంలో పాల్గొనడానికి వేల కిలోమీటర్లు ప్రయాణం చేయడం విశేషం.
కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం
P.C: You Tube
వందల ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోందని చెబుతారు. తద్వారా వారికి సుఖశాంతులతో పాటు కోరిన కోర్కెలన్నీ తీరుతాయని చెబుతారు. ఈ అగ్నికేళిలో పాల్గొనే భక్తులు రెండు గుంపులుగా విభజిస్తారు.
కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం
P.C: You Tube
ఒక్కొక్క గుంపును 10 నుంచి 15 మీటర్ల దూరం నిలబెడుతారు. అటు పై ఒక గుంపు మరో గుంపు పై దివిటీలను విసురుతుంది. ఈ అగ్నికేళి కార్యక్రమంలో పాల్గొనేవారు ఒక్కొక్కరు ఐదు దివిటీలను మాత్రమే మరో గుంపు పైకి విసరాలన్న నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తారు.
కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం
P.C: You Tube
ఈ అగ్నికేళి ఉత్సవనం కేవలం 15 నిమిషషాలు మాత్రమే జరుగుతుంది. సముద్రతీర ప్రాంత దేవాలయాల్లో ఒకటైన కటిలు దుర్గాపరమేశ్వరి దేవాలయానికి ఏడాదిలో ఎప్పుడైనా వెళ్లవచ్చు.
కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం
P.C: You Tube
దసరా సమయంలో ఈ దేవాలయానికి వెళ్లడం మంచిదని స్థానికులు చెబుతూ ఉంటారు. మంగళూరుకు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. విమానాశ్రయం నుంచి ట్యాక్సీద్వారా ఈ దేవాలయానికి సులభంగా చేరుకోవచ్చు.
కటిలు దుర్గా పరమేశ్వరీ దేవాలయం
P.C: You Tube
మంగళూరుకు రైల్వేస్టేషన్ ఉంది. రైల్వే స్టేషన్ నుంచి దేవాలయానికి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. వివిధ నగరాల నుంచి మంగళూరుకు బస్సులు ఉన్నాయి. మంగళూరు బస్ స్టేషన్ నుంచి ఇక్కడికి వెళ్లడానికి ట్యాక్సీలు, అటోలు ఉంటాయి.