తిరువన్నామలై తమిళనాడులోని ఉత్తరదిక్కున గల ఒక జిల్లా. ఇక్కడ వెలసిన అన్నామలై ఆలయం ఎంతో మహిమ గల దేవస్థానం సంవత్సరం పొడవునా తిరువన్నామలైలో పండుగలు జరుగుతాయి. 4 లక్షల మంది పర్యాటకులు ఈ పండుగలలో పాల్గొంటారు. పర్యాటకులు తిరువన్నామలైజిల్లాలోని ఒక ఆలయంలో ఈ నంది విగ్రహాన్ని చూడవచ్చును. ఇక్కడ గల విశేషం ఏమంటే ఈ సంఘటన ఏడాదికి ఒకసారి మాత్రమే జరుగుతుంది.
సంవత్సరానికి ఒకసారి బంగారు రంగులో మారే నంది! బయట పడిన సీక్రెట్స్!
ఎక్కడ వుంది?
ఈ మహిమకల దేవాలయం తిరువన్నమలై జిల్లాలోని చెంగమ్ అనే ఒక వూరిలో ఉంది. ఈ దేవాలయాన్ని వృషభేశ్వర్ ఆలయం అని పిలుస్తారు.
సంవత్సరానికి ఒకసారి బంగారు రంగులో మారే నంది! బయట పడిన సీక్రెట్స్!
పురాతనమైన ఆలయం
ఈ శివాలయం 200 సంవత్సరాల పురాతనమైనది. అయినా ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే వుంది.
సంవత్సరానికి ఒకసారి బంగారు రంగులో మారే నంది! బయట పడిన సీక్రెట్స్!
ఈ దేవాలయంలోని నంది ప్రత్యేకత
ఈ దేవాలయం నంది చాలా ప్రత్యేకమైనది. పర్యాటకులు ఈ బంగారు నందిని సందర్శిచటానికి అధికసంఖ్యలో వస్తూవుంటారు.
సంవత్సరానికి ఒకసారి బంగారు రంగులో మారే నంది! బయట పడిన సీక్రెట్స్!
సూర్యుని కాంతి
ఈ అద్భుతమైన సంఘటన ( తమిళంలో పెంగునీ నెల 3 వ రోజు అనగా ) మనకు మార్చి నెలలో అంటే బాగా వేసవి కాలమన్నమాట. ఈ నెలలో మూడవ రోజు ప్రతి సంవత్సరం మిరుమిట్లు గొలిపే బంగారుకాంతితో దర్శనమిస్తుంది.ఈ అద్భుతమైన సంఘటనను చూసేందుకు దేశ విదేశాల నుండి పర్యాటకులు వస్తూవుంటారు.
సంవత్సరానికి ఒకసారి బంగారు రంగులో మారే నంది! బయట పడిన సీక్రెట్స్!
వేణుగోపాల పార్ధసారథి ఆలయం
ఇక్కడికి అతి దగ్గరలో చూడగల ఆలయం 700 సంవత్సరాల పురాతనమైన వేణుగోపాల పార్ధసారథి ఆలయం. ఈ పురావస్తు ప్రదేశాలంలో గల అనేక కళాఖండాలను అనేక మంది ప్రముఖులు వచ్చి సందర్శించారు. ఈ ఆలయ నిర్మాణం తిరువన్నామలై అన్నామలైయర్ ఆలయాన్ని పోలివుంటుంది. అంతే కాకుండా చెంగం అనేకమైన పర్యాటక ఆకర్షణలతో నిండి ఉంది.
సంవత్సరానికి ఒకసారి బంగారు రంగులో మారే నంది! బయట పడిన సీక్రెట్స్!
