Search
  • Follow NativePlanet
Share
» »మేల్కొటే యోగ నరసింహస్వామిని దర్శిస్తే శతృబాధలుండవు, శాంతి, పుష్టి, జయం, ఆరోగ్యం, భోగం, ఐశ్వర్యాలు..

మేల్కొటే యోగ నరసింహస్వామిని దర్శిస్తే శతృబాధలుండవు, శాంతి, పుష్టి, జయం, ఆరోగ్యం, భోగం, ఐశ్వర్యాలు..

యోగ నరసింహస్వామిని దర్శిస్తే శతృబాధలుండవు, శాంతి, పుష్టి, జయం, ఆరోగ్యం, భోగం, ఐశ్వర్యాలు..

కర్ణాటక లోని మండ్య జిల్లాలో పాండవపురం తాలూకాలో మేల్కొటే క్షేత్రం కలదు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ కృష్ణ దేవాలయం ఉన్నది. ఇందులోని విగ్రహాన్ని శ్రీ రామానుజుడు ప్రతిష్టించారని ప్రశస్తి. ఇక్కడ స్వామి వారిని ' చల్ల పిళ్ళ రాయుడు' అంటారు. బహుసుందరుడులెండీ ..!

మైసూరుకు యాభై కిలోమీటర్ల దూరంలో ఈ చిన్న గ్రామముంది. ఇంకా చెప్పాలంటే టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నం, బృందావన్ గార్డెన్స్ దాటుకుని వెళితే జక్కనహళ్ళి వస్తుంది. అవును అమర శిల్పి జక్కన ఊరే! ఈ ఊరికి ఐదారు కిలోమీటర్ల దూరంలో మేల్కోటే ఉంది. చాలా మందికి మేల్కోటే అంటే 12వ శతాబద్దపు చెలువ రాయుని దేవాలయం. యువ తరానికయితే 'నరసింహ' సినిమాలో రెండు పెద్ద స్తంభాల మధ్య రజనీకాంత్ కూర్చొన్న దృశ్యం చిత్రీకరించిన స్థలం. తెలుగు టీవీ, సినిమా ప్రేక్షకులకు అయితే మేల్కోటే ఒక నటుడు. కానీ తెలిసిన వారికి ఇది దక్షిణాది బద్రినాథ్.

పురాణ గాధ ప్రకారం:

పురాణ గాధ ప్రకారం:

ఇక మేల్కోటే దేవాలయం గురించి చెప్పాలంటే కర్ణాటక రాష్ట్రంలోని తీర్థయాత్రా క్షేత్రాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ విష్ణువుదేవాలయాన్ని యోగనరసింహ స్వామికి అంకితం చేయబడినది. ఈ అద్భుతమైన ఆలయం యదుగిరి శిఖరంపై ఉంది. ఈ పవిత్రమైన ప్రదేశఆన్ని చాలా మంది భక్తులు సందర్శిస్తుంటారు. ఆధ్యాత్మికపరమైన క్షేత్రం, చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణంలో ఆలయ నిర్మాణం జరిగి ఉండటం వల్ల ఈ మేల్కొటే ఇటు ఆధ్యాత్మిక పరంగా, అటు పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది.

నరసింహ స్వామి పవిత్ర క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది

నరసింహ స్వామి పవిత్ర క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది

నరసింహ స్వామి పవిత్ర క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఈ ఆలయాన్ని హిరణ్యకశపుడు కుమారుడైన ప్రహ్లాదుడు చేత స్థాపించబడింది. హిరణ్యకశపుడును సంహరించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో అవతరించిన విషయం తెలిసిందే.

PC: Philanthropist 1

నరసింహస్వామి వారు పద్మపీఠంపై రెండు కాళ్లను కత్తెర వలె ఉంచి ప్రత్యేకమైన ఆసనంలో కనిపిస్తారు

నరసింహస్వామి వారు పద్మపీఠంపై రెండు కాళ్లను కత్తెర వలె ఉంచి ప్రత్యేకమైన ఆసనంలో కనిపిస్తారు

శరంలో సగభాగం సింహ రూపంతో, సగభాగం మనిషి రూపంలో దర్శనమిచ్చే ఈ నరసింహస్వామి వారు పద్మపీఠంపై రెండు కాళ్లను కత్తెర వలె ఉంచి ప్రత్యేకమైన ఆసనంలో కనిపిస్తారు. ఈ ఆసనాన్ని యోగాసనం అంటారు. యోగ రూపంలో దర్శనమిచ్చే దేవతలు ఈ ఆసనం లోనే ఉంటారు.

మూర్తి స్ఫటికకాంతి గల శరీరంతో

మూర్తి స్ఫటికకాంతి గల శరీరంతో

రెండు మోకాళ్లకు యోగపట్టిక వేసి ఉంటుంది. స్వామివారి రెండు చేతులు ముందుకు చాచి రెండు మోకాళ్లపై ఉంటాయి. వెనుక చేతులలో కుడివైపు చక్రాన్ని, ఎడమవైపు శంఖాన్ని ధరించి ఉంటాడు ఈ స్వామి వారిని కేవల నరసింహమూర్తి, గిరిజ నరసింహమూర్తి అని కూడా అంటారు పర్వతాలపై, గుహలలో ఇటువంటి రూపం మనకు దర్శనమిస్తుంది వైఖానసాగమం ఈ మూర్తి స్ఫటికకాంతి గల శరీరంతో ఉంటాడని చెప్పింది.

ఈ స్వామికి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నసింహ జయంతి

ఈ స్వామికి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నసింహ జయంతి

ఈ స్వామికి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నసింహ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, దివ్యప్రబంధపారాయణలు అందుకుంటాడు. ఈ స్వామికి ఉత్సవ విగ్రహం లేదు.

సింహవాహనంపై ఊరేగే మలయప్పస్వామివారు

సింహవాహనంపై ఊరేగే మలయప్పస్వామివారు

కానీ బ్రహ్మోత్సవాలలో వాహనసేవలలో సింహవాహనంపై ఊరేగే మలయప్పస్వామివారు మాత్ర ఈ యోగనరసింహస్వామివలె యోగాసనంతో దర్శనమిస్తారు. యోగనరసింహస్వామివారిని దర్శిస్తే శతృబాధలుండవనీ, శాంతి, పుష్టి, జయం, ఆరోగ్యం, భోగం, ఐశ్వర్యాలు కలుగుతాయని వైష్ణవాగమాలు చెబుతున్నాయి.

ఈ ఆలయం హొయసల కాలంలో నిర్మించబడింది

ఈ ఆలయం హొయసల కాలంలో నిర్మించబడింది

ఈ ఆలయం హొయసల కాలంలో నిర్మించబడింది. మైసూర్ పాలకుడు అయిన టిప్పు సుల్తాన్ తప్ప ఏఒక్కరూ భారీగా విరాళాలు ఇచ్చిన దాఖలాలు లేవు. 1785 లో ఆయన ఆలయానికి ఏనుగులను సమర్పించారు. ఈ ఆలయ గంటను మైసూర్ పరకాళామాత విరాళంగా ఇచ్చింది. ఈ ఆలయానికి బారీగా విరాళాలు ఇచ్చినది మైసూర్ పాలకులు.

PC: Philanthropist 1

వొడయార్ కుటుంబం బంగారు మరియు రత్నాలు-నిండిన ఆభరణాలు విరాళం

వొడయార్ కుటుంబం బంగారు మరియు రత్నాలు-నిండిన ఆభరణాలు విరాళం

వొడయార్ కుటుంబం బంగారు మరియు రత్నాలు-నిండిన ఆభరణాలు విరాళం ద్వారా అపారమైన భక్తిని చాటుకున్నారు. 1614 లో, మైసూర్ మహారాజ రాజ వడయార్ (1578-1617) శ్రీవైష్టవం దేవాలయంను దత్తత తీసుకుంది మరియు ఆలయం మరియు విజయనగర రాజు వెంకటపతి రాయా చేత ఇవ్వబడ్డ ఎస్టేట్ మెల్కోట్ వద్ద బ్రాహ్మణులకు అప్పగించారు. అతను ఆలయానికి బంగారు కిరీటం సమర్పించాడు. మైసూర్ యొక్క పూర్వ పాలకుడు, కృష్ణరాజ వొడయార్ III, యోగనరసింహస్వామికి మరొక బంగారు వజ్రాల పొదిగిన ధృఢమైన కిరీటం, వైరామిడితో పాటు ఆలయ దేవతకు బంగారు కిరీటం విరాళంగా ఇచ్చాడు.

ఇక్కడ దేవాలయంలో వివిధ దేవతల యొక్క శిల్పాలు అద్భుతంగా

ఇక్కడ దేవాలయంలో వివిధ దేవతల యొక్క శిల్పాలు అద్భుతంగా

ఇక్కడ దేవాలయంలో వివిధ దేవతల యొక్క శిల్పాలు అద్భుతంగా చెక్కిన చిత్రాలు ఉన్నాయి. అలాగే మంటపంలో రాతి స్తంభాలపై చెక్కిన శిల్పాలు వొడయూర్ చారిత్రకతకు నిదర్శనంగా ఉన్నాయి. ఈ దేవాలయ నిర్మాణంలో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం కార్మికుల అద్భుతమైన పనితనానికి ఈ ఆలయ నిర్మాణం నిదర్శణం. ఆలయం చేరుకోవడానికి కొండపైకి 300మెట్లను ఎక్కాల్సి ఉంటుంది.

 మేల్కొటే శ్రీవిష్ణవ భక్తులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రం

మేల్కొటే శ్రీవిష్ణవ భక్తులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రం

మేల్కొటే శ్రీవిష్ణవ భక్తులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఎందుకంటే 12 వ శతాబ్ద ప్రారంభంలో, ప్రసిద్ధ అద్వైత తత్వవేత్త మరియు తమిళనాడు నుండి ప్రశంసించిన శ్రీవైష్ణవ సెయింట్ శ్రీ రామనుజాచార్య మెలకోట్లో 12 సంవత్సరాలు నివసించాడు. మెలకూట్ జయలలిత జన్మస్థురాలు.

PC: Prathyush Thomas

మేల్కొటే ఎలా చేరుకోవాలి ?

మేల్కొటే ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : మేల్కొటే కు సమీపాన 180 km ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు.

రైలు మార్గం : మండ్య సమీప రైల్వే స్టేషన్. ఇది మేల్కొటే నుండి 55 km ల దూరంలో ఉన్నది.

రోడ్డు మార్గం : బెంగళూరు, మండ్య, మైసూర్ తదితర ప్రాంతాల నుండి మేల్కొటే కు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నడుస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X