ఇక్కడ సందర్శించదగిన ఇతర పర్యాటక ప్రదేశాలు
సత్తనూర్ డ్యామ్
సత్తనూర్ డ్యామ్ ఇక్కడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరువన్నామలై జిల్లాలోని చెన్నకేశవ పట్టణంలో నెలకొని వుంది ఈ డ్యామ్. ఇది తమిళనాడులోని అత్యంత ముఖ్యమైన ఆనకట్టలలో ఒకటి. ఆనకట్ట 1958 లో కామరాజ్ చేత నిర్మించబడింది.
సంవత్సరానికి ఒకసారి బంగారు రంగులో మారే నంది! బయట పడిన సీక్రెట్స్!
మొసళ్ళ పార్కు
ఈ డ్యామ్ దగ్గరలోనే ఒక మొసళ్ళ పార్కు కూడా వుంది. ఈ అందమైన ఉద్యానవనం ఆసియాలో అతిపెద్ద మొసళ్ళ పార్కులలో ఒకటి. ఈ పార్క్ 7321 మిలియన్ క్యూబిక్ అడుగులు వుంది. దీని యొక్క పొడవు 119 అడుగుల పొడవు. ఈ డ్యామ్ తిరువన్నామలైతో సహా అనేక ప్రాంతాల్లో త్రాగునీరు మరియు నీటిపారుదల సౌకర్యాలను కలుగజేస్తుంది.
సంవత్సరానికి ఒకసారి బంగారు రంగులో మారే నంది! బయట పడిన సీక్రెట్స్!
కుప్పనత్తం డ్యామ్
కుప్పనత్తం డ్యామ్ ఈ గుడి నుండి 15 కిలోమీటర్ల దూరంలో వుంది.
సంవత్సరానికి ఒకసారి బంగారు రంగులో మారే నంది! బయట పడిన సీక్రెట్స్!
తీర్థమలై
తీర్థమలై ఇక్కడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తీర్థమలై జిల్లా ధర్మపురి జిల్లాలో ఉంది. ఈ ఆలయం త్రివేండ్రం కొండపైన వెలసియున్నది.
సంవత్సరానికి ఒకసారి బంగారు రంగులో మారే నంది! బయట పడిన సీక్రెట్స్!
రామన్ పల్లి
రాముడు రావణుని సంహరించి అయోధ్యకి తిరిగి వచ్చిన ప్రదేశమని నమ్ముతారు. హనుమాన్ తీర్థం ఇక్కడ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పాపాలు పోయే ప్రదేశం.
సంవత్సరానికి ఒకసారి బంగారు రంగులో మారే నంది! బయట పడిన సీక్రెట్స్!
జింజీ ఫోర్ట్, సెంజికోట
ప్రసిద్ధిగాంచిన జింజీ ఫోర్ట్ ఇక్కడి నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ కోట తమిళనాడులో మిగిలివున్న కొన్ని కోటలలో ఒకటి. మరాఠా పరిపాలకుడైన శివాజీ, "భారతదేశంలోని అంతర్గత కోటలలో ఇది ఉత్తమమైనది" అని చెప్పుకునే కోట. బ్రిటిష్ వారు దీనిని "ఈస్ట్ ట్రోయ్" అని పిలిచారు.
సంవత్సరానికి ఒకసారి బంగారు రంగులో మారే నంది! బయట పడిన సీక్రెట్స్!
ఎలా చేరుకోవాలి?
చెన్నై నుండి 160 కిలోమీటర్ల దూరంలో మరియు తిరువన్నమలై నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉంది. తమిళనాడు లోని అనేక పట్టణాల నుండి తిరువన్నమలై నుండి పాండిచేరి వరకు బస్సు సర్వీసులు ఉన్నాయి. చెన్నై వెళ్ళే మార్గంలో దిందివానం నుండి ఈ కోటను సులభంగా చేరుకోవచ్చు.
సంవత్సరానికి ఒకసారి బంగారు రంగులో మారే నంది! బయట పడిన సీక్రెట్స్!
కల్పలార్ వల్లలార్ ఆలయం
తిరువన్నామలై నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న వల్లాలార్ ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది.